Switch to English

కారెక్కడానికి మరో ముగ్గురు రెడీ?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగలబోతోంది. అసెంబ్లీ ఎన్నికలతోపాటు సార్వత్రిక, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘోర పరాభవం మూటగట్టుకున్న ఆ పార్టీ మరింత దారుణ స్థితికి వెళ్లిపోబోతోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు అధికార టీఆర్ఎస్ లో చేరగా.. తాజాగా మరో ముగ్గురు ఎమ్మెల్యేలు లైన్లో ఉన్నారని సమాచారం. రెండు మూడు రోజుల్లో వారి చేరిక కార్యక్రమం జరుగుతుందని అంటున్నారు. ఆ వెంటనే కాంగ్రెస్ శాసనసభాపక్షాన్ని టీఆర్ఎస్ లో విలీనం చేసే ప్రక్రియ కూడా సాఫీగా జరిగిపోతుందని తెలుస్తోంది. ఈ మేరకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మొత్తం కసరత్తు పూర్తిచేశారని తెలిసింది.

గతేడాది జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో 119 స్థానాలకు గానూ టీఆర్ఎస్ 88 చోట్ల గెలుపొందగా.. కాంగ్రెస్ 19, ఎంఐఎం 7, టీడీపీ 2, స్వతంత్రులు 2, బీజేపీ ఒక స్థానంలో విజయం సాధించాయి. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ కు 63 సీట్లు మాత్రమే రావడంతో బొటాబొటీ మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తర్వాత ప్రతిపక్ష పార్టీల నుంచి ఎమ్మెల్యేలను ఆకర్షించి తన ప్రభుత్వానికి ఢోకా లేకుండా చూసుకుంది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను లాక్కునే అనైతిక సంప్రదాయం గతంలో కూడా ఉన్నప్పటికీ, కేసీఆర్ ఈ ప్రక్రియను పరాకాష్టకు తీసుకెళ్లారు. టీడీపీ నుంచి టీఆర్ఎస్ లోకి ఫిరాయించిన తలసాని శ్రీనివాస్ యాదవ్ కి మంత్రి పదవి కూడా కట్టబెట్టారు. రాష్ట్రంలో దాదాపు టీడీపీని అప్పట్లో ఖాళీ చేసేశారు.

సరిగ్గా ఇదే క్రీడను ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా అమలు చేశారు. అప్పట్లో ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్సార్ సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకుని, వారిలో కొంతమందికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు. ఓ దశలో వైఎస్సార్ సీపీ శాసనసభా పక్షాన్ని టీడీపీలో విలీనం చేసే లక్ష్యంతో ముందుకెళ్లినప్పటికీ, అది ఫలించలేదు. అయితే, ఈ అంశంలో కేసీఆర్ మాత్రం ఒకడుగు ముందే ఉన్నారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం శాసనసభా పక్షాన్ని టీఆర్ఎస్ లో విలీనం చేసేశారు. తాజాగా కాంగ్రెస్ శాసనసభా పక్షాన్ని విలీనం చేయడానికి రంగం సిద్దం చేశారు.

కాంగ్రెస్ కు 19 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. ఆ పార్టీని మరో పార్టీలో విలీనం చేయాలంటే మూడింట రెండొంతుల మంది అంగీకరించాల్సి ఉంటుంది. అప్పుడు ఫిరాయింపుల చట్టం వర్తించదు. అంటే 13 మంది సంతకం చేస్తే కాంగ్రెస్ శాసనసభాపక్షం విలీనం చేసేయొచ్చు. తాజాగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్లగొండ ఎంపీగా గెలిచిన నేపథ్యంలో ఆయన తన ఎమ్మెల్యే పదవికి బుధవారం రాజీనామా చేశారు. అసెంబ్లీ కార్యదర్శి ఆ రాజీనామాను వెంటనే ఆమోదించారు. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య 18కి తగ్గింది. ఈ నేపథ్యంలో విలీనానికి 12 మంది అంగీకరిస్తే సరిపోతుంది.

ఇప్పటికే 11 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరడంతో మరొకరు అవసరం. అయితే, తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కారు ఎక్కడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. ఈరోజో, రేపో ఆయన అధికార పార్టీ తీర్థం పుచ్చుకోవడం తథ్యమని అంటున్నారు. ఆయన వస్తే కాంగ్రెస్ విలీనం పూర్తయినట్టే. ఇక సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డితోపాటు మరో ఎమ్మెల్యే పొడెం వీరయ్య సైతం గులాబీ తీర్థం పుచ్చుకుంటారనే ప్రచారం జోరుగా సాగుతోంది. మొత్తమ్మీద ఈ వారంలోనే కాంగ్రెస్ విలీనాన్ని పూర్తిచేయాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

రాజకీయం

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

ఎక్కువ చదివినవి

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

మెగాస్టార్ చిరంజీవి మీద పడి ఏడుస్తున్న వైసీపీ బ్యాచ్.!

2024 ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని ముందే ఊహించుకున్న వైసీపీ, ప్రతి చిన్న విషయానికీ కలత చెందుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు...

ఎన్డిఏ కూటమి అభ్యర్థులను గెలిపించండి.. అభిమానులకు మెగాస్టార్ పిలుపు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు సీఎం రమేష్, పంచకర్ల రమేష్ బాబును గెలిపించాలంటూ మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi) తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఏపీలో చంద్రబాబు నాయుడు,...

బి-ఫామ్స్ అందిస్తూ.. ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్.!

రాజకీయాల్లో ఇదొక కొత్త ఒరవడి.. అనడం అతిశయోక్తి కాదేమో.! జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు లోక్ సభ అభ్యర్థులకు (తనతో కలుపుకుని) జనసేన అధినేత...

Chiranjeevi: CCTలో 100వసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ.. అభినందించిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 26ఏళ్ల క్రితం (1998 అక్టోబర్ 2) ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నేడు అద్భుతమే జరిగింది. ‘రక్తదానం చేయండి.. ప్రజల ప్రాణాలు నిలపండి..’ అని నాడు చిరంజీవి ఇచ్చిన...