Switch to English

తెలంగాణతో ‘నీటి పంచాయితీ’: ఏపీ వాదనలో ‘పస’ ఎంత.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow

తెలంగాణ ప్రభుత్వం రికార్డ్‌ సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టుని పూర్తి చేసింది. నిజానికి అత్యంత క్లిష్టతరమైన ప్రాజెక్టు ఇది. తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాలు ఇప్పుడు జల కళను సంతరించుకున్నాయంటే కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమే. నిజానికి, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఆంధ్రప్రదేశ్‌కి అభ్యంతరాలున్నాయి. అయితే, ఆంధ్రప్రదేశ్‌ అభ్యంతరాల్ని తెలంగాణ లైట్‌ తీసుకుంది.

చిత్రమేంటంటే, వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక.. తెలంగాణతో ‘నీటి’ దోస్తీ కూడా కుదుర్చుకుంది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వైఎస్‌ జగన్‌ కూడా హాజరయ్యారు. ఇప్పుడేమో, తెలంగాణలో చేపట్టిన కొత్త ప్రాజెక్టులతో ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి నీటి మీద ఆధారపడ్డ ప్రాంతాలు విలవిల్లాడుతున్నాయంటూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చావు కబురు చల్లగా చెప్పింది.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాత్రం, ఆంధ్రప్రదేశ్‌ వాదనల్ని లైట్‌ తీసుకుంటున్నారు. ‘గోదావరిలో మిగులు నీరు వుంటుంది.. దాన్ని వాడుకుందాం..’ అని ఆంధ్రప్రదేశ్‌కి సూచిస్తున్నారు. కృష్ణమ్మ జోలికి మాత్రం రావొద్దంటున్నారు. ఇదిలా వుంటే, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సామర్థ్యం పెంచే దిశగా, దానికి అదనంగా ఇంకో లిఫ్ట్‌ ప్రాజెక్ట్‌ని చేపట్టి రాయలసీమకు ఎక్కువ నీళ్ళను కృష్ణా నది నుంచి తోడాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం సంకల్పిస్తే, దానికి తెలంగాణ ప్రభుత్వం అడ్డు తగిలిన విషయం విదితమే. ఈ వివాదం నేపథ్యంలో కృష్ణా బోర్డుకి ఆంధ్రప్రదేశ్‌ తన వాదనల్ని సమర్థవంతంగా విన్పించింది.

కృష్ణా నదికి సంబంధించి ఉమ్మడి రాష్ట్రానికి 811 టీఎంసీల నీరు వాటాగా లభిస్తే, అందులో ఆంధ్రప్రదేశ్‌కి 512 టీఎంసీల వాటా, తెలంగాణకి 299 టీఎంసీలు వాటాగా దక్కుతున్నాయి. తమకు లభించిన 512 టీఎంసీల కోటాకి లోబడి మాత్రమే పోతిరెడ్డిపాడు నుంచి కొత్త ప్రాజెక్టు లింక్‌ చేసి తీసుకెళ్ళబోతున్నామన్నది ఆంధ్రప్రదేశ్‌ వాదన.

అయితే, శ్రీశౖలంలో 881 అడుగుల కంటే నీటి మట్టం తగ్గితే, రాయలసీమకు నీటి తరలింపు కష్ట సాధ్యంగా మారుతుంది. కానీ, అది ఏడాదిలో 10 నుంచి 15 రోజులు మాత్రమే సాధ్యపడుతుంది. 854 అడుగులకు నీటి మట్టం పడిపోతే, 7 వేల క్యూసెక్కులు మాత్రమే పోతిరెడ్డిపాడు ద్వారా తరలించడానికి వీలుపడుతుంది. అక్కడ ఆ స్థాయి నీటిమట్టం వుంచడానికి తెలంగాణ ప్రభుత్వం సహకరించడంలేదని ఆంధ్రప్రదేశ్‌ చెబుతుండడం గమనార్హం.

796 అడుగులక నీటి మట్టం పడిపోయినా, తెలంగాణ ప్రభుత్వం ఎడమ గట్టు కేంద్రం ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ రోజుకి 42 వేల క్యూసెక్కులను తరలించగలగుతోందని ఆంధ్రప్రదేశ్‌, కృష్ణా బోర్డు ముందు వాపోయింది. అయినా, ఇవేవీ కొత్త విషయాలు కాదు. ఈ అంశాలపై తెలంగాణ నుంచి స్పష్టత కోరకుండానే తెలంగాణతో ‘నీటి దోస్తీ’కి సిద్ధమయ్యారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి. తెలంగాణలో మాత్రం, చకచకా పలు ప్రాజెక్టులు పూర్తవుతున్నాయి. ఇప్పుడు ఎంత గగ్గోలు పెట్టినా ఆంధ్రప్రదేశ్‌కి ఒరిగేది శూన్యం.

కొసమెరుపేంటంటే, ఆంధ్రప్రదేశ్‌ తనకు కేటాయించిన నీళ్ళ కంటే ఎక్కువ వాటా వాడేసుకుందంటూ కృష్ణా ట్రైబ్యునల్‌ తేల్చి చెప్పడం. వెంటనే సాగర్‌ కుడి కాల్వ, హంద్రీ నీవా, మచ్చుమర్రి ఎత్తిపోతల నుంచి నీటి విడుదల నిలిపివేయాలని కృష్ణా ట్రైబ్యునల్‌ ఆదేశాలు జారీ చేసింది. సాగర్‌ కుడి కాల్వ ద్వారా ఏపీకి 158.255 టీఎంసీల నీటిని ట్రైబ్యునల్‌ కేటాయిస్తే, 158.264 టీఎంసీల నీటిని ఏపీ ఇప్పటికే వాడేసుకున్నట్లు తెలిపింది కృష్ణా ట్రైబ్యునల్‌. మొత్తమ్మీద, ఎలా చూసినా తెలంగాణ వాదన ముందు ఆంధ్రప్రదేశ్‌ వాదన నెగ్గేలా కన్పించడంలేదు.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: నిడదవోలులో జనసేన పరిస్థితేంటి.?

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఎలా వున్నాయ్.? 2024 ఎన్నికల్లో ఏ పార్టీ ఈ నియోజకవర్గం నుంచి గెలవబోతోంది.? నాటకీయ పరిణామాల మధ్య జనసేన పార్టీకి ‘కూటమి’ కోటాలో...

స్క్రిప్ట్ చేతిలో వైఎస్ జగన్ ఎందుకు బందీ అయ్యారు.!?

అసలేమయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? సుదీర్ఘ పాదయాత్ర చేసిన సమయంలో ఎవరి స్క్రిప్ట్ అవసరం లేకుండానే ప్రసంగాలు చేశారు కదా.? కానీ, ఇప్పుడేమయ్యింది.? స్క్రిప్టు చేతిలో వుంటే తప్ప మాట్లాడలేకపోతున్నారు.. ఆ...

CM Jagan: సీఎం జగన్ ఎదుటే పవన్ కల్యాణ్ నినాదం.. జేజేలు

CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కి జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానుల నుంచి నిరసన ఎదురైంది. సీఎం ఎదుటే...

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

ఎక్కువ చదివినవి

Rashmika: ‘శ్రీవల్లి 2.0 చూస్తారు’.. పుష్ప 2పై రష్మిక కామెంట్స్ వైరల్

Rashmika: ప్రస్తుతం యావత్ భారత సినీ పరిశ్రమ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా పుష్ప 2 (Pushpa 2). అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సంచలన...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్ వెళితేగానీ, తిరుపతి సెట్టవలేదా.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతి వెళ్ళారు, పార్టీ శ్రేణుల్లో తిరుపతి అసెంబ్లీ అభ్యర్థి విషయమై నెలకొన్న గందరగోళాన్ని సరి చేశారు.! జనసేన నేత, టిక్కెట్ ఆశించి భంగపడ్డ కిరణ్ రాయల్, పవన్...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

బి-ఫామ్స్ అందిస్తూ.. ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్.!

రాజకీయాల్లో ఇదొక కొత్త ఒరవడి.. అనడం అతిశయోక్తి కాదేమో.! జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు లోక్ సభ అభ్యర్థులకు (తనతో కలుపుకుని) జనసేన అధినేత...