Switch to English

జగన్‌ సారూ.. ఉత్తరాంధ్ర ఉసురు పోసుకోవద్దు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,445FansLike
57,764FollowersFollow

ఉత్తరాంధ్రలో చెత్త రాజకీయాల్ని మొదలు పెట్టింది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ. దేశంలో ఏ రాష్ట్రానికీ మూడు రాజధానులు లేనప్పుడు, ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో వున్న రాష్ట్రానికి మూడు రాజధానులు ఎందుకు.? అనే ప్రశ్నకు సమాధానం చెప్పడం చేతకాక, ఉత్తరాంధ్ర ప్రజల్లో రాజధాని సెంటిమెంట్‌ని రగుల్చుతోంది. ‘విశాఖలో అడ్మినిస్ట్రేటివ్‌ క్యాపిటల్‌ని వ్యతిరేకిస్తే.. మా ఉత్తరాంధ్రకి రావొద్దు..’ అని కొందరి చేత వైసీపీ మాట్లాడిస్తోంది.

ఉత్తరాంధ్ర సంస్కృతీ సంప్రదాయాలు తెలిసినవారెవరూ దీన్ని సమర్థించరు. ఉత్తరాంధ్ర ఆలోచనలు వేరు. ఉత్తరాంధ్రలోని ప్రశాంతత వేరు. ఎవరికీ హాని తలపెట్టని నైజం ఉత్తరాంధ్ర ప్రజలది. ఉత్తరాంధ్ర ప్రజలు ఎక్కడికి వెళ్ళినా, అక్కడి పరిస్థితులతో మమేకమైపోతారు. హైద్రాబాద్‌ కావొచ్చు, చెన్నయ్‌ కావొచ్చు, బెంగళూరు కావొచ్చు.. దేశంలోని ఇతర నగరాలు కావొచ్చు.. ఉత్తరాంధ్రులు ఎక్కడ వున్నా, ఎక్కడా అశాంతికి, ఆందోళనలకు తావుండదు. దురదృష్టవశాత్తూ ఉత్తరాంధ్రలోనే ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయిప్పుడు కపట రాజకీయాల కారణంగా.

నిన్న చంద్రబాబుకి జరిగింది.. రేప్పొద్దున్న ఇంకొకరికి జరగకుండా పోదు. ఎందుకంటే, అక్కడ ఆ స్థాయిలో రాజకీయ చిచ్చుని వైసీపీ రాజేసింది. ఏం.? చంద్రబాబు చిత్తూరు జిల్లాకి వెళితే, అక్కడెందుకు రాయలసీమ సెగని వైసీపీ రెచ్చగొట్టలేకపోయింది.? ఇక్కడ విషయం చాలా క్లియర్‌. ప్రశాంత ఉత్తరాంధ్రలో అలజడిని సృష్టించడం ద్వారా, ఉత్తరాంధ్రకి చెడ్డ పేరు తీసుకురావాలన్నదే అధికార పార్టీ లక్ష్యం.. అన్నది ఉత్తరాంధ్రలో ప్రముఖంగా విన్పిస్తోన్న అభిప్రాయం.

‘విశాఖ అభివృద్ధి చెందిన నగరం.. రాజధానిగా మార్చి.. కొత్తగా చేసే అభివృద్ధి ఏముంది.? విశాఖలోనూ సమస్యలున్నా, ఆ సమస్యల్ని పరిష్కరిస్తే.. దాన్ని రాజధాని కన్నా ఎక్కువ..’ అని ఉత్తరాంధ్ర మేధావులు నినదిస్తున్నారు. కానీ, ఉత్తరాంధ్ర ప్రజల ఆలోచనలతో తమకు సంబంధం లేదన్నట్లే వ్యవహరిస్తోంది అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ. దానికి తగ్గట్టుగానే ఉత్తరాంధ్రలో చిత్ర విచిత్రమైన రాజకీయాలకు తెరలేపింది. కర్నూలు లేని, విజయవాడలో లేని, చిత్తూరులో లేని.. రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో ఎక్కడా లేని చెత్త రాజకీయానికి ఉత్తరాంధ్ర వేదికగా మారడాన్ని సగటు ఉత్తరాంధ్ర ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల...

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను...

Fahadh Faasil: ‘పుష్ప’తో ఇమేజ్ మారిందా..? ఫహద్ ఫాజిల్ సమాధానం వైరల్

Fahadh Faasil: అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప (Pushpa)  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సినిమాలో...

Sukumar: సుకుమార్ కెరీర్ @20 ఆయన బ్రెయిన్ పవర్ 2.0

Sukumar: లెక్కలు.. ఈ సబ్జెక్టే ఎంతో కష్టం. కానీ.. ఇష్టంగా భావించేవాళ్లకు లెక్కలు తప్ప మరొకటి ఎక్కదు. లెక్కలతో పదునెక్కిన మనిషి మెదడు చేసే ఏ...

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

రాజకీయం

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల చేసిన జయప్రకాశ్ నారాయణ

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను విడుదల చేశారు జయప్రకాష్ నారాయణ (Jaya...

తమ్ముడి గెలుపు కోసం అన్నయ్య.! వైసీపీకి కంగారెందుకు.?

ఏదన్నా కుటుంబం కలిసి మెలిసి వుంటే, చూసి ఓర్చుకోలేని నైజం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన తల్లి దూరం పెట్టడం చూస్తున్నాం. సోదరి షర్మిల అయితే, ఏకంగా...

Chiranjeevi: పిఠాపురం ప్రజలు పవన్ ను గెలిపించండి.. అండగా ఉంటాడు: చిరంజీవి

Chiranjeevi: ‘జనమే జయం అని నమ్మే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మీ ముందుకు వచ్చాడు. మీ కోసం సైనికుడిగా.. సేవకుడిగా నిలబడతాడు. మీకేం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు జనసేన (Janasena)కు...

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఎక్కువ చదివినవి

Mudragada: ముద్రగడ ఇంట రాజకీయ చిచ్చు.. కుమార్తె వ్యాఖ్యలపై పద్మనాభం స్పందన

Mudragada: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంకు సొంత ఇంటి నుంచే వ్యతిరేకత ఎదురైంది. పవన్ ను ఓడించకపోతే పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు. ఆమె...

Chiranjeevi: పిఠాపురం ప్రజలు పవన్ ను గెలిపించండి.. అండగా ఉంటాడు: చిరంజీవి

Chiranjeevi: ‘జనమే జయం అని నమ్మే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మీ ముందుకు వచ్చాడు. మీ కోసం సైనికుడిగా.. సేవకుడిగా నిలబడతాడు. మీకేం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు జనసేన (Janasena)కు...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా: దర్శకుడు వంశీ

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి దర్శకుడిగా తొలి సినిమా. సితార సినిమా...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...