Switch to English

కరోనా రహిత తొలి రాష్ట్రంగా గోవా.. ఎలా సాధ్యమైంది?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

ప్రపంచం మొత్తం కరోనాతో అతలాకుతలమవుతున్న తరుణంలో ప్రముఖ పర్యాటక రాష్ట్రమైన గోవా కరోనా రహితంగా మారింది. దేశంలో ఒక్క కరోనా కేసు కూడా లేని తొలి రాష్ట్రంగా నిలిచింది. ఈనెల 3న అక్కడ చివరి పాజిటివ్ కేసు నమోదు కాగా, ఇప్పటివరకు పాజిటివ్ గా నిర్ధారణ అయినవారంతా కోలుకుని ఇంటికి వెళ్లిపోయారు. ఇదంతా ఎలా సాధ్యమైందంటే.. ఆ రాష్ట్రం ముందుచూపే ఇందుకు కారణమని చెప్పొచ్చు.

చిన్న రాష్ట్రమైన గోవా జనాభా 16 లక్షల కంటే తక్కువే. దేశంలో కరోనా కల్లోలం మొదలు కాగానే మిగిలిన రాష్ట్రాల కంటే ముందుగానే గోవా మేల్కొంది. పర్యాటక ప్రాంతం కావడంతో ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి ఇక్కడకు ఎక్కువగా పర్యాటకులు వస్తుంటారు కాబట్టి, త్వరగా కరోనా సోకే ప్రమాదం ఉందని గ్రహించి విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ పరీక్షలు అందరి కంటే ముందుగానే మొదలుపెట్టింది.

ప్రధాని నరేంద్ర మోదీ జనతా కర్ఫ్యూ ప్రకటించడానికి ముందుగానే గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ కొన్ని చర్యలు చేపట్టారు. రోడ్డు పక్క దుకాణాలు మూయించివేయడం దగ్గర నుంచి ప్రజా రవాణాను పరిమితం చేయడం వంటి పలు లాక్ డౌన్ చర్యలు ముందుగానే తీసుకున్నారు. దేశంలో లాక్ డౌన్ ప్రకటించిన అనంతరం మార్చి 25న గోవాలో తొలి కరోనా కేసు నమోదైంది. దీంతో లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేశారు. ఏప్రిల్ 3న చివరి కేసు వెలుగు చూసింది.

మొత్తమ్మీద కరోనా లక్షణాలు కలిగిన, వారితో కాంటాక్టు ఉన్న 800 మందికి పరీక్షలు నిర్వహించగా.. ఏడుగురికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఏప్రిల్ 15 నాటికి ఆరుగురు కోలుకుని ఇంటికి వెళ్లిపోగా.. ఆదివారం ఏడో వ్యక్తి కూడా కోలుకుని డిశ్చార్జి అయ్యాడు. దీంతో కరోనా కేసులు లేని తొలి రాష్ట్రంగా గోవా రికార్డు సృష్టించింది. దీంతో కేంద్రం నిర్ణయం మేరకు సోమవారం నుంచి లాక్ డౌన్ మినహాయింపులు వర్తింపజేస్తోంది.

అయితే, ప్రజలు భౌతిక దూరం పాటించే విషయలో కఠినంగానే వ్యవహరిస్తోంది. బైక్ పై ఒకరు మాత్రమే వెళ్లాలని, కారులో డ్రైవర్ కాకుండా మరో వ్యక్తికి మాత్రమే ప్రయాణించాలని పోలీసులు స్పష్టంచేస్తున్నారు. పైగా కారులో రెండో వ్యక్తి డ్రైవర్ పక్క సీటులో కాకుండా తప్పనిసరిగా వెనుక సీటులోనే కూర్చోవాలని నిర్దేశిస్తున్నారు. వీటిని ఉల్లంఘిస్తే జరిమానాలు విధిస్తున్నారు.

కరోనా రహిత తొలి రాష్ట్రంగా ఉన్న గోవాలో మళ్లీ ఒక్క కేసు కూడా నమోదు కాకుండా చూడాలనే లక్ష్యంతో అటు ప్రభుత్వం, ఇటు పోలీసులు ముందుకెళ్తున్నారు. మరోవైపు తాజాగా మణిపూర్ సైతం కరోనా రహిత రాష్ట్రంగా నిలిచింది. ఇక్కడ రెండు పాజిటివ్ కేసులు రాగా, ఇరువురూ కోలుకున్నారు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ:...

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

రాజకీయం

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

ఎక్కువ చదివినవి

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ: నిర్మాత రాజీవ్

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమాను రాజీవ్...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...