Switch to English

కరోనా కేసుల్లో హై‘ఢర్’బాద్..!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

తెలంగాణలో కరోనా కేసులు దాదాపు అదుపులోకి వచ్చాయనుకుంటున్న తరుణంలో ఆ మహమ్మారి కన్నెర్రజేసింది. ఒక్కరోజే ఏకంగా 79 కేసులు నమోదు కావడం అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. తెలంగాణలో కేసులు వెలుగు చూడటం మొదలైన తర్వాత ఇంత తీవ్రస్థాయిలో పాజిటివ్ కేసులు రావడం ఇదే మొదటిసారి. ఇప్పటివరకు అత్యధికంగా ఒకేరోజు 75 కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు దానిని అధిగమించి 79 కేసులు రావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. నిజానికి కరోనా కేసులు తెలంగాణలో తగ్గుముఖం పట్టాయి. 26 జిల్లాల్లో గత 14 రోజులుగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. తొలి నుంచీ మూడు జిల్లాల్లో ఒక్క కేసు కూడా లేదు. ప్రస్తుతం కొత్తగా వచ్చే కేసులన్నీ హైదరాబాద్ లోనే నమోదవుతున్నాయి.

మొన్నటివరకు పది, పన్నెండు, 26.. ఇలా కేసులు నమోదుకాగా, తాజాగా ఒక్కసారి భారీగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత రెండు మూడు రోజులుగా దాదాపు వెయ్యి పరీక్షలు నిర్వహించడంతోనే కేసుల సంఖ్య పెరిగినట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అంటే, ఇన్నాళ్లూ తాము తక్కువ పరీక్షలు చేసిన విషయాన్ని వారే అంగీకరించినట్టయింది. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కరోనా పరీక్షల విషయంలో తెలంగాణ చాలా వెనకబడే ఉంది. ఇదే విషయాన్ని ఆరోగ్యమంత్రి ఈటల రాజేందర్ వద్ద ప్రస్తావించినా.. తాము ఎవరికి పడితే వారికి పరీక్షలు చేయబోమని స్పష్టంచేశారు. మరోవైపు కరోనా అనుమానిత లక్షణాలతో చనిపోయినవారికి పరీక్షలు నిర్వహించొద్దని ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీచేసింది. ప్రస్తుతం దీనిపై హైకోర్టులో కేసు నడుస్తోంది.

ఇక హైదరాబాద్ రెడ్ జోన్ లో ఉన్నప్పటికీ, మద్యం షాపులు తెరవడంతో సమస్య తీవ్రత ఎక్కువైంది. మద్యం షాపులకు అనుమతి ఇచ్చే అంశాన్ని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు తీవ్రంగానే వ్యతిరేకించినట్టు సమాచారం. రెడ్ జోన్ లో ఉన్న హైదరాబాద్ లో మద్యం అమ్మకాలకు అనుమతి ఇస్తే కరోనా వ్యాప్తి పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కానీ రాష్ట్రం మొత్తంలో మద్యంపై ఎక్కువ ఆదాయం వచ్చేది హైదరాబాద్ నుంచే. పైగా ఇతర జిల్లాల్లో అనుమతి ఇచ్చి, హైదరాబాద్ లో ఇవ్వకుంటే మద్యం కోసం జిల్లా సరిహద్దులు దాటడానికి ప్రజలు ప్రయత్నిస్తారని భావించి.. రాష్ట్రం మొత్తం మద్యం విక్రయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. దీంతో మద్యం కొనుగోలు కోసమంటూ భారీ స్థాయిలో జనాలు రోడ్డెక్కేశారు. దీంతో పోలీసులు సైతం ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ లో ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా పనిచేస్తున్నాయంటే.. వాహనాలు ఎలా తిరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.

ఫలితంగా ఇప్పటివరకు తగ్గుముఖం పట్టిందనుకుంటున్న కరోనా.. ఒక్కసారిగా జూలు విదిల్చినట్టయింది. ఇదే ఒరవడి కొనసాగితే హైదరాబాద్ లో కేసులు నమోదు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక సీఎం కేసీఆర్ సైతం కరోనాతో కలిసి జీవించక తప్పదని మరోసారి స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో అందుకు తగిన ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అంటే రాబోయే కాలంలో కరోనాతో సావాసం చేయక తప్పదని ఆయన నిర్ధారణకు వచ్చేశారు. ఇక ప్రజలు ఆ దిశగా అప్రమత్తం కాక తప్పని పరిస్థితి కనిపిస్తోంది.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం ప్రముఖంగా వార్తల్లో నిలుస్తున్నారు. కారణం.. రాజమౌళి...

ఇన్ సైడ్ స్టోరీ.! ఉప్మా పద్మనాభం రెడ్డి.!

మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ప్రస్తుతం వైసీపీ నేతగా వున్నారు.! వున్నారంటే, వున్నారంతే.! ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ని...