కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తోంది. ఢిల్లీ లోని ఏఐసీసీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీలు హాజరయ్యారు.ఈ సందర్భంగా మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్గా వ్యవహరించిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిదంబరం మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తామని, సంక్షేమం అందిస్తామని అన్నారు.
రైతులు, యువత, మహిళలకు, పేదలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చిదంబరం చెప్పారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన మోడీ ప్రభుత్వం ఉన్న ఉద్యోగాలనే తీసేసిందని విమర్శించారు. ఎన్టీఏ ప్రభుత్వం హయాంలో 4.7 కోట్ల ఉద్యోగాలు పోయాయని చిదంబరం అన్నారు. సగటున ప్రతి రైతు మీద లక్షా 4 వేల రుణభారం పెరిగిందన్నారు.
లక్షల మంది ప్రజల నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా ఈ మేనిఫెస్టోను రూపకల్పన చేశామని చిదంబరం చెప్పారు.
వివిధ వర్గాల ప్రజల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకుని ఈ మేనిఫెస్టోను రూపొందించామని మన్మోహన్ సింగ్ తెలిపారు. 2030 నాటికి దేశంలో పేదరికాన్ని నిర్మూలించేందుకు కృషి చేస్తామన్నారు.
ప్రజల ఆకాంక్షల మేరకు మేనిఫెస్టోను రూపొందించామని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ అన్నారు. తమ మేనిఫెస్టో ఒక గదిలో కూర్చుని రూపొందించింది కాదని, ప్రజల మనసులోని ఆలోచనలను ప్రతిబింబించేలా తమ మేనిఫెస్టో ఉందని వివరించారు.
అంతేకాకుండా కనీస ఆదాయ పథకం కింద పేదల ఖాతాల్లో ఏటా రూ.72 వేలు జమ చేస్తాం. దేశంలో దాదాపు 20 శాతం మంది ప్రజలు ఈ పథకం కిందకు వస్తారు.
- అయిదేళ్లలో రూ.3.6 లక్షలు పేదల ఖాతాల్లో నేరుగా జమ చేస్తాం.
- 2020 మార్చి నాటికి 22 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం.
- గ్రామ పంచాయతీల్లో 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం.
762401 676685Yay google is my king helped me to find this great site ! . 449540
707345 988243Deference to website author , some excellent entropy. 588330
251637 210333Nice blog here! soon after reading, i decide to buy a sleeping bag ASAP 65686
5082 901666Excellent blog here! Also your site loads up quick! What host are you using? Can I get your affiliate link to your host? I wish my website loaded up as swiftly as yours lol 141351
729377 941554Excellent post, I conceive blog owners really should acquire a good deal from this internet blog its real user pleasant. 689848