Switch to English

తెలంగాణతో ‘నీటి పంచాయితీ’: ఏపీ వాదనలో ‘పస’ ఎంత.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,453FansLike
57,764FollowersFollow

తెలంగాణ ప్రభుత్వం రికార్డ్‌ సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టుని పూర్తి చేసింది. నిజానికి అత్యంత క్లిష్టతరమైన ప్రాజెక్టు ఇది. తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాలు ఇప్పుడు జల కళను సంతరించుకున్నాయంటే కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమే. నిజానికి, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఆంధ్రప్రదేశ్‌కి అభ్యంతరాలున్నాయి. అయితే, ఆంధ్రప్రదేశ్‌ అభ్యంతరాల్ని తెలంగాణ లైట్‌ తీసుకుంది.

చిత్రమేంటంటే, వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక.. తెలంగాణతో ‘నీటి’ దోస్తీ కూడా కుదుర్చుకుంది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వైఎస్‌ జగన్‌ కూడా హాజరయ్యారు. ఇప్పుడేమో, తెలంగాణలో చేపట్టిన కొత్త ప్రాజెక్టులతో ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి నీటి మీద ఆధారపడ్డ ప్రాంతాలు విలవిల్లాడుతున్నాయంటూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చావు కబురు చల్లగా చెప్పింది.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాత్రం, ఆంధ్రప్రదేశ్‌ వాదనల్ని లైట్‌ తీసుకుంటున్నారు. ‘గోదావరిలో మిగులు నీరు వుంటుంది.. దాన్ని వాడుకుందాం..’ అని ఆంధ్రప్రదేశ్‌కి సూచిస్తున్నారు. కృష్ణమ్మ జోలికి మాత్రం రావొద్దంటున్నారు. ఇదిలా వుంటే, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సామర్థ్యం పెంచే దిశగా, దానికి అదనంగా ఇంకో లిఫ్ట్‌ ప్రాజెక్ట్‌ని చేపట్టి రాయలసీమకు ఎక్కువ నీళ్ళను కృష్ణా నది నుంచి తోడాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం సంకల్పిస్తే, దానికి తెలంగాణ ప్రభుత్వం అడ్డు తగిలిన విషయం విదితమే. ఈ వివాదం నేపథ్యంలో కృష్ణా బోర్డుకి ఆంధ్రప్రదేశ్‌ తన వాదనల్ని సమర్థవంతంగా విన్పించింది.

కృష్ణా నదికి సంబంధించి ఉమ్మడి రాష్ట్రానికి 811 టీఎంసీల నీరు వాటాగా లభిస్తే, అందులో ఆంధ్రప్రదేశ్‌కి 512 టీఎంసీల వాటా, తెలంగాణకి 299 టీఎంసీలు వాటాగా దక్కుతున్నాయి. తమకు లభించిన 512 టీఎంసీల కోటాకి లోబడి మాత్రమే పోతిరెడ్డిపాడు నుంచి కొత్త ప్రాజెక్టు లింక్‌ చేసి తీసుకెళ్ళబోతున్నామన్నది ఆంధ్రప్రదేశ్‌ వాదన.

అయితే, శ్రీశౖలంలో 881 అడుగుల కంటే నీటి మట్టం తగ్గితే, రాయలసీమకు నీటి తరలింపు కష్ట సాధ్యంగా మారుతుంది. కానీ, అది ఏడాదిలో 10 నుంచి 15 రోజులు మాత్రమే సాధ్యపడుతుంది. 854 అడుగులకు నీటి మట్టం పడిపోతే, 7 వేల క్యూసెక్కులు మాత్రమే పోతిరెడ్డిపాడు ద్వారా తరలించడానికి వీలుపడుతుంది. అక్కడ ఆ స్థాయి నీటిమట్టం వుంచడానికి తెలంగాణ ప్రభుత్వం సహకరించడంలేదని ఆంధ్రప్రదేశ్‌ చెబుతుండడం గమనార్హం.

796 అడుగులక నీటి మట్టం పడిపోయినా, తెలంగాణ ప్రభుత్వం ఎడమ గట్టు కేంద్రం ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ రోజుకి 42 వేల క్యూసెక్కులను తరలించగలగుతోందని ఆంధ్రప్రదేశ్‌, కృష్ణా బోర్డు ముందు వాపోయింది. అయినా, ఇవేవీ కొత్త విషయాలు కాదు. ఈ అంశాలపై తెలంగాణ నుంచి స్పష్టత కోరకుండానే తెలంగాణతో ‘నీటి దోస్తీ’కి సిద్ధమయ్యారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి. తెలంగాణలో మాత్రం, చకచకా పలు ప్రాజెక్టులు పూర్తవుతున్నాయి. ఇప్పుడు ఎంత గగ్గోలు పెట్టినా ఆంధ్రప్రదేశ్‌కి ఒరిగేది శూన్యం.

కొసమెరుపేంటంటే, ఆంధ్రప్రదేశ్‌ తనకు కేటాయించిన నీళ్ళ కంటే ఎక్కువ వాటా వాడేసుకుందంటూ కృష్ణా ట్రైబ్యునల్‌ తేల్చి చెప్పడం. వెంటనే సాగర్‌ కుడి కాల్వ, హంద్రీ నీవా, మచ్చుమర్రి ఎత్తిపోతల నుంచి నీటి విడుదల నిలిపివేయాలని కృష్ణా ట్రైబ్యునల్‌ ఆదేశాలు జారీ చేసింది. సాగర్‌ కుడి కాల్వ ద్వారా ఏపీకి 158.255 టీఎంసీల నీటిని ట్రైబ్యునల్‌ కేటాయిస్తే, 158.264 టీఎంసీల నీటిని ఏపీ ఇప్పటికే వాడేసుకున్నట్లు తెలిపింది కృష్ణా ట్రైబ్యునల్‌. మొత్తమ్మీద, ఎలా చూసినా తెలంగాణ వాదన ముందు ఆంధ్రప్రదేశ్‌ వాదన నెగ్గేలా కన్పించడంలేదు.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్...

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా:...

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు....

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ...

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో...

రాజకీయం

Mudragada: ముద్రగడ ఇంట రాజకీయ చిచ్చు.. కుమార్తె వ్యాఖ్యలపై పద్మనాభం స్పందన

Mudragada: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంకు సొంత ఇంటి నుంచే వ్యతిరేకత ఎదురైంది. పవన్ ను ఓడించకపోతే పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు. ఆమె...

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

ఎక్కువ చదివినవి

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

Mudragada: ముద్రగడ ఇంట రాజకీయ చిచ్చు.. కుమార్తె వ్యాఖ్యలపై పద్మనాభం స్పందన

Mudragada: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంకు సొంత ఇంటి నుంచే వ్యతిరేకత ఎదురైంది. పవన్ ను ఓడించకపోతే పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు. ఆమె...

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. నేడు ఆమె పుట్టినరోజు...