Switch to English

ఫ్లాష్ న్యూస్: కరోనా సమయంలో గాంధీ హాస్పిటల్‌ అరుదైన రికార్డు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

కరోనా సమయంలో గాంధీ హాస్పిటల్‌ అరుదైన రికార్డు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా నివారణ చర్యల్లో భాగంగా గాంధీ హాస్పిల్‌ను కోవిడ్‌ హాస్పిటల్‌గా మార్చిన విషయం తెల్సిందే. రాష్ట్రంలో నమోదు అయ్యే పాజిటివ్‌ కేసులన్నీ కూడా గాంధీలో చికిత్స పొందుతున్నారు. పిల్లలు, వృద్దులు మహిళలతో పాటు గర్బిణిలు కూడా వైరస్‌ బారిన పడి గాంధీ హాస్పిటల్‌కు వస్తున్నారు. కొన్ని రోజుల క్రితం గాంధీలో ఒక గర్బవతి అయిన మహిళకు డెలవరీ చేసినట్లుగా మంత్రి ఈటెల ప్రకటించిన విషయం తెల్సిందే.

తాజాగా మరోసారి కరోనా పాజిటివ్‌ మహిళకు ఆపరేషన్‌ నిర్వహించి బిడ్డను సురక్షితంగా బయటకు తీశారు. డెలవరీ అయిన మహిళ గత పది రోజులుగా కరోనాతో బాధపడుతుంది. అయితే ఆమెకు జన్మించిన శిషువుకు మాత్రం కరోనా లేదు. గాంధీ హాస్పిటల్‌లో నిర్వహించిన ఈ అరుదైన ఆపరేషన్‌ పై జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కుతున్నాయి.

ఆర్టీసీ బస్సుల్లో సామాజిక దూరం ఇలా

ఫ్లాష్ న్యూస్: ఆర్టీసీ బస్సుల్లో సామాజిక దూరం ఇలా

గత రెండు నెలలుగా ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిన విషయం తెలిసిందే. కరోనా విజృభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తప్పని సరి పరిస్థితుల్లో లాక్ డౌన్ అమలు చేయడం జరిగింది. 45 రోజుల లాక్ డౌన్ తో ఆర్ధిక వ్యవస్థ అస్తవ్యస్తం అయ్యింది. అన్ని రంగాల్లో కుదేలయ్యాయి. దాంతో ఆర్ధిక పరిస్థితిని మెరుగు పరిచేందుకు లాక్ డౌన్ లో సడలింపులు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే ఆర్టీసీ ని కూడా పునరుద్ధరించే యోచనలో ప్రభుత్వాలు ఉన్నాయి.

ఈ నెల 18 నుండి ఏపీ లో ఆర్టీసీ బస్సులు తిరగడం ఖాయంగా ఉంది. అందుకోసం ఏర్పాట్లు కూడా ప్రారంభం అయ్యాయి. బస్సుల్లో సామాజిక దూరం పాటించేలా కొన్ని సీట్లను తగ్గిస్తున్నారు. సాధారణంగా బస్సుల్లో ఒక వైపు మూడు మరోవైపు రెండు సీటింగ్ సదుపాయం ఉంటుంది. మూడు సీట్లు ఉన్న వైపు మధ్య సీటును మార్క్ చేశారు.

మరో వైపు రెండు సీట్లలో ఒక సీట్ ను మార్క్ చేశారు. ఆ సీట్స్ లో ఎవరు కూర్చోకూడదు అనేది నిబంధన. ఇక సీట్లు ఉన్నవరకె ఎక్కించుకోవాల్సి ఉంటుంది. అంతకు మించి జనాలను బస్సులో ఎక్కించుకోరు. మరి ఇలాంటి జాగ్రత్తలతో కరోనా వ్యాప్తి చెందకుండా ఉంటుందా అంటే అనుమానమే అంటూ జనాలు పెదవి విరుస్తున్నారు.

నీచం: చచ్చిన తర్వాత కూడా వదలని కులం
ఫ్లాష్ న్యూస్: దారుణం : భర్తను కాపాడబోయిన భార్య.. ఇద్దరూ మృతి
బతికి ఉన్నప్పుడు ఎన్నో రాజకీయాలు, కులాలు, మతాలు, కుట్రలు, కుతంత్రాలు చూస్తున్న సామాన్యులు చనిపోయిన తర్వాత కూడా వాటి వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటికి చాలా ప్రాంతాల్లో కులాల పేరుతో కొందరిని అంత్యంత దారుణంగా చూస్తున్నారు. తాజాగా చనిపోయిన తన అన్నయ్య అంత్యక్రియల విషయంలో కుల రాజకీయాలు చేయడంతో ఒక యువకుడు సెల్ టవర్ ఎక్కి ఆందోళన చేశాడు.
పోలీసుల కథనం ప్రకారం.. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో ఒక వ్యక్తి చనిపోవడంతో అతడి డెడ్ బాడీని కుటుంబ సభ్యులు అంత్యక్రియల కోసం స్థానిక స్మశాన వాటికకు తరలించారు. అయితే ఆ స్మశాన వాటికలో అంత్యక్రియలకు ఒక కుల పెద్దలు ఒప్పుకోలేదు. అది మా కులానికి చెందిన సొంత స్మశాన వాటిక. దానిలోకి వేరే కులం వారు అంత్యక్రియలు నిర్వహించేందుకు ఒప్పుకొము అంటూ చెప్పడంతో మృతుడి బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక మృతుడి తమ్ముడు నిరసనగా సెల్ టవర్ ఎక్కాడు. పోలీసులు ఈ విషయంలో కలుగ జేసుకుని అతడికి సర్ది చెప్పి కిందకు దించారు.

దారుణం : భర్తను కాపాడబోయిన భార్య.. ఇద్దరూ మృతి

క్రైమ్ న్యూస్: లాక్‌డౌన్‌ మళ్లీ పెంచడంతో యువతి ఆత్మహత్య

కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్‌ మండలం బొప్పాస్‌పల్లికి చెందిన దారావత్‌ శంకర్‌ మరియు ఆయన భార్య మరోనిబాయీ కరెంట్‌ షాక్‌ కొట్టి మృతి చెందారు. భర్త శంకర్‌ను కాపాడబోయిన మారోనిబాయీకి కూడా షాక్‌ రావడంతో ఇద్దరు అక్కడికి అక్కడే మృతి చెందారు. కుటుంబ సభ్యులతో కలిసి శంకర్‌ ఒక తోటలో పని చేస్తున్నాడు. ఆ తోటలోనే ఉండే ఒక రేకుల షెడ్డులో ఉంటూ పని చేసుకుంటున్నారు. తోట చుట్టు ఉండే ఇనుక కంచెపై కరెంట్‌ తీగ పడటంను శంకర్‌ గుర్తించలేదు.

కంచె సమీపంలో శంకర్‌ స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్త ఆ కంచెకు చేయి ఆనించాడు. అంతే అతడికి విధ్యుత్‌ షాక్‌ తగిలింది. శంకర్‌ కొట్టుకోవడం చూసిన భార్య ఏమయ్యింది అంటూ అతడిని పట్టుకుంది. దాంతో ఆమెకు కూడా కరెంట్‌ షాక్‌ తగిలింది. వారి కూతురు కూడా వారిని పట్టుకునేందుకు ప్రయత్నించింది. కాని కరెంట్‌ షాక్‌గా భావించి దూరం ఉండి పోయింది. దాంతో ఆమెకు పెద్ద ప్రమాదం తప్పింది.

కరోనాను జయించిన పిల్లలకు సరికొత్త సమస్య

ఫ్లాష్ న్యూస్: రికార్డ్‌ – ఆ బామ్మ కరోనాపై విజయం సాధించింది

ప్రపంచ వ్యాప్తంగా పెద్దలు మాత్రమే కాకుండా పిల్లలు వృద్దులు కూడా కరోనా బారిన పడి మృత్యువాత పడుతున్న విషయం తెల్సిందే. కరోనా నుండి కోలుకుంటున్న వారు కూడా భారీగానే ఉన్నారు. పిల్లలు ఎక్కువ శాతం కరోనా జయిస్తున్నట్లుగా రిపోర్ట్‌ అందుతుంది. పిల్లలకు కరోనా సోకినా మూడు వారాల్లో వారు నెగటివ్‌కు వచ్చేస్తున్నారు. ప్లిల మరణాల శాతం చాలా తక్కువగా ఉంటుంది. అయితే కరోనాను జయించిన పిల్లలు సరికొత్త సమస్యను ఎదుర్కొంటున్నారు.

అమెరికా న్యూయార్క్‌లోని వంద మంది పిల్లలకు కవాసాకీ అనే చిత్రమైన రోగం వచ్చింది. ఇప్పటికే ఆ రోగంతో అయిదుగురు పిల్లలు మృతి చెందారు. అయితే ఈ జబ్బు బారిన పడుతున్న పిల్లల్లో ఎక్కువ శాతం మంది కరోనా వైరస్‌ బారిన పడి కోలుకున్న వారే. అంటే కరోనాను జయించిన పిల్లలకు ఈ సరికొత్త వ్యాధి వస్తుందని వారు అంటున్నారు. అజాగ్రత్తగా ఉంటే పిల్లల ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని లక్షణాలు కనిపిస్తే వెంటనే హాస్పిటల్‌కు తరలించాలంటూ న్యూయార్స్‌ మేయర్‌ సూచించారు.

ఈ జబ్బుతో బాధపడుతున్న పిల్లలు జ్వరంను కలిగి ఉండటం, నీరసంగా ఉండటం, ఆకలి వేయక పోవడం, దురదలు రావడం, పొట్టలో నొప్పి రావడం, వాంతులు చేసుకోవడం వంటివి చేస్తారు. ఈలక్షణాలు ఉంటే వెంటనే వారిని చికిత్సకు తరలించడం మంచిది అంటూ వైధ్యులు సూచిస్తున్నారు.

రికార్డ్‌ – ఆ బామ్మ కరోనాపై విజయం సాధించింది

ఫ్లాష్ న్యూస్: హీరో అనిపించుకోవానుకున్న పోలీస్‌కు ఫైన్‌

కరోనా మహమ్మారి వృద్దులపై అధికంగా ప్రభావం చూపుతుందనే విషయం అందరికి తెల్సిందే. గుండె సంబంధిత సమస్యలు మరియు డయాబెటీస్‌తో బాధపడుతున్న వారు ఎంతో మంది కరోనా బారిన పడి మృతి చెందిన దాఖలాలు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా మృతి చెందిన వారిలో అత్యధికులు వృద్దులు అనే విషయం తెల్సిందే. ఆ కారణంగానే వృద్దులను అస్సలు బయటకు రానివ్వకూడదని అందరు దేశాధినేతలు పిలుపునిచ్చారు. ఇదే సమయంలో కొన్ని దేశాలు 70 ఏళ్లు దాటిన వృద్దులకు ట్రీట్‌మెంట్‌ ఇవ్వడమే మానేశాయి. కాని స్పెయిన్‌లో మాత్రం 113 ఏళ్ల వృద్దురాలు కరోనాను జయించింది.

స్పెయిన్‌కు చెందిన మారియా బ్రన్యాస్‌కు 113 ఏళ్లు. ఇటీవల ఆమె అనారోగ్యం పాలవ్వడంతో వైధ్యులు ఆమెకు కరోనా నిర్ధారణ పరీక్ష నిర్వహించగా పాజిటివ్‌ అని వచ్చింది. ఆమెకు ప్రత్యేకమైన వార్డులో ఉంచి చికిత్స అందించారు. ఆమెకు కరోనా చికిత్స అందించిన వైధ్యులు ఆమె తాజాగా కరోనాను జయించిందంటూ ప్రకటించారు. ఇటీవల బ్రిటన్‌కు చెందిన 107 ఏళ్ల వృద్దురాలు కరోనాను జయించినట్లుగా ప్రకటించారు. అత్యధిక వయసు ఉన్న మహిళ కరోనా జయించింది అంటూ ప్రకటించారు. ఇప్పుడు ఏకంగా 113 ఏళ్ల వృద్దురాలు కరోనాను జయించినట్లుగా ప్రకటించారు. ఇది ప్రపంచ రికార్డుగా చెప్పుకొచ్చాడు.

హీరో అనిపించుకోవాలనుకున్న పోలీస్‌కు ఫైన్‌

హీరో అనిపించుకోవానుకున్న పోలీస్‌కు ఫైన్‌

బాలీవుడ్‌ హీరో అజయ్‌ దేవగన్‌ ఒక సినిమాలో రెండు బైక్‌లపై ఒక్కో కాలు వేసి చేసిన స్టంట్‌ అప్పట్లో ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమాలో అజయ్‌ దేవగన్‌ స్టంట్‌ను అప్పట్లో యువత తెగ అనుసరించే వారు. కాని కొందరు ప్రమాదాల భారిన పడటంతో పోలీసులు వాటిని బ్యాన్‌ చేశారు.

చాలా ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ఒక వ్యక్తి ఆ స్టంట్‌ను చేయడంతో అది కాస్త వైరల్‌ అయ్యింది. పోలీసులు ఈ వీడియోపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడికి ఏకంగా అయిదు వేల రూపాయల ఫైన్‌ విధించడంతో పాటు మరోసారి ఇలాంటి సంఘటనలు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ స్టంట్‌ చేసింది ఒక పోలీసు అవ్వడంతో మరింత చర్చకు తెర లేచినట్లయ్యింది. అతడు పోలీసు అవ్వడం వల్ల బాధ్యత లేదా అంటూ విమర్శలు గుప్పించారు.
మద్యప్రదేశ్‌కు చెందిన ఈ పోలీసు ఆఫీసర్‌ తన సాహస చర్యను ప్రదర్శించాడు. రెండు కార్ల మద్యలో నిల్చుని దాదాపు అయిదు కిలోమీటర్లు ప్రయాణించాడు. దాంతో ఇప్పుడు అతడిపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి స్టంట్స్‌ చేయవద్దని చెప్పాల్సిన పోలీసులు ఇలా చేస్తే ఎలా అంటూ కాస్త సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు. ఇదే సమయంలో ఆయనకు అయిదు వేల ఫైన్‌ను విధించారు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

సినిమా రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు

అలనాటి మేటి చిత్రం.. అనదగ్గ వాటిల్లో ఒకటైన ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్‌తో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం కావడంతో, సహజంగానే ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌లో సినిమాపై ఆసక్తి క్రియేట్...

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

Bahubali Animated Series: మరో సంచలనం..! ‘బాహుబలి’పై రాజమౌళి ప్రకటన

Bahubali Animated Series: భారతీయ సినీ పరిశ్రమ మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన సినిమాలు బాహుబలి (Bahubali) సిరీస్. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చిన రెండు సినిమాలు బాక్సాఫీస్ ను...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...