2020లోకి అడుగు పెట్టేసాం అండ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఢీ కొట్టడానికి సంక్రాంతి సినిమాలు కూడా దాదాపు సిద్దమైపోయాయి. చాలా రోజుల నుంచి ఆసక్తిని రేకెత్తిస్తున్న సినిమాలు సూపర్ స్టార్ మహేష్ బాబు ‘ సరిలేరు నీకెవ్వరు’ మరియు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’. మొదట ఈ రెండు సినిమాలు జనవరి 12న అనుకొని ఆ తర్వాత సంధి కుదుర్చుకొని సరిలేరు నీకెవ్వరు జనవరి 11న మరియు అల వైకుంఠపురములో జనవరి 12న రిలీజ్ కావడానికి సిద్ధమయ్యాయి.
కానీ రెండు రోజుల క్రితమే ‘అల వైకుంఠపురములో’ సినిమా సడన్ గా రెండు రోజుల ముందే రిలీజ్ అనగా జనవరి 10నే రిలీజ్ చేయాలనే ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం డిస్ట్రిబ్యూటర్స్ తో చర్చలు కూడా సాగుతున్నాయి. మాకు ఉన్న సమాచారం ప్రకారం అల్లు అర్జున్ టీం జనవరి 10కే ఫిక్స్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే, అల వైకుంఠపురములో టీం స్టెప్ చూసాకా ‘సరిలేరు నీకెవ్వరు’ టీం కూడా జనవరి 10నే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మొదటగా నిర్మాతలు ఒకే రోజు వస్తే క్లాష్ వస్తుందని, ముఖ్యంగా ఒకేరోజు రావడం వలన ఓపెనింగ్స్ విషయంలో ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందని రిలీజ్ డేట్స్ మార్చారు. కానీ ఇద్దరు హీరోలు పంతానికి వెళ్లి ఇప్పుడు ఒకేసారి జనవరి 10న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఇలా వస్తే కలెక్షన్స్ పరంగా ఎంతో కొంత డిస్ట్రిబ్యూటర్స్ కి లాస్ ఉంటుంది. ఎందుకంటే స్టార్ హీరోల సినిమాలకి మొదటి రోజు కలెక్షన్స్ అనేదే మేజర్ అడ్వాంటేజ్.. కానీ ఇలా రెండు బిగ్ మూవీస్ ఒకే రోజు రిలీజైతే ఏదో ఒక సినిమాకి కొంత డామేజ్ అయితే తప్పదు. మరి హీరోలు డిస్ట్రిబ్యూటర్స్ పరంగా అలోచించి తగ్గుతారా? లేక ఒకే రోజు ఢీ అంటే ఢీ అంటారా? అనేది మరో రెండు రోజుల్లో అనౌన్స్ చేసే అవకాశం ఉంది.
453006 843996Excellent post, Im seeking forward to hear a lot more from you!! 785197
301075 709069Exploring in Yahoo I eventually stumbled upon this website.Reading this info. 51946
786692 985295You completed a number of nice points there. I did a search on the issue and discovered nearly all folks will have the same opinion together with your weblog. 103162