Switch to English

బిగ్‌ బ్రేకింగ్‌: రఘురామకృష్ణరాజుకి ‘వై’ కేటగిరీ భద్రత

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు, తాను అనుకున్నది సాధించేశారు. కేంద్రం నుంచి ‘వై’ కేటగిరీ భద్రతను పొందారాయన. ఈ మేరకు కేంద్ర హోంశాఖ నుంచి తనకు సమాచారం అందిందని రఘురామకృష్ణరాజు చెబుతున్నారు. నాలుగైదు రోజుల్లో తనకు ఆ భద్రత వస్తుందని అంటున్నారు రఘురామకృష్ణరాజు.

నిజంగానే ఇది రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం కాబోతోంది. రాష్ట్రంలో తనకు భద్రత లేదనీ, సొంత పార్టీ నేతలే తనపై దాడులు చేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపిస్తూ రఘురామకృష్ణరాజు లోక్‌సభ స్పీకర్‌ని ఆశ్రయించారు.. కేంద్ర హోంశాఖకు దరఖాస్తు చేసుకున్నారు. ‘నేను దరఖాస్తు చేసుకుంటే అడిగినట్లుగా భద్రత ఇచ్చేయరు.. పరిస్థితిని సమీక్షిస్తారు. అందులో వాస్తవం వుంటేనే భద్రతను కల్పిస్తారు..’ అని రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించడం చూస్తోంటే, రాష్ట్రంలో పరిస్థితిపై కేంద్రానికి ఖచ్చితమైన అవగాహన వున్నట్లే కన్పిస్తోంది. కేంద్ర భద్రతా బలగాలు తనకు ‘వై’ కేటగిరీ భద్రతను కల్పిస్తే, ఆ వెంటనే ఆయన తన సొంత నియోజకవర్గానికి వెళ్ళే అవకాశం వుంది.

వైసీపీలో గత కొంత కాలంగా రఘురామకృష్ణరాజు కలకలం సృష్టిస్తోన్న విషయం విదితమే. ‘బొచ్చులో నాయకత్వం’ సహా పలు ఆరోపణలు ఆయన ఆయన మీదున్నాయి. వైసీపీ అనుకూల మీడియా తన మీద జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేయడంతో, స్పీకర్‌కి తాను ఫిర్యాదు చేయడాన్ని వైసీపీ అధిష్టానం జీర్ణించుకోలేకపోయిందని, అప్పటినుంచే తనకి వ్యతిరేకంగా పార్టీలో కొందరు పావులు కదుపుతున్నారని రఘురామకృష్ణరాజు ఆరోపిస్తున్నారు.

ఇదిలా వుంటే, రఘురామకృష్ణరాజు తన సొంత నియోజకవర్గంలో వైసీపీ నేతలు తన దిష్టిబొమ్మల్ని తగలేస్తున్నా, తనను చంపేస్తామని హెచ్చరిస్తున్నా పోలీసు ఉన్నతాధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపిస్తూ వచ్చారు. ఇప్పుడిక కేంద్ర బలగాల భద్రత లభించాక, సొంత నియోజకవర్గంలో రఘురామకృష్ణరాజు పర్యటిస్తే.. ఆ ఇంపాక్ట్‌ రాష్ట్ర రాజకీయాలపై ఎలా వుంటుందో ఏమోగానీ.. ఢిల్లీ పెద్దలతో ఆయనకున్న సన్నిహిత సంబంధాల ‘పవర్‌’ ఏమిటో నర్సాపురం రాజుగారు తనదైన స్టయిల్లో వైసీపీ అధిష్టానానికి రుచి చూపించగలిగారన్నది నిర్వివాదాంశం.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

రాజకీయం

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

ఎక్కువ చదివినవి

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్ ‘త్రిష’

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ రెండింటినీ తనలో పుష్కలంగా అల్లుకున్న నటి...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...