అమరావతి: ఏపీ మంత్రి నారా లోకేశ్కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా లోకేశ్ గురువారం తాడేపల్లి మండలంలోని పలు చోట్ల గ్రామస్థులను కలిశారు. స్థానిక సమస్యలపై చర్చించారు. అనంతరం వారితో మాట్లాడుతూ… త్వరలో ఎన్నికలు వస్తున్నాయి. ఏప్రిల్ 9న సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. వెంటనే పక్కనే ఉన్న తెదేపా నేత తప్పును సవరించుకోవల్సిందిగా సూచించి ఎన్నికల తేదీ ఏప్రిల్ 11 అని చెప్పారు. ఆ తర్వాత లోకేశ్ దాన్ని సరిదిద్దుకునే పనిలో పడ్డారు.
ఈ లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోను మంగళగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే, వైకాపా అభ్యర్థి ఆళ్ల రామకృష్ణా రెడ్డి తన ట్విటర్ ద్వారా ఇతరులతో పంచుకున్నారు. నారా లోకేశ్ గారి అభ్యర్థన మేరకు ఏప్రిల్ 9న సైకిల్ గుర్తుకు… 11న వైకాపాకు ఓటు వేయండి అంటూ వీడియోను పోస్టు చేశారు. దీంతో ఈ వీడియో కాస్త ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. అంతేకాదండోయ్ ఏప్రిల్ 11న జరగనుండగా 9న ఏంటంటూ నెటిజన్లు చురకలంటించడం మొదలుపెట్టారు.
.@naralokesh గారి అభ్యర్థన మేరకు ఏప్రిల్ 9న సైకిల్ గుర్తుకు ఓటు వేయండి
ఏప్రిల్ 11న ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయండి#VoteForFan #TDPLosing pic.twitter.com/DMzYMNA2H2
— Rama Krishna Reddy A (@MlaRKR) March 21, 2019
275884 42606I was seeking for this. Actually refreshing take on the details. Thanks a great deal. 635145