అమెరికాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఆసక్తిగా ఎదురు చూసిన సందర్బం వచ్చేసింది. అమెరికా అధ్యక్ష పీఠం నుండి ట్రంప్ దిగి పోయి ఆయన స్థానంలో జో బైడెన్ వచ్చేశాడు. ట్రంప్ విధానాల వల్ల ఆయన దేశ ప్రజలతో పాటు ప్రపంచ దేశాలు కూడా చాలా ఇబ్బందులు పడ్డాయి. కనుక ఈ సమయంలో జో బైడెన్ కోసం అందరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. అలాంటి జో బైడెన్ ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ సందర్బంగా తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా పోతిరెడ్డి పేట గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు.
బైడెన్ టీం లో తెలుగు వ్యక్తి వినయ్ రెడ్డి కి కీలక బాధ్యతలు దక్కాయి. ఆ వినయ్ రెడ్డి పోతిరెడ్డి పేట గ్రామస్థుడు. వినయ్ రెడ్డి తండ్రి అమెరికా వెళ్లి అక్కడ స్థిర పడ్డాడు. పోతిరెడ్డి పాడులో వారి పేరు మీద ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు నిర్వహించారు.
వినయ్ రెడ్డికి కూడా పోతిరెడ్డి పేటతో సంబంధాలు కొనసాగుతున్నాయి. ఈ సమయంలో వినయ్ రెడ్డి అమెరికా అధ్యక్షుడి టీం లో కీలక మెంబర్ గా ఎంపిక అవ్వడం పట్ల పోతిరెడ్డి పేట గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బైడెన్ ప్రమాణ స్వీకారం స్పీచ్ తయారిలో వినయ్ రెడ్డి పాత్ర కూడా ఉంది. తమ గ్రామస్తుడు బైడెన్ టీం లో ఉండటం గర్వంగా ఉందని పోతిరెడ్డి పేట గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
851096 228206Thank you for your style connected with motive though this details is certain location a new damper within the sale with tinfoil hats. 172783
158630 461683Id forever want to be update on new posts on this website , bookmarked ! . 272517
402149 619125Thank you for your very good info and respond to you. I need to verify with you here. Which isnt one thing I often do! I get pleasure from reading a publish that can make folks feel. Additionally, thanks for allowing me to remark! 312414