పోలవరం ప్రాజెక్ట్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ జగన్ సర్కార్ చూపిస్తున్న అత్యుత్సాహానికి కేంద్రం చెక్ పెట్టబోతోందా? పోలవరం ప్రాజెక్ట్ పనుల్ని కేంద్రమే స్వయంగా చేపట్టేందుకు చర్యలు తీసుకోబోతోందా.? రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రం ఈ ప్రాజెక్ట్ బాధ్యతల్ని పూర్తిగా తీసుకోబోతోందా? ఈ ప్రశ్నలకు ‘ఔను’ అనే సమాధానం వస్తోంది. పోలవరం ప్రాజెక్ట్పై ఇప్పటిదాకా బీజేపీ ఎన్ని ఆరోపణలు చేసినా, అవన్నీ రాజకీయాలతో ముడిపడి వున్నవే. ఈ విషయం మరోమారు స్పష్టమయ్యింది.
పోలవరం ప్రాజెక్ట్కి సంబంధించి కాంట్రాక్టర్స్ ఇప్పటిదాకా పనులు బాగా చేసినట్లు పోలవరం అథారిటీ తాజాగా సర్టిఫై చేసింది. దాంతో, ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ జగన్ సర్కార్కి షాక్ తగిలినట్లయ్యింది. పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని రాజకీయ ఆరోపణలు చేయడం వేరు, అధికారంలోకి వచ్చాక.. అవినీతి ఆరోపణల పేరుతో, ప్రాజెక్టు కాంట్రాక్టుని రద్దు చేయడం వేరు. ‘రద్దు’ చర్యలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు, అవినీతిని నిరూపించాలి. ఈ విషయమై కాంట్రాక్ట్ సంస్థ నవయుగ, కేంద్రంతో టచ్లోకి వెళ్ళిందనే ప్రచారం జరుగుతోంది.
మరోపక్క, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, రాష్ట్ర ప్రభుత్వం తీరుపై అసహనం వ్యక్తం చేయడం గమనార్హం. ఇప్పటికే పార్లమెంటు సాక్షిగా కేంద్రం, పోలవరం ప్రాజెక్టు విషయంలో వైఎస్ జగన్ సర్కార్ వ్యవహరిస్తున్న వైఖరిపై అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెల్సిందే. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి పోలవరం ప్రాజెక్టు పనులు అప్పగించడం వల్ల ప్రయోజనం లేదనీ, 30 శాతం పనులే మిగిలి వున్న దరిమిలా, కేంద్రమే ఆ బాధ్యతలు తీసుకుని త్వరితగతిన నిర్మిస్తే, రాజకీయంగానూ బారతీయ జనతా పార్టీకి లబ్ది చేకూరే అవకాశాలున్నాయన్న ఆలోచన కేంద్ర ప్రభుత్వ పెద్దలు చేస్తున్నారని సమాచారమ్. అదే జరిగితే, ముఖ్యమంత్రి వైఎస్ జగన్కి అది చాలా పెద్ద ఎదురుదెబ్బ కాబోతోందని నిస్సందేహంగా చెప్పొచ్చు.
262859 834770My plate is real full and your tryna give me a lot more food, boy what the fuck is wrong wit you?!|guruisthebomb| 205782
489510 992799I see something actually interesting about your internet website so I saved to bookmarks . 832203