అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో 40 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుస్తున్నాం అంటూ డెమోక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ జాతిని ఉద్దేశించి ప్రసంగించిన సమయంలో ప్రకటించాడు. అమెరికా అధ్యక్ష ఎన్నికల తుది ఫలితాలు ఇంకా రానప్పటికి కూడా బైడెన్ ఎలక్టోరల్ ఓట్లను ఆధారంగా చూసుకుంటే గెలుపొందినట్లే. కీలక రాష్ట్రాల్లో డెమోక్రాటిక్ లు గెలుపొందిన నేపథ్యంలో ఆయన శుక్రవారం రాత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. మరో వైపు ట్రంప్ ఎన్నికల ఫలితాల సరళిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు. ఆయన ఇప్పటికే కోర్టుకు వెళ్లిన విషయం తెల్సిందే.
అధ్యక్ష పీఠం దక్కించుకునేందుకు 270 ఎలక్టోరల్ ఓట్లు కావాల్సి ఉంది. డెమోక్రాట్లు మాత్రం ఏకంగా 300 ఓట్ల వరకు పొందినట్లుగా అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇక ఈ సమయంలో కాస్త సంయమనంగా ఉండాలని, ఆనందంగా ఉండటంతో పాటు భద్రతతో ఉండాలని కరోనా సమయంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించాలంటూ ఈ సందర్బంగా బైడెన్ అన్నాడు. అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కరోనా నిరోదక చర్యలు తీసుకోవడం ప్రారంభిస్తామంటూ బైడెన్ ప్రకటించాడు. పార్టీలు వేరు అయినా అందరం అమెరికన్స్ అనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలంటూ బైడెన్ జాతిని ఉద్దేశించి ప్రసంగించిన సందర్బంగా అనడం జరిగింది.
219469 669261Glad to be 1 of many visitors on this awing site : D. 106478
921398 767131Oh my goodness! an remarkable article dude. Thanks a ton Nonetheless I will likely be experiencing dilemma with ur rss . Do not know why Not able to join it. Can there be every person acquiring identical rss concern? Anybody who knows kindly respond. Thnkx 861591