సంచలన విజయానికి ఏడాది.. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్రెడ్డి.. పదవీ ప్రమాణ స్వీకారం చేసి ఏడాది పూర్తయ్యింది. మొత్తంగా 175 సీట్లు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి వుంటే, అందులో 151 సీట్లను వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్సీపీ కొల్లగొట్టింది. ఇది ఆషామాషీ విజయం కాదు. ఇంతకు ముందెన్నడూ తెలుగునాట లేని విజయం. ల్యాండ్ స్లైడ్ విక్టరీగా దీన్ని అభివర్ణిస్తారు రాజకీయాల్లో. డబ్బు, మద్యం ప్రభావం.. ప్రత్యర్థులపై దుష్ప్రచారం.. ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు.. లాంటి రాజకీయ విమర్శల సంగతి పక్కన పెడితే, సుదీర్ఘ పాదయాత్ర.. దానికి తోడు ‘ఒక్క ఛాన్స్’ అంటూ జగన్ అభ్యర్థించడం.. వెరసి వైఎస్ జగన్ ఏదో చేస్తారన్న ఆశతో జనం ఆయన్ని ముఖ్యమంత్రి పీఠమెక్కించారు.
మరి, ఏడాది పాలనలో జగన్ సాధించిన విజయాలేంటి.? అంటే, మ్యానిఫెస్టోని అత్యంత బాధ్యతగా ఆయన అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నించారన్నది నిర్వివాదాంశం. 90 శాతం హామీలు నెరవేర్చేశాం.. అని అధికార పార్టీ నేతలు చెప్పుకోవచ్చుగాక.. అందులో వాస్తవం సగం కూడా లేదన్నది గ్రౌండ్ రియాల్టీ. సన్నబియ్యం దగ్గర్నుంచి.. ప్రతి విషయంలోనూ క్వరీలు పెట్టారు. అదే సమయంలో, ప్రజాకర్షక పేర్లతో పథకాలు ప్రకటించి, కొంతమందిని వైఎస్ జగన్ మెప్పించారన్నది నిర్వివాదాంశం. అయితే, రాష్ట్ర రాజధాని.. రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం.. అన్న విషయాన్ని మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లైట్ తీసుకున్నట్లే కన్పిస్తోంది.
ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏది.? అన్న ప్రశ్న చుట్టూ ఇంకా సందేహాలే.! ఇది వైఎస్ జగన్ వైఫల్యంగా చెప్పుకోవచ్చు. వ్యూహాత్మకంగా మూడు రాజధానుల అంశం తెరపైకి తెచ్చినా, ఈలోగా అమరావతి అభివృద్ధిని అడ్డుకోవడం ఎంతవరకు సబబు.? అన్న ప్రశ్నకు జగన్ ప్రభుత్వం దగ్గర సమాధానమే లేదు. చంద్రబాబు హయాంలో రాజధానికి సంబంధించి కొన్ని భవనాల నిర్మాణం ప్రారంభమయ్యింది. అవిప్పుడు, ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూడాల్సి వస్తుంది. నిజానికి అది చంద్రబాబు ఆస్తి కాదు.. వైఎస్ జగన్ ఆస్తి అంతకంటే కాదు. అది రాష్ట్ర ప్రజల ఆస్తి. దురదృష్టవశాత్తూ చంద్రబాబు మీద చూపించాల్సిన ‘కసి’, రాజధాని అమరావతిపై చూపించబడ్తోంది.
ఆంధ్రప్రదేశ్.. అంటే ఒకప్పుడు అంతర్జాతీయ స్థాయిలో వున్న పేరు వేరు.. ఇప్పుడు ‘రాజధాని లేని రాష్ట్రమా.?’ అని వెక్కిరింపులు ఆంధ్రప్రదేశ్ వాసులకు ఎక్కడికక్కడ ఎదురవుతున్నాయి. పొరుగు రాష్ట్రం తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీళ్లు వెల్లువలా వస్తోంటే, తెలంగాణ నేల పులకించిపోతోంది. ఆంధ్రప్రదేశ్ మాత్రం పోలవరం ప్రాజెక్టు విషయంలో రాజకీయాలు చేస్తూ కూర్చుంది. ప్రత్యేక హోదా గురించి ‘అడుగుతూనే వుంటాం’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెబుతున్న మాట వెనుక రాజకీయ వైఫల్యం సుస్పష్టం. మొత్తంగా చూస్తే ఏడాది పాలనలో జగన్ సర్కార్ సాధించిన ఘనతలకంటే వైఫల్యాలే ఎక్కువన్నమాట. పదే పదే న్యాయస్థానాలతో మొట్టికాయలు పడుతున్నా మారని అధికార పార్టీ పెద్దల మొండి వైఖరి.. రాష్ట్ర ప్రజల పాలిట శాపంగా మారుతోంది.
ఈ నేపథ్యంలో రాజకీయ విశ్లేషకులు సైతం, జగన్ ఏడాది పాలనకు పాస్ మార్కులు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయడంలేదు. విపక్షాలైతే మైనస్ మార్కులేస్తాయనుకోండి.. అది వేరే విషయం. ‘ఏడాది పాలనలో చాలా చేశాం.. చంద్రబాబు హయాంలో జరిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకు ప్రయత్నించాం.. ఇకపై మా పాలనలో మరింత వేగాన్నీ, గొప్పతనాన్నీ చూడబోతున్నారు..’ అంటోన్న వైసీపీ మాటలే నిజమవ్వాలని ఆశిద్దాం.. అంతకన్నా ఏం చేయగలం.?
896926 566508This can indicate that a watch has spent some or all of its life within the tropics and was not serviced as regularly as it really should have been. 558719