Switch to English

రెడ్డిగారి ట్వీట్ల కక్కుర్తి.. ‘జనం’ కన్నా ‘బాబుగారే’ ముఖ్యమా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,448FansLike
57,764FollowersFollow

సోషల్‌ మీడియా అంటే ఎవర్నో విమర్శించడం కోసం మాత్రమే.. అనుకునే రాజకీయ నాయకుల్లో వైసీపీ ఎంపీ (రాజ్యసభ) విజయసాయిరెడ్డి కూడా ఒకరు. ‘సాయిరా’ పంచ్‌.. అంటూ సోషల్‌ మీడియాలో ఆయన వేసే ట్వీట్లు, ప్రత్యర్థి పార్టీలవైపుకు దూసుకెళ్ళడం మాటేమోగానీ.. చాలావరకు బ్యాక్‌ ఫైర్‌ అవుతుంటాయి. మరీ ముఖ్యంగా చంద్రబాబు అవినీతిని విజయసాయిరెడ్డి ప్రశ్నిస్తోంటే, ‘శుక్రవారం నీతులు’ అంటూ విజయసాయిరెడ్డితోపాటు, వైఎస్‌ జగన్‌నీ ట్యాగ్‌ చేస్తుంటారు నెటిజన్లు.

ఇక, అసలు విషయానికొస్తే, విజయవాడలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అదీ కోవిడ్‌ కేర్‌ సెంటర్‌లో. ఈ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోతే.. ఇంతటి దుర్ఘటనపై ట్వీటేయడానికి విజయసాయిరెడ్డి చాలా సమయమే తీసుకున్నారు. కానీ, మరోపక్క విజయసాయిరెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు మీద సెటైర్‌ వేయడానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. ‘నాయుడు బాబూ.. నాకు కులం లేదని పదే పదే చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందంటే అంతకన్నా దురదృష్టం వుంటుందా?’ అని ట్వీటేశారు విజయసాయిరెడ్డి.

ఇక్కడ విజయసాయిరెడ్డికి, విజయవాడలో జరిగిన ప్రమాదం కంటే.. చంద్రబాబుని విమర్శించడం ముఖ్యమయిపోయినట్లుంది. ఇదే విషయాన్ని నెటిజన్లు చాలామంది ప్రస్తావిస్తున్నారు. ‘మీ పేరు చివరనున్న రెడ్డి సంగతేంటి.? మీ ప్రభుత్వంలో సదరు రెడ్డి సామాజిక వర్గానికే ఎందుకు ఎక్కువ పదవులు దక్కుతున్నాయి.? మీరా కుల రాజకీయాల గురించి ఎద్దేవా చేసేది.?’ అంటూ ఏకి పారేస్తున్నారు సోషల్‌ మీడియాలో చాలామంది. ‘పొద్దున్నే.. వైసీపీని తిట్టించడానికే విజయసాయిరెడ్డి ట్వీటేశారా.?’ అంటూ వైసీపీ మద్దతుదారులైన నెటిజన్లు కూడా అనుమానం వ్యక్తం చేస్తుండడం గమనార్హం.

ప్రభుత్వ వైఫల్యం.. అని అనడం ఈ సమయంలో ఎంతవరకు సబబు.? అన్న విషయాన్ని పక్కన పెడితే, నిర్లక్ష్యం మాత్రం సుస్పష్టం.. విజయవాడ అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి. ‘ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తోంది.? ముఖ్యమంత్రి కూడా ఇదే అమరావతి ప్రాంతంలో నివాసం వుంటున్నారు కదా..’ అన్న విమర్శలకు సమాధానం చెప్పాల్సింది పోయి.. బాధితులకు సానుభూతి తెలపడానికి ట్విట్టర్‌ని వాడాల్సింది పోయి.. ఈ సమయంలో రాజకీయాలా.? అన్నట్టు, ట్వీట్టర్‌లో పడ్డ చీవాట్లతో కాస్త లేటుగానే అయినా.. విజయసాయిరెడ్డి బెజవాడ ఘటనపై స్పందించారండోయ్‌.. అదీ ఓ ట్వీట్‌ ద్వారా. ‘మీరంటే కరోనా సోకిందని తెలియగానే హైదరాబాద్ పారిపోయారు.. మీ ప్రభుత్వమేమో.. అద్భుతంగా పనిచేసేస్తున్నామని చెబుతూ కరోనా బాధితుల ప్రాణాలతో చెలగాటమాడుతోంది..’ అంటూ నెటిజన్లు కడిగి పారేస్తున్న దరిమిలా, ఈ విమర్శలపై విజయసాయిరెడ్డి స్పందిస్తే బావుంటుందేమో.!

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా: దర్శకుడు వంశీ

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి దర్శకుడిగా తొలి సినిమా. సితార సినిమా...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ చూస్తారు: అల్లరి నరేశ్

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో అల్లరి నరేశ్ (Allari Naresh) అన్నారు....

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు మేకర్స్. ఈక్రమంలోనే టాలీవుడ్, బాలీవుడ్ కి...