విశాఖలో ఎల్జీ పాలిమర్స్ ఘటన అందరికీ గుర్తుండే వుంటుంది.! విశాఖ చరిత్రలోనే అత్యంత భయానకరమైన ఘటన అది. సినిమాల్లో చూసినట్టుగా.. జనం నడుస్తూ నడుస్తూ అచేతనావస్థలోకి వెళ్ళి.. కిందపడిపోయారు. పలువురు ప్రాణాలు కోల్పోయారు.
అప్పట్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆ ఘటన పట్ల తీవ్రంగా కలత చెంది, మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పన పరిహారం ప్రకటించారు. ఆ పరిహారం అందిందా.? లేదా.? అదైతే ప్రస్తుతానికి మిలియన్ డాలర్ క్వశ్చన్.
గాయపడ్డవారికి వైద్య చికిత్స సహా, వారి కుటుంబాల్ని ఆదుకుంటామన్న ముఖ్యమంత్రి ప్రకటన కార్యరూపం దాల్చిందో లేదో ఎవరికీ తెలియదు. ‘ఇలాంటి ఘటన ఇంకోటి జరగనివ్వబోం..’ అని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. కానీ, అలాంటి ప్రమాదాలు జరుగుతూనే వున్నాయ్.
పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ చేయించాలంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పదే పదే విజ్ఞప్తి చేస్తున్నా, వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదు.
ఇక, ఇప్పుడు రోడ్లపై రాజకీయ కార్యక్రమాలు.. అవేనండీ రోడ్ షోలు, ర్యాలీలు, బహిరంగ సభలన్నమాట.! వీటిపై వైసీపీ సర్కారు నిషేధం విధించింది. చంద్రబాబు పర్యటన సందర్భంగా ఇటీవల గుంటూరులో అలాగే నెల్లూరులో జరిగిన తొక్కిసలాటలు.. ఈ క్రమంలో మొత్తంగా 11 మంది మృతి చెందడంతో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుందట.
తొక్కిసలాట జరిగింది గనుక, రాజకీయ పార్టీల సభలు, ర్యాలీలు, రోడ్ షోలపై ఉక్కుపాదం మోపుతున్నారు సరే. ఫ్యాక్టరీల్లో ప్రమాదాలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారట.?
తాజాగా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తూర్పుగోదావరి జిల్లాలో బ్రహ్మాండంగా బహిరంగ సభ నిర్వహించేశారు. వైసీపీ శ్రేణులు ర్యాలీలు తీశాయ్. వాటిపై పోలీసులు ఎక్కడా ఉక్కుపాదం మోపలేదాయె. చంద్రబాబు కుప్పం పర్యటనకు మాత్రం ఆంక్షలు విధిస్తున్నారు పోలీసులు.
రేప్పొద్దున్న జనసేన పార్టీ చేయబోయే కార్యక్రమాలకీ పోలీసుల ఆంక్షలు తప్పనిసరి. ఔను, నిబంధనలు కేవలం విపక్షాలకు మాత్రమే.. అధికార పక్షానికి కాదు.! అందుకే, దీన్ని వైసీపీ రాజ్యంగం అనేది.
339136 96744 There is noticeably a bundle to know about this. I assume you produced certain nice points in features also. 537967