టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడి మీద విమర్శలు చేసే క్రమంలో మంత్రి కొడాలి నాని చూపిన అత్యుత్సాహం.. ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రభుత్వానికీ పెద్ద తలనొప్పిగా మారింది. మరీ ముఖ్యంగా, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి శ్రీవెంకటేశ్వరస్వామి దేవాలయంపై కొడాలి నాని చేసిన పరోక్ష వ్యాఖ్యల్ని బీజేపీ తప్పుపడుతోంది.
ఈమేరకు బీజేపీ నేతలు, పోలీసులకు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేయబోతున్నారు. ఏపీ బీజేపీ నేత భానుప్రకాష్ నేతృత్వంలో తిరుపతి పోలీసులకు ఆల్రెడీ ఈ విషయమై ఫిర్యాదు వెళ్ళింది. హిందువుల మనోభావాల్ని దెబ్బతీసేలా కొడాలి నాని వ్యవహరించారన్నది భానుప్రకాష్ అండ్ టీమ్ చేస్తున్న ఆరోపణ. మరోపక్క, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న క్రమంలో డిక్లరేషన్ ఇవ్వకపోవడమూ చట్ట విరుద్ధమని భానుప్రకాష్ ఆరోపిస్తున్నారు.
ఈ మేరకు డిక్లరేషన్ నిబంధనల తాలూకు వివరాల్ని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది భాను ప్రకాష్ అండ్ టీమ్. చాలాకాలంగా వైఎస్ జగన్పై ‘డిక్లరేషన్’ వివాదం వుంది. వైఎస్ కుటుంబం క్రిస్టియానిటీ మతంలోకి చాలాకాలం క్రితమే మారిపోయిన విషయం విదితమే. అయితే, ఏ రాజకీయ పార్టీకి చెందిన నేతలైనా, మతాలకతీతంగా వ్యవహరిస్తుంటారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి ఏనాడూ ఇలాంటి వివాదాలకు ఆస్కారం ఇవ్వలేదు. అయితే, వైఎస్ జగన్ మీద మాత్రం ఈ తరహా వివాదాలు ఎక్కువగా విన్పిస్తుండడం గమనార్హం.
వివాదాలకు ఫుల్స్టాప్ పెట్టే క్రమంలో డిక్లరేషన్ మీద వైఎస్ జగన్ సంతకం చేసేసి వున్నా బావుండేదే. అలా డిక్లరేషన్ గురించి టీడీపీ అడుగుతున్నందుకే, తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామి దేవాలయాన్ని ‘డాష్ డాష్..’ అంటూ కొడాలి నాని నోరు జారేసిన విషయం విదితమే. మంత్రి వర్గం నుంచి తక్షణం కొడాలి నానిని బర్తరఫ్ చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తున్న దరిమిలా, ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి ఎలా స్పందిస్తారో ఏమో.! అన్నట్టు, కొడాలి నాని చంద్రబాబు విమర్శించిన స్థాయిలో నరేంద్ర మోడీని విమర్శించే సాహసం చేస్తారంటారా.?
803304 958541Very educating story, saved your site for hopes to read much more! 563031