2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్ కు అమరావతిని రాజధాని నగరంగా ఏర్పాటు చేశారు. రాజధాని భూమి పూజకోసం నరేంద్ర మోడీతో సహా అనేకమంది హాజరయ్యారు. అట్టహాసంగా భూమి పూజా కార్యక్రమాలు జరిగాయి. కొన్ని తాత్కాలిక నిర్మాణాలు జరిగాయి. అయితే, 2019 ఎన్నికల తరువాత తెలుగుదేశం పార్టీ ఓటమిపాలవ్వడం, వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అమరావతిపై నీలి మేఘాలు కమ్ముకున్నాయి.
అయితే, ఎపి రాజధానిని అమరావతి నుంచి మారుస్తున్నారు అనే టాక్ రావడంతో రాజధాని ప్రాంతంలోని రైతులు భయపడ్డారు. అయితే, రాజధానిని అమరావతిని గుర్తిస్తూ ఇటీవలే కేంద్రం ఇండియా మ్యాప్ ను రిలీజ్ చేసింది. ఎప్పుడైతే ఇండియా మ్యాప్ లో అమరావతి ఉన్నదో అప్పుడే అమరావతి నిర్మాణంలో చలనం రావడం మొదలైంది.
అప్పటి వరకు అమరావతి నిర్మాణం విషయంలో అవాకులు చవాకులు పేలిన బొత్సా వంటి నేతలు సైలెంట్ అయ్యారు. అమరావతి నిర్మాణం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. అమరావతి కోసం ఇప్పటి కేంద్రం విడుదల చేసిన నిధుల గురించిన వివరాలను రాజ్యసభలో పేర్కొన్నది. అమరావతికి స్మార్ట్ సిటీస్ మిషన్ కింద రూ.496 కోట్లు రిలీజ్ చేసినట్టు చెప్పింది. అందులో రూ. 472 కోట్లు ఖర్చు చేసినట్టుగా కూడా కేంద్రం పేర్కొన్నది.
స్మార్ట్ సిటీస్ మిషన్ భాగంగా ఎంపిక చేసిన విశాఖ, తిరుపతి, కాకినాడ నగరాలకు వరసగా రూ. 299, రూ. 196, రూ.392 కోట్లు కేంద్రం నుంచి ఇచ్చినట్టు కేంద్ర మంత్రి హార్దిక్ సింగ్ పూరి రాజ్యసభలో పేర్కొన్నారు.
367432 325333I like this web internet site quite a lot, Its a really good billet to read and obtain information . 317454
38421 226432Fantastic post, I conceive weblog owners really should acquire a lot from this web blog its real user pleasant. 228335