Switch to English

అమరావతిపై ఈ ‘కులాల కుంపటి’ చల్లారేదెప్పుడు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి విషయంలో మొదటి నుంచీ ‘కులం’ పేరుతో ఆరోపణలు వెల్లువెత్తుతూనే వున్నాయి. ఓ బలమైన సామాజిక వర్గ ప్రముఖులు చంద్రబాబు హయాంలో అమరావతిపై ‘కన్నేసిన’ మాట వాస్తవం. అప్పట్లో అమరావతి ఆ సామాజిక వర్గం చెప్పుచేతల్లోకి వెళ్ళిపోయిన మాట కూడా వాస్తవమే. అమ్మకాలు, కొనుగోళ్ళలో ఆ సామాజిక వర్గం పెత్తనమే గట్టిటా నడిచింది. అలాగని, అమరావతి ప్రాంతానికి కులాన్ని ఆపాదించగలమా.? ప్రభుత్వం మారింది.. అమరావతిపై ‘కులం ముద్ర’ అలాగే వుంది.

ఈ కారణంగానే అమరావతితోపాటు మరో రెండు కొత్త రాజధానులు ప్రచారంలోకి వచ్చాయి. అమరావతిని కేవలం శాసన రాజధానికే పరిమితం చేసి, ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ని విశాఖకి, న్యాయ రాజధానిని కర్నూలుకి తీసుకెళ్ళేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ‘ఏ సామాజిక వర్గం ఎంత భూమిని అమరావతికి ఇచ్చింది.?’ అన్న విషయమై లెక్కలు తీస్తున్నారు కొందరు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఆ లెక్కలు విస్తృతంగా ప్రచారమవుతున్నాయి. ‘అధికార పార్టీ చెప్పిన లెక్క తప్పు.. కమ్మ సామాజిక వర్గం ఇచ్చిన భూమి ఇంత.. కాపు సామాజిక వర్గం ఇచ్చిన భూమి ఇంత.. దళితుల భూముల లెక్కలు ఇంత.. బీసీల భూముల లెక్కలు ఇంత..’ అంటూ లెక్కలు చూపిస్తూ, ‘ఇప్పుడేమంటావ్‌.?’ అంటూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ని సూటిగా ప్రశ్నిస్తున్నారు కొందరు నెటిజన్లు.

ఇదే, ఈ ‘కుల లెక్కల’ పిచ్చి కారణంగా ఆంధ్రప్రదేశ్‌ ఇలా తగలడింది. అప్పుడు వైసీపీ ఇదే చేసింది.. ఇప్పుడు టీడీపీ అదే చేస్తోంది. అంతిమంగా రాష్ట్రానికే అన్యాయం జరుగుతోంది. ఇదిలా వుంటే, హైకోర్టులో రాష్ట్ర రాజధాని / రాజధానుల అంశం గురించీ, హైకోర్టు నిర్మాణం గురించీ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. గవర్నర్‌ ఆమోదం పొందితే, ప్రభుత్వం మూడు రాజధానుల విషయమై ముందడుగు వేసేస్తుంది గనుక.. ఈ విషయమై జోక్యం చేసుకోవాలన్నది ఓ పిటిషన్‌ సారాంశం. అయితే, సంబంధిత బిల్లులకు గవర్నర్‌ ఆమోద ముద్ర వేసినా, న్యాయ సమీక్షకు అవకాశం వుంటుందని న్యాయస్థానం తేల్చి చెప్పింది.

మరోపక్క, ప్రస్తుత హైకోర్టు భవనం, అవసరాలకు తగిన విధంగా లేదనీ, కొత్త హైకోర్టు నిర్మాణం అవసరం వుందంటూ దాఖలైన పిటిషన్‌పైనా విచారణ జరిగింది. ఈ రెండు పిటిషన్లపైనా విచారణ ఆగస్ట్‌ 6వ తేదీకి వాయిదా వేశారు. మొత్తమ్మీద, ఓ వైపు గవర్నర్‌ వద్ద పంచాయితీ, ఇంకో వైపు కేంద్రం ఆరా, మరో వైపు హైకోర్టులో పిటిషన్లు.. ఇవన్నీ ఓ ఎత్తు.. రాజధాని చుట్టూ ఇంకా కుల జాడ్యం కొనసాగుతుండడం ఇంకో ఎత్తు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

ఎక్కువ చదివినవి

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన ‘బాక్’ సినిమా సంగతేంటి.? పాస్ అయ్యిందా.?...

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు మేకర్స్. ఈక్రమంలోనే టాలీవుడ్, బాలీవుడ్ కి...

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...