Switch to English

సూటిగా.. సుత్తి లేకుండా.. జనసేనాని ‘సమీక్ష’

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

సైన్యముంది, తెగువ కలిగిన సేనాని వున్నాడు. కానీ, ఇటీవలి ఎన్నికల్లో జనసేన పార్టీ ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది. కారణమేంటి? గెలుపోటముల గురించి కాదు ఆవేదన, సర్వేల్లో పేర్కొన్నట్టుగా కూడా ఓటు బ్యాంకు సంపాదించుకోలేకపోవడమే జనసేనను మరింత తీవ్రంగా కలచివేస్తోంది. ‘గెలుపోటముల గురించి జనసేనాని ఎప్పుడూ ఆందోళన చెందలేదు. కానీ, తక్కువలో తక్కువ 18 నుంచి 20 శాతం ఓటు బ్యాంకు సాధిస్తామనుకున్నాం. అదే జరగలేదు. ఎందుకిలా? అన్నదానిపైనే జనసేనాని దృష్టిపెట్టారు’ అని జనసేన పార్టీకి చెందిన ముఖ్య నేత ఒకరు వెల్లడించారు.

నేటి నుంచి జిల్లాల వారీగా జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ సమీక్షలు నిర్వహించనున్నారు అమరావతిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో. ఈ మేరకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లను ముందే పూర్తి చేసేశాయి. ‘ఈ సమీక్షల్లో నేతల మధ్య వివాదాలకు ఆస్కారం లేదు. ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడానికి అవకాశమే లేదు. సూటిగా, సుత్తి లేకుండా సమీక్షలు జరుగుతాయి’ అని జనసేన వర్గాలు స్పష్టం చేశాయి.

నిర్మొహమాటంగా తమ అభిప్రాయాలు చెప్పేందుకు వీలుగా ఇప్పటికే జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ పార్టీ శ్రేణులకు సంకేతాలు పంపారు. కింది స్థాయి నుంచీ పార్టీ పరిస్థితిపై నివేదికల్ని పవన్‌ కళ్యాణ్‌ ఇప్పటికే తెప్పించుకున్నారు. వాటిపై ఆయన తనకు అత్యంత సన్నిహితులైనవారితో చర్చించారు కూడా.

‘పోలింగ్‌ జరిగిన తర్వాతి క్షణం నుంచే సమీక్షలు మొదలయ్యాయి. భవిష్యత్‌ కార్యాచరణపై అప్పటినుంచే దృష్టి పెట్టాం. పవన్‌ కళ్యాణ్‌ ఓడిపోవడం కొంత బాధ కలిగించినా, రాజకీయాల్లో గెలుపోటములు సహజమే. జరిగిపోయిన ఓటమి గురించి బెంగ లేదు. భవిష్యత్తులో జనసేనను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్ళడమే మా ముందున్న లక్ష్యం’ అని జనసేన ముఖ్య నేత ఒకరు తాజా సమీక్షల గురించి చెబుతూ మనసులో మాటని బయటపెట్టారు.

రాష్ట్రమంతా పవన్‌కళ్యాణ్‌ పాదయాత్రలు చేయాలనే ప్రతిపాదన వున్నప్పటికీ, దానికింకా సమయముందని పలువురు ముఖ్య నేతలు తమ అధినేతకు సూచించారట. అంశాల వారీగా మాత్రమే ప్రభుత్వ విధానాలపై పోరాడాలనీ, ప్రజలకు మేలు చేసే విషయాల్లో ప్రభుత్వాన్ని విమర్శించాల్సిన పనిలేదని పవన్‌ కళ్యాణ్‌, ఇప్పటికే పార్టీ శ్రేణులకు సంకేతాలు పంపారు.

ప్రతిపక్షంగా మారిన తెలుగుదేశం పార్టీతో ఎలా వ్యవహరించాలి.? మిత్రపక్షాలైన వామపక్షాలతో ఎలా ముందుకు వెళ్ళాలి.? బీజేపీ నుంచి రాజకీయ ప్రతిపాదనలు వస్తే వాటిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి.? వంటి అంశాలూ తాజా సమీక్షల్లో ప్రస్తావనకు రానున్నట్లు తెలుస్తోంది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

ఎక్కువ చదివినవి

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Mudragada: ముద్రగడ ఇంట రాజకీయ చిచ్చు.. కుమార్తె వ్యాఖ్యలపై పద్మనాభం స్పందన

Mudragada: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంకు సొంత ఇంటి నుంచే వ్యతిరేకత ఎదురైంది. పవన్ ను ఓడించకపోతే పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు. ఆమె...

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ చూస్తారు: అల్లరి నరేశ్

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో అల్లరి నరేశ్ (Allari Naresh) అన్నారు....

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...