కరోనా సమయంలో గాంధీ హాస్పిటల్ అరుదైన రికార్డు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా నివారణ చర్యల్లో భాగంగా గాంధీ హాస్పిల్ను కోవిడ్ హాస్పిటల్గా మార్చిన విషయం తెల్సిందే. రాష్ట్రంలో నమోదు అయ్యే పాజిటివ్ కేసులన్నీ కూడా గాంధీలో చికిత్స పొందుతున్నారు. పిల్లలు, వృద్దులు మహిళలతో పాటు గర్బిణిలు కూడా వైరస్ బారిన పడి గాంధీ హాస్పిటల్కు వస్తున్నారు. కొన్ని రోజుల క్రితం గాంధీలో ఒక గర్బవతి అయిన మహిళకు డెలవరీ చేసినట్లుగా మంత్రి ఈటెల ప్రకటించిన విషయం తెల్సిందే.
తాజాగా మరోసారి కరోనా పాజిటివ్ మహిళకు ఆపరేషన్ నిర్వహించి బిడ్డను సురక్షితంగా బయటకు తీశారు. డెలవరీ అయిన మహిళ గత పది రోజులుగా కరోనాతో బాధపడుతుంది. అయితే ఆమెకు జన్మించిన శిషువుకు మాత్రం కరోనా లేదు. గాంధీ హాస్పిటల్లో నిర్వహించిన ఈ అరుదైన ఆపరేషన్ పై జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కుతున్నాయి.
ఆర్టీసీ బస్సుల్లో సామాజిక దూరం ఇలా
గత రెండు నెలలుగా ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిన విషయం తెలిసిందే. కరోనా విజృభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తప్పని సరి పరిస్థితుల్లో లాక్ డౌన్ అమలు చేయడం జరిగింది. 45 రోజుల లాక్ డౌన్ తో ఆర్ధిక వ్యవస్థ అస్తవ్యస్తం అయ్యింది. అన్ని రంగాల్లో కుదేలయ్యాయి. దాంతో ఆర్ధిక పరిస్థితిని మెరుగు పరిచేందుకు లాక్ డౌన్ లో సడలింపులు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే ఆర్టీసీ ని కూడా పునరుద్ధరించే యోచనలో ప్రభుత్వాలు ఉన్నాయి.
ఈ నెల 18 నుండి ఏపీ లో ఆర్టీసీ బస్సులు తిరగడం ఖాయంగా ఉంది. అందుకోసం ఏర్పాట్లు కూడా ప్రారంభం అయ్యాయి. బస్సుల్లో సామాజిక దూరం పాటించేలా కొన్ని సీట్లను తగ్గిస్తున్నారు. సాధారణంగా బస్సుల్లో ఒక వైపు మూడు మరోవైపు రెండు సీటింగ్ సదుపాయం ఉంటుంది. మూడు సీట్లు ఉన్న వైపు మధ్య సీటును మార్క్ చేశారు.
మరో వైపు రెండు సీట్లలో ఒక సీట్ ను మార్క్ చేశారు. ఆ సీట్స్ లో ఎవరు కూర్చోకూడదు అనేది నిబంధన. ఇక సీట్లు ఉన్నవరకె ఎక్కించుకోవాల్సి ఉంటుంది. అంతకు మించి జనాలను బస్సులో ఎక్కించుకోరు. మరి ఇలాంటి జాగ్రత్తలతో కరోనా వ్యాప్తి చెందకుండా ఉంటుందా అంటే అనుమానమే అంటూ జనాలు పెదవి విరుస్తున్నారు.
దారుణం : భర్తను కాపాడబోయిన భార్య.. ఇద్దరూ మృతి
కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం బొప్పాస్పల్లికి చెందిన దారావత్ శంకర్ మరియు ఆయన భార్య మరోనిబాయీ కరెంట్ షాక్ కొట్టి మృతి చెందారు. భర్త శంకర్ను కాపాడబోయిన మారోనిబాయీకి కూడా షాక్ రావడంతో ఇద్దరు అక్కడికి అక్కడే మృతి చెందారు. కుటుంబ సభ్యులతో కలిసి శంకర్ ఒక తోటలో పని చేస్తున్నాడు. ఆ తోటలోనే ఉండే ఒక రేకుల షెడ్డులో ఉంటూ పని చేసుకుంటున్నారు. తోట చుట్టు ఉండే ఇనుక కంచెపై కరెంట్ తీగ పడటంను శంకర్ గుర్తించలేదు.
కంచె సమీపంలో శంకర్ స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్త ఆ కంచెకు చేయి ఆనించాడు. అంతే అతడికి విధ్యుత్ షాక్ తగిలింది. శంకర్ కొట్టుకోవడం చూసిన భార్య ఏమయ్యింది అంటూ అతడిని పట్టుకుంది. దాంతో ఆమెకు కూడా కరెంట్ షాక్ తగిలింది. వారి కూతురు కూడా వారిని పట్టుకునేందుకు ప్రయత్నించింది. కాని కరెంట్ షాక్గా భావించి దూరం ఉండి పోయింది. దాంతో ఆమెకు పెద్ద ప్రమాదం తప్పింది.
కరోనాను జయించిన పిల్లలకు సరికొత్త సమస్య
ప్రపంచ వ్యాప్తంగా పెద్దలు మాత్రమే కాకుండా పిల్లలు వృద్దులు కూడా కరోనా బారిన పడి మృత్యువాత పడుతున్న విషయం తెల్సిందే. కరోనా నుండి కోలుకుంటున్న వారు కూడా భారీగానే ఉన్నారు. పిల్లలు ఎక్కువ శాతం కరోనా జయిస్తున్నట్లుగా రిపోర్ట్ అందుతుంది. పిల్లలకు కరోనా సోకినా మూడు వారాల్లో వారు నెగటివ్కు వచ్చేస్తున్నారు. ప్లిల మరణాల శాతం చాలా తక్కువగా ఉంటుంది. అయితే కరోనాను జయించిన పిల్లలు సరికొత్త సమస్యను ఎదుర్కొంటున్నారు.
అమెరికా న్యూయార్క్లోని వంద మంది పిల్లలకు కవాసాకీ అనే చిత్రమైన రోగం వచ్చింది. ఇప్పటికే ఆ రోగంతో అయిదుగురు పిల్లలు మృతి చెందారు. అయితే ఈ జబ్బు బారిన పడుతున్న పిల్లల్లో ఎక్కువ శాతం మంది కరోనా వైరస్ బారిన పడి కోలుకున్న వారే. అంటే కరోనాను జయించిన పిల్లలకు ఈ సరికొత్త వ్యాధి వస్తుందని వారు అంటున్నారు. అజాగ్రత్తగా ఉంటే పిల్లల ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని లక్షణాలు కనిపిస్తే వెంటనే హాస్పిటల్కు తరలించాలంటూ న్యూయార్స్ మేయర్ సూచించారు.
ఈ జబ్బుతో బాధపడుతున్న పిల్లలు జ్వరంను కలిగి ఉండటం, నీరసంగా ఉండటం, ఆకలి వేయక పోవడం, దురదలు రావడం, పొట్టలో నొప్పి రావడం, వాంతులు చేసుకోవడం వంటివి చేస్తారు. ఈలక్షణాలు ఉంటే వెంటనే వారిని చికిత్సకు తరలించడం మంచిది అంటూ వైధ్యులు సూచిస్తున్నారు.
రికార్డ్ – ఆ బామ్మ కరోనాపై విజయం సాధించింది
కరోనా మహమ్మారి వృద్దులపై అధికంగా ప్రభావం చూపుతుందనే విషయం అందరికి తెల్సిందే. గుండె సంబంధిత సమస్యలు మరియు డయాబెటీస్తో బాధపడుతున్న వారు ఎంతో మంది కరోనా బారిన పడి మృతి చెందిన దాఖలాలు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా మృతి చెందిన వారిలో అత్యధికులు వృద్దులు అనే విషయం తెల్సిందే. ఆ కారణంగానే వృద్దులను అస్సలు బయటకు రానివ్వకూడదని అందరు దేశాధినేతలు పిలుపునిచ్చారు. ఇదే సమయంలో కొన్ని దేశాలు 70 ఏళ్లు దాటిన వృద్దులకు ట్రీట్మెంట్ ఇవ్వడమే మానేశాయి. కాని స్పెయిన్లో మాత్రం 113 ఏళ్ల వృద్దురాలు కరోనాను జయించింది.
స్పెయిన్కు చెందిన మారియా బ్రన్యాస్కు 113 ఏళ్లు. ఇటీవల ఆమె అనారోగ్యం పాలవ్వడంతో వైధ్యులు ఆమెకు కరోనా నిర్ధారణ పరీక్ష నిర్వహించగా పాజిటివ్ అని వచ్చింది. ఆమెకు ప్రత్యేకమైన వార్డులో ఉంచి చికిత్స అందించారు. ఆమెకు కరోనా చికిత్స అందించిన వైధ్యులు ఆమె తాజాగా కరోనాను జయించిందంటూ ప్రకటించారు. ఇటీవల బ్రిటన్కు చెందిన 107 ఏళ్ల వృద్దురాలు కరోనాను జయించినట్లుగా ప్రకటించారు. అత్యధిక వయసు ఉన్న మహిళ కరోనా జయించింది అంటూ ప్రకటించారు. ఇప్పుడు ఏకంగా 113 ఏళ్ల వృద్దురాలు కరోనాను జయించినట్లుగా ప్రకటించారు. ఇది ప్రపంచ రికార్డుగా చెప్పుకొచ్చాడు.
హీరో అనిపించుకోవాలనుకున్న పోలీస్కు ఫైన్
బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ ఒక సినిమాలో రెండు బైక్లపై ఒక్కో కాలు వేసి చేసిన స్టంట్ అప్పట్లో ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమాలో అజయ్ దేవగన్ స్టంట్ను అప్పట్లో యువత తెగ అనుసరించే వారు. కాని కొందరు ప్రమాదాల భారిన పడటంతో పోలీసులు వాటిని బ్యాన్ చేశారు.
334508 609808Rattling clean internet website , thanks for this post. 95501