ఎన్నికలంటే.. అందులో చాలా ఈక్వేషన్స్ వుంటాయి. చాలా అంశాల్ని ఓటర్లు పరిగణనలోకి తీసుకుంటారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం.. ఇతరత్రా ప్రలోభాల సంగతి పక్కన పెడితే, ప్రభుత్వ వ్యతిరేకత.. పొలిటికల్ వాక్యూవ్ు.. అభివృద్ధి.. ఇలాంటివన్నీ కీలక భూమిక పోషిస్తుంటాయన్నది నిర్వివాదాంశం. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అత్యంత దారుణంగా ఓడిపోయింది. ఓట్ల శాతం బాగానే వచ్చినా.. సీట్లు మాత్రం మరీ తీసికట్టుగా వచ్చాయి. ఎందుకిలా.? అన్నది టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికీ ‘కనిపెట్టలేకపోతున్నారు’.!
నలభయ్యేళ్ళ రాజకీయ అనుభవం చంద్రబాబు సొంతం. ఏకంగా 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశారాయన. అలాంటి చంద్రబాబుకి తమ పార్టీ ఎందుకు ఓడిపోయిందో తెలియదని ఎలా అనుకోగలం.? తెలియనట్టు నటిస్తున్నారంతే.! ‘రాష్ట్రంలో 13 జిల్లాల్ని అభివృద్ధి చేశాం.. అక్కడ అది చేశాం.. ఇక్కడ ఇది చేసేశాం.. బస్తీ మే సవాల్.. ఏడాది కాలంలో మీరేం చేశారో చెప్పండి..’ అంటూ ప్రస్తుత వైఎస్ జగన్ ప్రభుత్వానికి సవాల్ విసిరేశారు టీడీపీ అధినేత చంద్రబాబు.
కరోనా నేపథ్యంలో కొన్నాళ్ళుగా హైద్రాబాద్కే పరిమితమైన చంద్రబాబు, తాజా ‘జూమ్’ మీటింగ్లో భలే కామెడీ చేసేశారు తమ హయాంలో జరిగిన అభివృద్ధి (?!) గురించి. 2018 చివరినాటికి పోలవరం ప్రాజెక్టుని ఓ కొలిక్కి తెచ్చేస్తామని ఇదే చంద్రబాబు గతంలో చెప్పారు. అమరావతి ఫేజ్ వన్ని 2018 చివరి నాటికే పూర్తి చేసేస్తామని కూడా అన్నారు. ప్రత్యేక హోదా తెస్తామన్నారు.. జిల్లాకి ఓ ఎయిర్ పోర్ట్ అన్నారు.. స్మార్ట్ సిటీలన్నారు.. ఏవీ జరగలేదు.
మాటలేమో కోటలు దాటేశాయి.. చేతలేమో గడప దాడలేదు. ‘గాలి కబుర్లు’ చెప్పకుండా, రాష్ట్ర పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని వాస్తవాల్ని చంద్రబాబు మాట్లాడి వుంటే, 2019 ఎన్నికల్లో దారుణమైన పరాభవాన్ని టీడీపీ చవిచూసి వుండేది కాదేమో. అధికారం పోయాక కూడా చంద్రబాబు తీరు మారలేదు. అన్నీ చేసేశామంటున్నారు. ఏదీ.? ఎక్కడ.? ఇప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వం కూడా చంద్రబాబు తరహాలోనే పబ్లిసిటీ స్టంట్లు చేసేస్తోంది. అది చేసేశాం.. ఇది చేసేశాం.. అంటోంది. చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిందే.
చంద్రబాబు చేసిన తప్పిదాలకంటే ఎక్కువగానే టీడీపీ కూడా చేసేస్తోన్న దరిమిలా ఇప్పటికైనా వైసీపీ తన పంథాని మార్చుకోవాలి. లేదంటే, చంద్రబాబుకి ఎదురైన పరాభవం కంటే దారుణంగా వైసీపీ పరాభవాన్ని చవిచూడాల్సి వచ్చేలా వుంది.
828894 980738Glad to be one of many visitants on this awesome internet site : D. 192272