తెలంగాణ ప్రభుత్వం రికార్డ్ సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టుని పూర్తి చేసింది. నిజానికి అత్యంత క్లిష్టతరమైన ప్రాజెక్టు ఇది. తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాలు ఇప్పుడు జల కళను సంతరించుకున్నాయంటే కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమే. నిజానికి, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఆంధ్రప్రదేశ్కి అభ్యంతరాలున్నాయి. అయితే, ఆంధ్రప్రదేశ్ అభ్యంతరాల్ని తెలంగాణ లైట్ తీసుకుంది.
చిత్రమేంటంటే, వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక.. తెలంగాణతో ‘నీటి’ దోస్తీ కూడా కుదుర్చుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వైఎస్ జగన్ కూడా హాజరయ్యారు. ఇప్పుడేమో, తెలంగాణలో చేపట్టిన కొత్త ప్రాజెక్టులతో ఆంధ్రప్రదేశ్లో గోదావరి నీటి మీద ఆధారపడ్డ ప్రాంతాలు విలవిల్లాడుతున్నాయంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చావు కబురు చల్లగా చెప్పింది.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం, ఆంధ్రప్రదేశ్ వాదనల్ని లైట్ తీసుకుంటున్నారు. ‘గోదావరిలో మిగులు నీరు వుంటుంది.. దాన్ని వాడుకుందాం..’ అని ఆంధ్రప్రదేశ్కి సూచిస్తున్నారు. కృష్ణమ్మ జోలికి మాత్రం రావొద్దంటున్నారు. ఇదిలా వుంటే, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సామర్థ్యం పెంచే దిశగా, దానికి అదనంగా ఇంకో లిఫ్ట్ ప్రాజెక్ట్ని చేపట్టి రాయలసీమకు ఎక్కువ నీళ్ళను కృష్ణా నది నుంచి తోడాలని వైఎస్ జగన్ ప్రభుత్వం సంకల్పిస్తే, దానికి తెలంగాణ ప్రభుత్వం అడ్డు తగిలిన విషయం విదితమే. ఈ వివాదం నేపథ్యంలో కృష్ణా బోర్డుకి ఆంధ్రప్రదేశ్ తన వాదనల్ని సమర్థవంతంగా విన్పించింది.
కృష్ణా నదికి సంబంధించి ఉమ్మడి రాష్ట్రానికి 811 టీఎంసీల నీరు వాటాగా లభిస్తే, అందులో ఆంధ్రప్రదేశ్కి 512 టీఎంసీల వాటా, తెలంగాణకి 299 టీఎంసీలు వాటాగా దక్కుతున్నాయి. తమకు లభించిన 512 టీఎంసీల కోటాకి లోబడి మాత్రమే పోతిరెడ్డిపాడు నుంచి కొత్త ప్రాజెక్టు లింక్ చేసి తీసుకెళ్ళబోతున్నామన్నది ఆంధ్రప్రదేశ్ వాదన.
అయితే, శ్రీశౖలంలో 881 అడుగుల కంటే నీటి మట్టం తగ్గితే, రాయలసీమకు నీటి తరలింపు కష్ట సాధ్యంగా మారుతుంది. కానీ, అది ఏడాదిలో 10 నుంచి 15 రోజులు మాత్రమే సాధ్యపడుతుంది. 854 అడుగులకు నీటి మట్టం పడిపోతే, 7 వేల క్యూసెక్కులు మాత్రమే పోతిరెడ్డిపాడు ద్వారా తరలించడానికి వీలుపడుతుంది. అక్కడ ఆ స్థాయి నీటిమట్టం వుంచడానికి తెలంగాణ ప్రభుత్వం సహకరించడంలేదని ఆంధ్రప్రదేశ్ చెబుతుండడం గమనార్హం.
796 అడుగులక నీటి మట్టం పడిపోయినా, తెలంగాణ ప్రభుత్వం ఎడమ గట్టు కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ రోజుకి 42 వేల క్యూసెక్కులను తరలించగలగుతోందని ఆంధ్రప్రదేశ్, కృష్ణా బోర్డు ముందు వాపోయింది. అయినా, ఇవేవీ కొత్త విషయాలు కాదు. ఈ అంశాలపై తెలంగాణ నుంచి స్పష్టత కోరకుండానే తెలంగాణతో ‘నీటి దోస్తీ’కి సిద్ధమయ్యారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి. తెలంగాణలో మాత్రం, చకచకా పలు ప్రాజెక్టులు పూర్తవుతున్నాయి. ఇప్పుడు ఎంత గగ్గోలు పెట్టినా ఆంధ్రప్రదేశ్కి ఒరిగేది శూన్యం.
కొసమెరుపేంటంటే, ఆంధ్రప్రదేశ్ తనకు కేటాయించిన నీళ్ళ కంటే ఎక్కువ వాటా వాడేసుకుందంటూ కృష్ణా ట్రైబ్యునల్ తేల్చి చెప్పడం. వెంటనే సాగర్ కుడి కాల్వ, హంద్రీ నీవా, మచ్చుమర్రి ఎత్తిపోతల నుంచి నీటి విడుదల నిలిపివేయాలని కృష్ణా ట్రైబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. సాగర్ కుడి కాల్వ ద్వారా ఏపీకి 158.255 టీఎంసీల నీటిని ట్రైబ్యునల్ కేటాయిస్తే, 158.264 టీఎంసీల నీటిని ఏపీ ఇప్పటికే వాడేసుకున్నట్లు తెలిపింది కృష్ణా ట్రైబ్యునల్. మొత్తమ్మీద, ఎలా చూసినా తెలంగాణ వాదన ముందు ఆంధ్రప్రదేశ్ వాదన నెగ్గేలా కన్పించడంలేదు.
717276 506212Attractive portion of content. I merely stumbled upon your weblog and in accession capital to assert that I get in fact loved account your weblog posts. Anyway I will probably be subscribing to your augment and even I success you get admission to constantly quickly. 46586
541677 783878I actually like your write-up. Its evident that you have a good deal knowledge on this subject. Your points are effectively produced and relatable. Thanks for writing engaging and fascinating material. 639668
25595 389991Yay google is my king helped me to uncover this outstanding site! . 28433
109171 428121If you are viewing come up with alter in most of the living, starting point normally L . a . Weight reduction cutting down on calories platform are a wide stair as part of your attaining that most agenda. weight loss 936249
602579 149358This internet web site is typically a walk-through its the data you wished concerning this and didnt know who ought to. Glimpse here, and you will undoubtedly discover it. 343496