రాజస్థాన్ రాజకీయాలు మళ్లీ వేడెక్కనున్నాయి. తిరుగుబాటు నేతలు మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆగష్టు 14వ తేదీన అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కీలక పరిణామాలు జరిగే సంకేతాలు కనిపిస్తున్నాయి. తిరుగుబాటు నేత సచిన్ పైలట్ తిరిగి కాంగ్రెస్ లోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు రాహుల్ గాంధీతో ఆయన సోమవారం భేటీ అయ్యారు. వీరిద్దరి భేటీ రాజస్థాన్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
సచిన్ పైలట్ తోసహా 19 మంది తిరిగి కాంగ్రెస్ గూటికే చేరతారనే వార్తలు వస్తున్నాయి. పార్టీపై తిరుగుబాటు చేసిన నాటి నుంచీ వీరిని తిరిగి పార్టీలోకి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ అందుబాటులో న్న ప్రయత్నాలన్నీ చేసింది. రాజకీయంగా నెలకొన్న వాతావరణం చల్లబడ్డాక కొన్ని రోజులుగా వీరంతా ఈ విషయమై సచిన్ పైలట్ తో కలిసి భేటీ అవుతున్నారు. దీంతో అగ్ర నాయకుల భేటీ ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది. నిజానికి వీరిని మళ్లీ కాంగ్రెస్ లోకి తీసుకోకూడదని సీఎల్పీ భేటీలో నిర్ణయం తీసుకున్నారు.
అయితే దీనిపై అశోక్ గెహ్లాట్ అధిష్టానానికే నిర్ణయం వదిలిపెట్టారు. దీంతో అధిష్టానానికి క్షమాపణ చెప్పి బలపరీక్షలో కాంగ్రెస్ కు ఓటేస్తానని సచిన్ పైలట్ హామీ ఇస్తే తిరిగి పార్టీలో చేర్చుకుందామని సీఎల్పీలో నిర్ణయించారు. మరి.. రాహుల్ – సచిన్ పైలట్ భేటీ పూర్తి వివరాలు తెలిస్తేనే ఈ అంశంపై ఓ స్పష్టత రానుంది.
182592 401426hey there, your internet site is amazing. I do thank you for work 484472
952480 108626several thanks for telling!. Truth is typically the top vindication against slander. by Abraham Lincoln.. 292786