ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండూ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఎన్నికలను తమ జీవన్మరణ సమస్యగానే భావిస్తున్నాయి. గెలుపు కోసం సర్వ శక్తులూ ఓడ్డుతున్నాయి. విజయం సాధించడానికి ఉన్న ఏ మార్గాన్నీ కూడా వదిలిపెట్టడంలేదు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొత్తగా స్టార్ క్యాంపెయినర్లు అంటూ ఎవరూ లేరు. ఆ పార్టీకి సంబంధించినంత వరకు అన్నీ జగనే. పార్టీ భారం మొత్తం ఆయనపైనే ఉంది. తాజాగా ఆయన సోదరి షర్మిల, తల్లి విజయమ్మ జగన్ కు తోడుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే, టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం తమ ప్రచారానికి జాతీయ నేతల సహాయం తీసుకుంటున్నారు.
ఓవైపు తాను రాష్ట్రం చుట్టేస్తూ.. మరోవైపు ఇతర పార్టీల నేతలతో ప్రచారం చేయిస్తున్నారు. జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాతోపాటు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీల సేవలను వినియోగించుకున్నారు. ఫరూక్ అబ్దుల్లా, కేజ్రీవాల్.. చంద్రబాబు మనసెరిగి ప్రచారం చేశారు. అంటే వైఎస్సార్ సీపీ అధినేత జగన్ లక్ష్యంగా విమర్శలు చేశారు. ఆయనకు అధికారం అప్పగించొద్దని కోరారు.
ఫరూక్ అయితే ఓ అడుగు ముందుకేసి, వైఎస్ మరణానంతరం తనకు సీఎం పదవిస్తే రూ.1500 కోట్లు ఇస్తారని ఆఫర్ చేశారని సంచలన ఆరోపణలు చేశారు. అయితే, కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం సంబంధం లేని ఫరూక్ అబ్దుల్లా ఈ విషయం చెప్పడంతో ఎవరూ నమ్మలేదు. పైగా అదంతా అబద్ధమంటూ కాంగ్రెస్ ఖండించడంతో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. మరోవైపు కేజ్రీవాల్ మాత్రం జగన్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. చంద్రబాబు కోరుకున్నట్టుగానే జగన్ పై ఆరోపణలు చేశారు.
అయితే, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మాత్రం ఈ విషయంలో జగన్ ను ఒక్క మాట కూడా విమర్శించలేదు. విశాఖపట్నంలో ఆదివారం ఆర్భాటంగా ఏర్పాటుచేసిన సభలో మమత పాల్గొన్నారు. అయితే, ఆమె ప్రసంగం మొత్తం ప్రధాని మోదీ చుట్టూనే తిరిగింది. తాను ఓ జాతీయ నేత అని, లోకల్ పాలిటిక్స్ తో తనకు ఏం సంబంధం అన్నట్టుగా.. మోదీనే లక్ష్యం చేసుకుని విమర్శలు గుప్పించారు.
ఈసారి మోదీ ఇంటికే అని, ఢిల్లీ పీఠం తమదేనంటూ వ్యాఖ్యలు చేశారు. ఏపీ అభివృద్ధి చెందాలంటే చంద్రబాబునే మరోసారి ఎన్నుకోండనే మాట మినహా రాష్ట్రానికి సంబంధించి ఆమె ఏమీ మాట్లాడకపోవడం చంద్రబాబుతోపాటు ఆ పార్టీ కేడర్లో నిరాశ కలిగించిందని సమాచారం. కేజ్రీవాల్ ఆరోపణలు చేసినట్టుగానే మమత కూడా జగన్ పై ఆరోపణలు చేయాలని బాబు భావించారు.
అయితే, ఆమె అస్సలు జగన్ ప్రస్తావనే తీసుకురాలేదు. పైగా ప్రసంగాలు ముగిశాక నేతలందరూ వేదికపై చేతులెత్తి సంఘీభావం ప్రకటించడం చూస్తుంటాం. ఇందుకు చంద్రబాబు ప్రయత్నించగా.. మమత పట్టించుకోలేదు. వాస్తవానికి ఈ విషయంలో మమత వ్యూహం కూడా సరైనదే అంటున్నారు.
ప్రధాని రేసులో ఉన్న మమత లక్ష్యం మోదీ మాత్రమేనని, జగన్ కాదని.. అందువల్లే ఆమె జగన్ ప్రస్తావన తీసుకురాలేదని అంటున్నారు. ప్రాంతీయ పార్టీల అండదండలతో ప్రధాని పీఠం అధిరోహించాలని భావిస్తున్న మమత అనవసరంగా ఏ పార్టీతోనూ కయ్యం తెచ్చుకోవాలని భావించరని, అందువల్లే జగన్ కు వ్యతిరేకంగా విమర్శలు చేయలేదని విశ్లేషిస్తున్నారు. మొత్తమ్మీద మమత వైఖరి చంద్రబాబుకు కొంచెం అసంతృప్తి కలిగించిందని చెప్పొచ్చు.
948932 1555Thank you for this. Thats all I can say. You most surely have created this into something thats eye opening and essential. You clearly know so much about the subject, youve covered so several bases. Wonderful stuff from this part of the internet. 211240
653433 847381We give you with a table of all of the emoticons that can be used on this application, and the meaning of each symbol. Though it may possibly take some initial effort on your part, the skills garnered from regular and strategic use of social media will create a strong foundation to grow your business on ALL levels. 579312