Switch to English

సడలింపులతో సమస్యలు తప్పవా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

దేశంలో కరోనా వైరస్ నిరోధానికి విధించిన లాక్ డౌన్ కొనసాగుతోంది. అయినా వైరస్ వ్యాప్తికి మాత్రం అడ్డుకట్ట పడలేదు. రోజురోజుకూ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం కొన్ని సడలింపులు ప్రకటించింది. వలస కూలీల పాట్లు చూసిన తర్వాత వారికి ఉపాధి కల్పించే ఉద్దేశంతోనూ, ఆర్థిక వ్యవస్థను కాపాడే క్రమంలోనూ ఈ మేరకు వెసులుబాట్లు కల్పించింది. రాష్ట్రాలు వీటిపై తగిన నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొంది. దీంతో పలు అంశాల్లో రాష్ట్రాలు కూడా సడలింపులు ఇస్తున్నాయి.

నిజం చెప్పాలంటే ఖాళీ కడుపులను నింపలేక సతమతమవుతున్న సర్కారులు.. ఈ విధంగానైనా వారికి ఉపాధి కల్పించాలని చూస్తున్నాయి. కానీ దానివల్ల తలెత్తే పరిణామాలను మాత్రం అంచనా వేయలేకపోతున్నాయి. లాక్ డౌన్ ఉంటేనే ఇబ్బడిముబ్బడిగా కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో దానిని ఎత్తేసినా.. సడలింపులు ఇచ్చినా పరిస్థితి మరీ భయంకరంగా మారుతుందని నిపుణులు హెచ్చరికలు చేస్తున్నారు.

కష్టమో, నష్టమో ప్రజల ఆరోగ్యం కంటే ఏదీ ఎక్కువ కానందున మరికొంతకాలం సడలింపులు లేని లాక్ డౌన్ అమలు చేయాలని సూచిస్తున్నారు. కరోనా విషయంలో ప్రపంచ దేశాలను తప్పుదోవ పట్టించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా లాక్ డౌన్ ఎత్తివేయొద్దు మొర్రో అని మొరపెట్టుకుంటోంది. ఈ పరిస్థితుల్లో లాక్ డౌన్ ఎత్తివేస్తే ఇప్పటివరకు పడ్డ శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరేనని చెబుతోంది.

ఆంక్షలు ఎత్తివేసినా, సడలింపులు ఇచ్చినా అగ్రరాజ్యం అమెరికా మరింత కుదేలు కావడం తాజాగా పరిశోధకులు హెచ్చరించారు. అలా చేస్తే ఆగస్టు నాటికి అక్కడ మరణాలు రెట్టింపు అయ్యే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఇప్పటివరకు అమెరికాలో దాదాపు 12 లక్షల మందికి కరోనా సోకగా.. సుమారు 70 వేల మంది మృత్యువాత పడ్డారు.

అక్కడ ప్రస్తుతం అమల్లో ఉన్న ఆంక్షలు ఈనెల రెండో వారంతో ముగియనున్నాయి. ఈ వేసవిలో వైరస్ మరింత విజృంభించే ప్రమాదం ఉందని, అదే సమయంలో ఆంక్షలు ఎత్తివేస్తే ఫలితం దారుణంగా ఉంటుందని వాషింగ్టన్ కు చెందిన హెల్త్ మెట్రిక్స్ ఎవాల్యుయేషన్ హెచ్చరించింది. ఆగస్టు నాటికి ఏకంగా లక్షా 40వేల మంది చనిపోయే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో అమెరికాలోనే కాదు.. వైరస్ విజృంభిస్తున్న భారత్ వంటి దేశాల్లో సైతం అత్యంత జాగ్రత్తతో ఉండాలని నిపుణులు స్పష్టంచేస్తున్నారు. సడలింపులు ఇచ్చే విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని చెబుతున్నారు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

రాజకీయం

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎక్కువ చదివినవి

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.. దీనిపై ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. ప్రస్తుతం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...