సాక్షి టీవీ, పత్రికకు ప్రభుత్వం ఇస్తున్న ప్రకటనలపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. నిబంధనలకు విరుద్ధంగా పత్రికా ప్రకటనలు ఇస్తున్నారంటూ ఈ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ ను జస్టిస్ రాకేశ్కుమార్, జస్టిస్ ఉమాదేవితో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణకు స్వీకరించింది.
అయితే.. వాదనలు విన్న ద్విసభ్య ధర్మాసనం తీర్పు ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ పిటిషన్ను ప్రధాన న్యాయమూర్తి జితేంద్ర కుమార్ మహేశ్వరి బెంచ్కు బదిలీ చేశారు. ప్రభుత్వ ప్రకటనలను వైసీపీ జెండాను పోలిన రంగులతో ప్రచురిస్తున్నారని పిటిషనర్ తన పిటిషన్ లో పేర్కొన్నారు.
నిబంధనల ప్రకారం ప్రభుత్వానికి సంబంధించిన ప్రకటనలను పార్టీ గుర్తులతో కానీ రంగులతో కానీ ఇవ్వకూడదు. వివిధ పత్రికలకు కూడా ప్రభుత్వ ప్రకటనలను ఇవ్వాల్సి ఉంటుంది. కానీ.. జగన్ ప్రభుత్వం ఈ నిబంధనలను పాటించడం లేదంటూ పిటిషనర్ తన పిటిషన్ లో పేర్కొన్నారు.
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ కార్యాలయాలకు వైసీపీ పార్టీ రంగులను వేయగా సుప్రీంకోర్టు వరకూ ఈ విషయం వెళ్లడం.. రంగులు మార్చాలని తీర్పు రావడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వ ప్రకటనలకు పార్టీ రంగులు వేయడం చర్చనీయాంశమవుతోంది.
వైసీపీ ప్రభుత్వం చేపట్టిన పనులపై, వ్యవహరిస్తున్న తీరుపై ఇప్పటికి దాదాపు 100 సార్లు కోర్టుల నుంచి ఎదురుదెబ్బలు తగిలాయి.
123966 162948Some genuinely valuable information in there. Why not hold some sort of contest for your readers? 640053
464169 745511I was suggested this website by my cousin. Im not certain whether this post is written by him as no 1 else know such detailed about my trouble. Youre amazing! Thanks! xrumer 54343
424862 979577I discovered your weblog internet website on bing and appearance several of your early posts. Preserve up the very very good operate. I just now additional the RSS feed to my MSN News Reader. Seeking toward reading far much more on your part down the road! 908991