Anam Ramnarayana Reddy: తిరుపతి జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ చూడలేదన్నారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన సొంత పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
‘ రాష్ట్రంలో అంతా ఏకచత్రాధిపత్యమే నడుస్తోంది. ఎంతోమంది కీలక నేతలు ముఖ్యమంత్రులతో పనిచేశాను. నాకు ఎప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురు కాలేదు. ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటినుంచి తప్పులను ప్రశ్నిస్తూనే వస్తున్నాను. విమర్శలను సైతం సానుకూలంగా తీసుకోవడమే రాజకీయ నీతి. కానీ రాష్ట్రంలో కానీ అధికారంలో ఉన్న పార్టీ ప్రశ్నించే గొంతుకలను నొక్కేస్తోంది. మా జిల్లాలో జరిగే దోపిడీ, అవినీతిపై ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తున్నాను. దీంతో నన్ను పక్కకు పెట్టి రాజ్యాంగేతర శక్తిని వెంకటగిరి ఇన్చార్జిగా నియమించారు. నాకు సహకరించొద్దని జిల్లా కలెక్టర్ కి, ఎస్పీకి ఇతర అధికారులకు సీఎంఓ నుంచి ఫోన్లో వచ్చాయని తెలిసింది. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలను అడ్డంగా పెట్టుకుని నా అడ్డు తొలగించుకున్నారు. క్రాస్ ఓటింగ్ ను నిర్ధారించడం చాలా కష్టమైన ప్రక్రియ. అలాంటిది ఫలానా ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ పాల్పడ్డారని ఎలా నిర్ధారిస్తారు. మేం అమ్ముడుపోయాం అంటూ మా మీద ప్రభుత్వ సలహాదారు ఎన్నో విమర్శలు చేశారు. ఆయన రూ. వేలకోట్లు ఎలా సంపాదించారో మాక్కూడా తెలుసు. రాజకీయ జీవితంలో నిందలు, ఆరోపణలు విమర్శలు, సహజం. నా గురించి తెలిసిన వాళ్ళు ఎవరు వాటిని నమ్మరు’ అని అన్నారు.
ఇటీవల జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కి పాల్పడ్డారంటూ అధికార వైసీపీ పార్టీ ఆనం రామనారాయణ రెడ్డి తో పాటు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలను సస్పెండ్ చేసింది.
439517 265807Wanted posting. Loads of superb writing here. I wish I saw it discovered the site sooner. Congrats! 171177
996994 864588I adore reading and I conceive this website got some genuinely utilitarian stuff on it! . 798102