తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడిని ‘కట్టప్ప’గా అభివర్ణించారు బీజేపీ సీనియర్ నేత సునీల్ దేవ్ధర్. ఎట్టి పరిస్థితుల్లోలనూ ఇంకోసారి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారాయన. ‘చంద్రబాబు, భారతీయ జనతా పార్టీకి వెన్నుపోటు పొడిచారు. కానీ, ఇప్పుడు బీజేపీతో మళ్ళీ కలవాలనుకుంటున్నారు. చంద్రబాబు తన తప్పుని తెలుసుకుంటే మంచిదే. కానీ, ఆయన్ని దగ్గరకు రానివ్వబోం..’ అని సునీల్ దేవ్ధర్ స్పష్టం చేసేశారు.
టీడీపీతోనే కాదు, ఆంధ్రప్రదేశ్లో వైసీపీతోగానీ, జనసేన పార్టీతోగానీ పొత్తు పెట్టుకునే ఆలోచన ప్రస్తుతానికి లేదని అంటున్నారు సునీల్ దేవ్ధర్. అయితే, ఢిల్లీ స్థాయిలో టీడీపీ – బీజేపీ మధ్య చర్చలు ప్రారంభమయినట్లే తెలుస్తోంది. మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఈ చర్చల వ్యవహారానికి మధ్యవర్తిత్వం వహిస్తున్నారు. చంద్రబాబు ప్రతిపక్ష నేతగా వైఫల్యం చెందారంటూ పదే పదే మీడియా ముందు సుజనా చౌదరి చెబుతున్నా, తెరవెనుక చంద్రబాబుతో ఆయన సన్నిహిత సంబంధాలు నడుపుతున్నారన్నది నిర్వివాదాంశం.
నిజానికి బీజేపీతో చర్చల కోసమే చంద్రబాబు, సుజనా చౌదరితోపాటు సీఎం రమేష్ని బీజేపీలోకి పంపించినట్లు చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. అందులో నిజం లేదని ఎలా అనుకోగలం.? వాజ్పేయి హయాంలో టీడీపీ – బీజేపీ పొత్తు నడిచింది. ఆ తర్వాత, బీజేపీని నానా రకాలుగా చంద్రబాబు తూలనాడారు. బీజేపీ ఈ విషయంలో తక్కువేమీ తిన్లేదు.
మళ్ళీ ఆ తర్వాత ఇద్దరూ జతకట్టారు 2014 ఎన్నికల సమయంలో. 2019 ఎన్నికల నాటికి పొత్తు వికటించింది. మళ్ళీ ఇంకోసారి ఈ రెండు పార్టీల మధ్య పొత్తు చిగురించకూడదన్న రూల్ అయితే ఏమీ లేదు కదా.! ఏపీలో సొంతంగా ఎదగాలని బీజేపీ అనుకుంటున్నా, అందుకు తగ్గ అనుకూల పరిస్థితులైతే బీజేపీకి కన్పించడంలేదన్నది నిర్వివాదాంశం. ఈ నేపథ్యంలో ఏదో ఒక పార్టీతో పొత్తు ఒక్కటే బీజేపీ ముందున్న బెస్ట్ ఆప్షన్ అనుకోవాలేమో.! ఆ పార్టీ టీడీపీ అవుతుందా.? వేచి చూడాల్సిందే.
343913 200327Also, weblog regularly and with intriguing material to keep individuals interested in coming back and checking for updates. 763331
418464 578020How may be the new year going? I hope to read far more intriguing posts like last year 373452