Switch to English

ఫ్లాష్ న్యూస్: కరోనా సమయంలో గాంధీ హాస్పిటల్‌ అరుదైన రికార్డు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow

కరోనా సమయంలో గాంధీ హాస్పిటల్‌ అరుదైన రికార్డు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా నివారణ చర్యల్లో భాగంగా గాంధీ హాస్పిల్‌ను కోవిడ్‌ హాస్పిటల్‌గా మార్చిన విషయం తెల్సిందే. రాష్ట్రంలో నమోదు అయ్యే పాజిటివ్‌ కేసులన్నీ కూడా గాంధీలో చికిత్స పొందుతున్నారు. పిల్లలు, వృద్దులు మహిళలతో పాటు గర్బిణిలు కూడా వైరస్‌ బారిన పడి గాంధీ హాస్పిటల్‌కు వస్తున్నారు. కొన్ని రోజుల క్రితం గాంధీలో ఒక గర్బవతి అయిన మహిళకు డెలవరీ చేసినట్లుగా మంత్రి ఈటెల ప్రకటించిన విషయం తెల్సిందే.

తాజాగా మరోసారి కరోనా పాజిటివ్‌ మహిళకు ఆపరేషన్‌ నిర్వహించి బిడ్డను సురక్షితంగా బయటకు తీశారు. డెలవరీ అయిన మహిళ గత పది రోజులుగా కరోనాతో బాధపడుతుంది. అయితే ఆమెకు జన్మించిన శిషువుకు మాత్రం కరోనా లేదు. గాంధీ హాస్పిటల్‌లో నిర్వహించిన ఈ అరుదైన ఆపరేషన్‌ పై జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కుతున్నాయి.

ఆర్టీసీ బస్సుల్లో సామాజిక దూరం ఇలా

ఫ్లాష్ న్యూస్: ఆర్టీసీ బస్సుల్లో సామాజిక దూరం ఇలా

గత రెండు నెలలుగా ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిన విషయం తెలిసిందే. కరోనా విజృభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తప్పని సరి పరిస్థితుల్లో లాక్ డౌన్ అమలు చేయడం జరిగింది. 45 రోజుల లాక్ డౌన్ తో ఆర్ధిక వ్యవస్థ అస్తవ్యస్తం అయ్యింది. అన్ని రంగాల్లో కుదేలయ్యాయి. దాంతో ఆర్ధిక పరిస్థితిని మెరుగు పరిచేందుకు లాక్ డౌన్ లో సడలింపులు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే ఆర్టీసీ ని కూడా పునరుద్ధరించే యోచనలో ప్రభుత్వాలు ఉన్నాయి.

ఈ నెల 18 నుండి ఏపీ లో ఆర్టీసీ బస్సులు తిరగడం ఖాయంగా ఉంది. అందుకోసం ఏర్పాట్లు కూడా ప్రారంభం అయ్యాయి. బస్సుల్లో సామాజిక దూరం పాటించేలా కొన్ని సీట్లను తగ్గిస్తున్నారు. సాధారణంగా బస్సుల్లో ఒక వైపు మూడు మరోవైపు రెండు సీటింగ్ సదుపాయం ఉంటుంది. మూడు సీట్లు ఉన్న వైపు మధ్య సీటును మార్క్ చేశారు.

మరో వైపు రెండు సీట్లలో ఒక సీట్ ను మార్క్ చేశారు. ఆ సీట్స్ లో ఎవరు కూర్చోకూడదు అనేది నిబంధన. ఇక సీట్లు ఉన్నవరకె ఎక్కించుకోవాల్సి ఉంటుంది. అంతకు మించి జనాలను బస్సులో ఎక్కించుకోరు. మరి ఇలాంటి జాగ్రత్తలతో కరోనా వ్యాప్తి చెందకుండా ఉంటుందా అంటే అనుమానమే అంటూ జనాలు పెదవి విరుస్తున్నారు.

నీచం: చచ్చిన తర్వాత కూడా వదలని కులం
ఫ్లాష్ న్యూస్: దారుణం : భర్తను కాపాడబోయిన భార్య.. ఇద్దరూ మృతి
బతికి ఉన్నప్పుడు ఎన్నో రాజకీయాలు, కులాలు, మతాలు, కుట్రలు, కుతంత్రాలు చూస్తున్న సామాన్యులు చనిపోయిన తర్వాత కూడా వాటి వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటికి చాలా ప్రాంతాల్లో కులాల పేరుతో కొందరిని అంత్యంత దారుణంగా చూస్తున్నారు. తాజాగా చనిపోయిన తన అన్నయ్య అంత్యక్రియల విషయంలో కుల రాజకీయాలు చేయడంతో ఒక యువకుడు సెల్ టవర్ ఎక్కి ఆందోళన చేశాడు.
పోలీసుల కథనం ప్రకారం.. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో ఒక వ్యక్తి చనిపోవడంతో అతడి డెడ్ బాడీని కుటుంబ సభ్యులు అంత్యక్రియల కోసం స్థానిక స్మశాన వాటికకు తరలించారు. అయితే ఆ స్మశాన వాటికలో అంత్యక్రియలకు ఒక కుల పెద్దలు ఒప్పుకోలేదు. అది మా కులానికి చెందిన సొంత స్మశాన వాటిక. దానిలోకి వేరే కులం వారు అంత్యక్రియలు నిర్వహించేందుకు ఒప్పుకొము అంటూ చెప్పడంతో మృతుడి బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక మృతుడి తమ్ముడు నిరసనగా సెల్ టవర్ ఎక్కాడు. పోలీసులు ఈ విషయంలో కలుగ జేసుకుని అతడికి సర్ది చెప్పి కిందకు దించారు.

దారుణం : భర్తను కాపాడబోయిన భార్య.. ఇద్దరూ మృతి

క్రైమ్ న్యూస్: లాక్‌డౌన్‌ మళ్లీ పెంచడంతో యువతి ఆత్మహత్య

కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్‌ మండలం బొప్పాస్‌పల్లికి చెందిన దారావత్‌ శంకర్‌ మరియు ఆయన భార్య మరోనిబాయీ కరెంట్‌ షాక్‌ కొట్టి మృతి చెందారు. భర్త శంకర్‌ను కాపాడబోయిన మారోనిబాయీకి కూడా షాక్‌ రావడంతో ఇద్దరు అక్కడికి అక్కడే మృతి చెందారు. కుటుంబ సభ్యులతో కలిసి శంకర్‌ ఒక తోటలో పని చేస్తున్నాడు. ఆ తోటలోనే ఉండే ఒక రేకుల షెడ్డులో ఉంటూ పని చేసుకుంటున్నారు. తోట చుట్టు ఉండే ఇనుక కంచెపై కరెంట్‌ తీగ పడటంను శంకర్‌ గుర్తించలేదు.

కంచె సమీపంలో శంకర్‌ స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్త ఆ కంచెకు చేయి ఆనించాడు. అంతే అతడికి విధ్యుత్‌ షాక్‌ తగిలింది. శంకర్‌ కొట్టుకోవడం చూసిన భార్య ఏమయ్యింది అంటూ అతడిని పట్టుకుంది. దాంతో ఆమెకు కూడా కరెంట్‌ షాక్‌ తగిలింది. వారి కూతురు కూడా వారిని పట్టుకునేందుకు ప్రయత్నించింది. కాని కరెంట్‌ షాక్‌గా భావించి దూరం ఉండి పోయింది. దాంతో ఆమెకు పెద్ద ప్రమాదం తప్పింది.

కరోనాను జయించిన పిల్లలకు సరికొత్త సమస్య

ఫ్లాష్ న్యూస్: రికార్డ్‌ – ఆ బామ్మ కరోనాపై విజయం సాధించింది

ప్రపంచ వ్యాప్తంగా పెద్దలు మాత్రమే కాకుండా పిల్లలు వృద్దులు కూడా కరోనా బారిన పడి మృత్యువాత పడుతున్న విషయం తెల్సిందే. కరోనా నుండి కోలుకుంటున్న వారు కూడా భారీగానే ఉన్నారు. పిల్లలు ఎక్కువ శాతం కరోనా జయిస్తున్నట్లుగా రిపోర్ట్‌ అందుతుంది. పిల్లలకు కరోనా సోకినా మూడు వారాల్లో వారు నెగటివ్‌కు వచ్చేస్తున్నారు. ప్లిల మరణాల శాతం చాలా తక్కువగా ఉంటుంది. అయితే కరోనాను జయించిన పిల్లలు సరికొత్త సమస్యను ఎదుర్కొంటున్నారు.

అమెరికా న్యూయార్క్‌లోని వంద మంది పిల్లలకు కవాసాకీ అనే చిత్రమైన రోగం వచ్చింది. ఇప్పటికే ఆ రోగంతో అయిదుగురు పిల్లలు మృతి చెందారు. అయితే ఈ జబ్బు బారిన పడుతున్న పిల్లల్లో ఎక్కువ శాతం మంది కరోనా వైరస్‌ బారిన పడి కోలుకున్న వారే. అంటే కరోనాను జయించిన పిల్లలకు ఈ సరికొత్త వ్యాధి వస్తుందని వారు అంటున్నారు. అజాగ్రత్తగా ఉంటే పిల్లల ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని లక్షణాలు కనిపిస్తే వెంటనే హాస్పిటల్‌కు తరలించాలంటూ న్యూయార్స్‌ మేయర్‌ సూచించారు.

ఈ జబ్బుతో బాధపడుతున్న పిల్లలు జ్వరంను కలిగి ఉండటం, నీరసంగా ఉండటం, ఆకలి వేయక పోవడం, దురదలు రావడం, పొట్టలో నొప్పి రావడం, వాంతులు చేసుకోవడం వంటివి చేస్తారు. ఈలక్షణాలు ఉంటే వెంటనే వారిని చికిత్సకు తరలించడం మంచిది అంటూ వైధ్యులు సూచిస్తున్నారు.

రికార్డ్‌ – ఆ బామ్మ కరోనాపై విజయం సాధించింది

ఫ్లాష్ న్యూస్: హీరో అనిపించుకోవానుకున్న పోలీస్‌కు ఫైన్‌

కరోనా మహమ్మారి వృద్దులపై అధికంగా ప్రభావం చూపుతుందనే విషయం అందరికి తెల్సిందే. గుండె సంబంధిత సమస్యలు మరియు డయాబెటీస్‌తో బాధపడుతున్న వారు ఎంతో మంది కరోనా బారిన పడి మృతి చెందిన దాఖలాలు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా మృతి చెందిన వారిలో అత్యధికులు వృద్దులు అనే విషయం తెల్సిందే. ఆ కారణంగానే వృద్దులను అస్సలు బయటకు రానివ్వకూడదని అందరు దేశాధినేతలు పిలుపునిచ్చారు. ఇదే సమయంలో కొన్ని దేశాలు 70 ఏళ్లు దాటిన వృద్దులకు ట్రీట్‌మెంట్‌ ఇవ్వడమే మానేశాయి. కాని స్పెయిన్‌లో మాత్రం 113 ఏళ్ల వృద్దురాలు కరోనాను జయించింది.

స్పెయిన్‌కు చెందిన మారియా బ్రన్యాస్‌కు 113 ఏళ్లు. ఇటీవల ఆమె అనారోగ్యం పాలవ్వడంతో వైధ్యులు ఆమెకు కరోనా నిర్ధారణ పరీక్ష నిర్వహించగా పాజిటివ్‌ అని వచ్చింది. ఆమెకు ప్రత్యేకమైన వార్డులో ఉంచి చికిత్స అందించారు. ఆమెకు కరోనా చికిత్స అందించిన వైధ్యులు ఆమె తాజాగా కరోనాను జయించిందంటూ ప్రకటించారు. ఇటీవల బ్రిటన్‌కు చెందిన 107 ఏళ్ల వృద్దురాలు కరోనాను జయించినట్లుగా ప్రకటించారు. అత్యధిక వయసు ఉన్న మహిళ కరోనా జయించింది అంటూ ప్రకటించారు. ఇప్పుడు ఏకంగా 113 ఏళ్ల వృద్దురాలు కరోనాను జయించినట్లుగా ప్రకటించారు. ఇది ప్రపంచ రికార్డుగా చెప్పుకొచ్చాడు.

హీరో అనిపించుకోవాలనుకున్న పోలీస్‌కు ఫైన్‌

హీరో అనిపించుకోవానుకున్న పోలీస్‌కు ఫైన్‌

బాలీవుడ్‌ హీరో అజయ్‌ దేవగన్‌ ఒక సినిమాలో రెండు బైక్‌లపై ఒక్కో కాలు వేసి చేసిన స్టంట్‌ అప్పట్లో ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమాలో అజయ్‌ దేవగన్‌ స్టంట్‌ను అప్పట్లో యువత తెగ అనుసరించే వారు. కాని కొందరు ప్రమాదాల భారిన పడటంతో పోలీసులు వాటిని బ్యాన్‌ చేశారు.

చాలా ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ఒక వ్యక్తి ఆ స్టంట్‌ను చేయడంతో అది కాస్త వైరల్‌ అయ్యింది. పోలీసులు ఈ వీడియోపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడికి ఏకంగా అయిదు వేల రూపాయల ఫైన్‌ విధించడంతో పాటు మరోసారి ఇలాంటి సంఘటనలు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ స్టంట్‌ చేసింది ఒక పోలీసు అవ్వడంతో మరింత చర్చకు తెర లేచినట్లయ్యింది. అతడు పోలీసు అవ్వడం వల్ల బాధ్యత లేదా అంటూ విమర్శలు గుప్పించారు.
మద్యప్రదేశ్‌కు చెందిన ఈ పోలీసు ఆఫీసర్‌ తన సాహస చర్యను ప్రదర్శించాడు. రెండు కార్ల మద్యలో నిల్చుని దాదాపు అయిదు కిలోమీటర్లు ప్రయాణించాడు. దాంతో ఇప్పుడు అతడిపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి స్టంట్స్‌ చేయవద్దని చెప్పాల్సిన పోలీసులు ఇలా చేస్తే ఎలా అంటూ కాస్త సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు. ఇదే సమయంలో ఆయనకు అయిదు వేల ఫైన్‌ను విధించారు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ:...

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

రాజకీయం

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

ఎక్కువ చదివినవి

పిఠాపురంలో వంగా గీతకు అదే పెద్ద మైనస్.!

నామినేషన్ల పర్వం షురూ అయ్యింది.! జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 23న పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. పిఠాపురంలో జనసేనాని పోటీ చేస్తున్నారని కన్ఫామ్ అయినప్పటికీ, ఇప్పటికీ.....

మెగాస్టార్ చిరంజీవి మీద పడి ఏడుస్తున్న వైసీపీ బ్యాచ్.!

2024 ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని ముందే ఊహించుకున్న వైసీపీ, ప్రతి చిన్న విషయానికీ కలత చెందుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు...

Chiranjeevi: ‘పేదలకు అందుబాటులో..’ యోదా డయోగ్నోస్టిక్స్ ప్రారంభోత్సవంలో చిరంజీవి

Chiranjeevi: ‘ఓవైపు వ్యాపారం మరోవైపు ఉదాసీనత.. రెండూ చాలా రేర్ కాంబినేషన్. యోదా డయాగ్నోస్టిక్స్ అధినేత కంచర్ల సుధాకర్ వంటి అరుదైన వ్యక్తులకే ఇది సాధ్య’మని మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish Shankar) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా...

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి నివాసంలో జరిగిన వీరి భేటికీ టాలీవుడ్...