మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు గంటా శ్రీనివాసరావు కుమార్తె సాయి పూజిత ఇంట్లో దొంగలు పడ్డారు. సంక్రాంతికి సాయి పూజిత అత్తవారింటికి భీమవారం వెళ్లిన సమయంలో దొంగలు బంగారం మరియు వెండి అభరణాలను దొంగిలించారు. దాదాపుగా పది లక్షల రూపాయల సొత్తును దొంగలు ఎత్తుకు వెళ్లినట్లుగా పోలీసు ఫిర్యాదు నమోదు అయ్యింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటికే సాయి పూజిత ఇంట్లో పని చేసే ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారిని విచారించి దొంగతనం తాలూకు వివరాలు తెలుసుకుంటున్నారు.
సాయి పూజిత భర్తతో కలిసి రుషికొండలోని బాలాజీ బేమౌంట్ విల్లాలో నివాసం ఉంటున్నారు. సంక్రాంతి పండుగ సందర్బంగా అత్తవారిల్లు అయిన భీమవరం వెళ్లారు. అక్కడ నుండి తండ్రి గంటా ఇంటికి వెళ్లింది. ఏదో పని మీద ఒక వ్యక్తిని రుషికొండలోని తన సొంత ఇంటికి పంపించగా అప్పటికే అక్కడ దొంగతనం జరిగినట్లుగా గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో రంగంలోకి దిగి ఎంక్వౌరీ మొదలు పెట్టారు.
46877 377359Dude. You mind if I link to this post from my own internet site? This is just too awesome. 786938
412230 830569I like this internet site its a master peace ! Glad I detected this on google . 756891
592745 807571In fact your creative writing skills has inspired me to get my own website now. Actually the blogging is spreading its wings rapidly. Your write up is a good example of it. 954346