ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమద్య గాలి ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందదు అంటూ ప్రకటన చేసింది. ఆతర్వాత తన ప్రకటన సరి చేసుకుంటూ గాలి ద్వారా కరోనా వ్యాపించే అవకాశం కూడా ఉందని పేర్కొంది. ఈ గందరగోళ ప్రకటన నేపథ్యంలో జనాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయమై హైదరాబాద్ కు చెందిన సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యూలర్ బయాలజీ వారు ప్రయోగంను చేసింది. వైరస్ ఉన్న వ్యక్తులు తుమ్మినా దగ్గినా కూడా వారి ద్వారా గాలిలోకి వైరస్ వస్తుంది.
ఆ సమయంలో వారికి సమీపంలో ఎవరు ఉన్నా కూడా గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. అయితే అది కొన్ని నిమిషాలు మాత్రమే అంటూ ఈ ప్రయోగంలో వెళ్లడి అయ్యింది. వైరస్ ఉన్న రోగులను ట్రీట్ చేసే వారు లేదా వారితో ఉండే వారు మాస్క్ పెట్టుకోవడం వల్ల వైరస్ నుండి దూరంగా ఉండే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
కరోనా వైరస్ గాలి ద్వారా వ్యాపించే అవకాశాలు ఎక్కువే. కాని చాలా తక్కువ సమయం మాత్రమే వైరస్ గాలిలో ఉంటుందని నిపుణుల బృందం చేసిన అధ్యాయంలో వెళ్లడి అయ్యింది.