ఓ 30 ఏళ్ళ కుర్రాడు ఇండియా నుంచి వెళ్ళి పాకిస్తాన్లో ఇరుక్కుపోయాడు. అక్కడి పోలీసులు అతన్ని కోర్టులో హాజరు పరిచారు. జైలుకు కూడా తరలించారట. ఈ వ్యవహారం పాకిస్తాన్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. ఆ కుర్రాడి స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం కావడంతో ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి.
ప్రస్తుతం సదరు కుర్రాడి తల్లిదండ్రులు హైద్రాబాద్లో నివాసం వుంటున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన ఆ కుర్రాడి పేరు ప్రశాంత్. బెంగళూరులో ఓ ఐటీ కంపెనీలో పనిచేసేవాడట. ఆ తర్వాత హైద్రాబాద్ వచ్చేశాడట. తమ కుమారుడు కన్పించడంలేదంటూ 2017లోనే ప్రశాంత్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతకీ, ప్రశాంత్ ఎందుకు పాకిస్తాన్కి వెళ్ళినట్లు.? ఈ ప్రశ్నకే సమాధానం దొరకడంలేదు.
ప్రశాంత్, పాకిస్తాన్కి వెళ్ళినట్లు ఏడెనిమిది నెలల క్రితమే ‘రా’ (రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్) పసిగట్టిందనే ప్రచారం జరుగుతోంది. హనీట్రాప్ లాంటి వ్యవహారాల్లో ప్రశాంత్ ఇరుక్కున్నాడా.? అన్న అనుమానాలూ తలెత్తుతున్నాయి. ‘నెల రోజుల్లో వచ్చేస్తా..’ అంటూ ఓ వీడియో సందేశంలో ప్రశాంత్ ధీమాగా చెబుతున్నదాన్నిబట్టి అతని మానసిక పరిస్థితిపైనా కొన్ని అనుమానాలు కన్పిస్తున్నాయి.
ప్రశాంత్ మంచివాడనీ, దేశానికి ద్రోహం చేసే వ్యక్తి కాదనీ ఆయన తండ్రి చెబుతున్నారు. కాగా, ప్రశాంత్ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామనీ, అతన్ని తిరిగి భారతదేశానికి రప్పించేందుకు ప్రయత్నిస్తామనీ పోలీస్ ఉన్నతాధికారులు చెబుతున్నారు.
ఇప్పటికే కుల్భూషన్ జాదవ్ అనే మాజీ నేవీ అధికారి పాకిస్తాన్ చెరలో వుండగా, ఆ వ్యవహారాన్ని అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ ఏ స్థాయిలో భారత్పై విషం చిమ్మడానికి ఉపయోగించుకుంటోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక, ప్రశాంత్తోపాటు మరో భారతీయ యువకుడ్నీ పాకిస్తాన్ పోలీస్ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
766735 24462I conceive this web web site contains some rattling fantastic information for every person : D. 694035
27951 263472superb post. Neer knew this, appreciate it for letting me know. 319886