మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత వైఎస్ వివేకానందరెడ్డి రెండేళ్ళ క్రితం అత్యంత కిరాతకంగా చంపబడ్డ విషయం విదితమే. ఈ డెత్ మిస్టరీ నేటికీ వీడలేదు. అసలు వివేకానందరెడ్డిని అంత కిరాతకంగా చంపాల్సిన అవసరం ఎవరికి వుంది.? అన్న విషయాన్ని కూడా ఇప్పటిదాకా తేల్చలేకపోయారు రాష్ట్ర పోలీసులు, సీబీఐ అధికారులు. తాజాగా, ఈ కేసు విషయమై ఏపీ ఇంటెలిజెన్స్ మాజ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సంచలన ఆరోపణలు చేశారు.
హత్య జరిగిన తర్వాత సంఘటనా స్థలాన్ని ఎంపీ అవినాష్ రెడ్డి తన అదుపులో వుంచుకున్నారనీ, ఆ సమయంలో మీడియా, ఇంటెలిజెన్స్ సిబ్బంది, పోలీసులను కూడా అనుమతించలేదని ఆరోపించారు ఏబీ వెంకటేశ్వరరావు. మత్తం సమాచారాన్ని అప్పటి దర్యాప్తు బృందం నిఘా విభాగానికి అందించిందని ఏబీ వెంకటేశ్వరరావు పేర్కొంటూ, నేరుగా సీబీఐ డైరెక్టరుకి లేఖ రాశారు. ‘పోలీసుల్ని కొందరు ప్రజా ప్రతినిథులు కావాలనే అడ్డుకున్నారు’ అని ఏబీ పేర్కొనడం గమనార్హం.
‘వైఎస్ వివేకా హత్యను గుండెపోటుగా చిత్రీకరించేందుకు కొందరు ఎంపీలు ప్రయత్నించారు’ అని కూడా ఆరోపించారాయన. దర్యాప్తు అధికారి ఎస్ కే సింగ్ కి స్వయంగా చెప్పినా, ఈ విషయాల్ని పట్టించుకోలదని ఏబీ వెంకటేశ్వరరావు ఆరోపించడం సంచలనంగా మారింది. చంద్రబాబు హయాంలో ఏబీ వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్ విభాగానికి అధిపతిగా పనిచేశారు. అయితే, అప్పట్లో ఏబీ వెంకటేశ్వరరావుపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చాక.. ఆయన్ని సస్పెండ్ చేసి, తీవ్రమైన అభియోగాలు మోపింది. ఆ కేసు విచారణ ప్రస్తుతం జరుగుతోంది.
తనపై జగన్ ప్రభుత్వం కుట్రపన్నిందని ఏబీ వెంకటేశ్వరరావు ఆరోపిస్తున్న విషయం విదితమే. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకీ, ఏబీ వెంకటేశ్వరరావుకీ మధ్య నడుస్తున్న వివాదాన్ని పక్కన పెడితే, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయమై ఇప్పటికీ నిజాలు నిగ్గు తేలకపోవడం, వ్యవస్థల చేతకానితనానికి నిదర్శనంగానే చెప్పుకోవాలేమో.
717174 656462Plenty of writers recommend just writing and composing no matter how bad and if the story is going to develop, you will suddenly hit the zone and itll develop. 989373
751444 557846Just a smiling visitant here to share the enjoy (:, btw outstanding style . 791792
529244 408345I believe this internet site contains some quite fantastic details for everyone : D. 313682