BCCI : ఐపీఎల్ – 2023 లో భాగంగా మంగళవారం చెన్నై సూపర్ కింగ్స్( CSK), గుజరాత్ టైటాన్స్( GT) మధ్య జరిగిన ప్లే ఆఫ్ తొలి క్వాలిఫైయర్ మ్యాచ్ లో ఓ విచిత్ర ఘటన చోటుచేస్తుంది. గుజరాత్ బౌలర్లు బౌలింగ్ చేస్తుండగా.. బౌలర్ డాట్ బాల్ వేసినప్పుడల్లా బ్లాక్ స్పాట్ బదులు ఒక చెట్టు బొమ్మ ఆవిష్కృతమైంది. మ్యాచ్ చూస్తున్న వాళ్ళందరూ దీని గురించే చర్చించుకోవడం మొదలుపెట్టారు. బ్లాక్ డాట్ పడినప్పుడల్లా ఈ చెట్టు ఏంటబ్బా అనుకున్నారు.
ఈ ట్రీ సింబల్ వెనక బీసీసీఐ( BCCI) గొప్ప కార్యాన్ని తలపెట్టింది. ఈ ప్లే ఆఫ్ లో ఒక్కో డాట్ బాల్ కు 500 చెట్లు పెంచాలని నిర్ణయించింది. పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో తమ వంతుగా చెట్లు నాటేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బిసిసిఐ వర్గాలు తెలిపాయి. ఈ విషయాన్ని మ్యాచ్ సమయంలో కామెంట్రీ ఇస్తున్న సైమన్ డౌల్ కూడా కన్ఫార్మ్ చేశాడు.
మరోవైపు నిన్నటి మ్యాచ్ లో మొత్తం 84 డాట్ బాల్స్ నమోదయ్యాయి. దీంతో 42 వేల మొక్కలు నాటనుంది.