వైసీపీది దౌర్భాగ్యపు పాలన అని.. వీరి దాష్టీకాలను ధీటుగా ఎదుర్కొంటామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఇకపై క్షేత్రస్థాయిలో పోరాటాలకు జనసేన సిద్ధమని ప్రకటించారు. ఎస్సీలపైనే ఎస్సీ అట్రాసిటీ కేసులు బనాయిస్తున్నారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ఎన్ని ప్రతికూల పరిస్థితులు సృష్టించినా పరిషత్ ఎన్నికల్లో బలంగా పోరాడి 25.2% ఓట్లు సాధించామని అన్నారు.
నామినేషన్ నుంచి కౌంటింగ్ వరకూ వైసీపీ అరాచకాలు చేస్తుంటే అధికార యంత్రాంగం చోద్యం చూసిందని ఆరోపించారు. జనసేన విజయ ప్రస్థానం బిందువుగా మొదలై సింధువుగా మారుతోందని అన్నారు. దాడులు, బెదిరింపులతో వైసీపీ నేతలు పాలన చేస్తున్నారని మండిపడ్డారు. వారి దాడులను ఎలా ఎదుర్కోవాలో.. ఈనెల 27,28 తేదీల్లో విజయవాడలో మా నాయకులతో విస్తృతస్థాయి స్థాయి సమావేశం ఏర్పాటు చేసి చర్చిస్తామని అన్నారు. పరిషత్ ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందిన అభ్యర్ధులకు మరోసారి అభినందనలు తెలిపారు.
ప్రతికూల పరిస్థితుల్లోనూ జనసేన నాయకులు, కార్యకర్తలు బలంగా నిలిచారని పవన్ కొనియాడారు. పంచాయతీ ఎన్నికల్లో దాదాపు 24 శాతం ఓట్లు సాధిస్తే.. పరిషత్ ఎన్నికల్లో 25.2 శాతం ఓట్లు సాధించామని అన్నారు. పొత్తులో భాగంగా బీజేపీకి కొన్ని సీట్లు కేటాయించకుంటే మరిన్ని సీట్లు గెలిచేవారమని అన్నారు.
274076 469061Thank you, Ive just been searching for info about this topic for a while and yours is the greatest Ive discovered till now. But, what in regards to the conclusion? Are you sure concerning the supply? 126109
242152 457397Thank you for every other informative website. Exactly where else could I get that type of information written in such a perfect means? Ive a mission that Im just now operating on, and Ive been at the look out for such information. 847849