Switch to English

ఇన్‌సైడ్‌ స్టోరీ: స్మశానంలో.. ఎడారిలో పేదలకు ఇళ్ళ స్థలాలు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,430FansLike
57,764FollowersFollow

అమరావతి కాదది భ్రమరావతి.! అమరావతో హైమావతో ఎవరికి తెలుసు.! అమరావతి ఎడారిని తలపిస్తోంది.! అమరావతి – స్మశానం.! ఇలా చెప్పుకుంటూ పోతే, అమరావతి చుట్టూ చాలా రాజకీయాలు నడిచాయి. అమరావతి మునిగిపోతుందన్నారు.. అమరావతిలో భూకంపాలు వస్తాయన్నారు.. అమరావతి కార్పొరేట్‌ రంగానికి చెందిన బడా బాబులకు తప్ప, సామాన్యులకు కానే కాదన్నారు. గడచిన ఐదేళ్ళుగా ఇదే తంతు.! ఏ అమరావతిని అయితే స్మశానం అన్నారో, ఏ అమరావతిని ఎడారి అన్నారో.. అక్కడి నుంచే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా పరిపాలన చేస్తోంది.

ఆ అమరావతిని కాలగర్భంలో కలిపేసే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమయ్యింది. ఓ పక్క అమరావతిని శాసన రాజధానిగా కొనసాగిస్తామంటూనే, అమరావతిలో నిర్మాణంలో వున్న భవనాల పనుల్ని కొనసాగించేందుకు మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు వేయడంలేదు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం గత ఎనిమిది నెలలుగా.! ఇదిలా వుంటే, అమరావతిలో పేదలకు ఇళ్ళ స్థలాలు ఇచ్చేందుకోసం వైఎస్‌ జగన్‌ సర్కార్‌ సరికొత్త ప్లాన్‌ సిద్ధం చేసింది. కృష్ణా జిల్లాతోపాటు, గుంటూరు జిల్లాకి చెందిన పేదలకు అమరావతిలో ఇళ్ళ స్థలాలు ఇవ్వాలన్నదే ఆ ప్లాన్‌.

అమరావతిలో ‘ల్యాండ్‌ బ్యాంక్‌’ వుంది గనుక, దాన్ని ఇలా వినియోగిస్తారన్నమాట. నిజానికి, పేదలకు ఇళ్ళ స్థలాల్ని ప్రభుత్వం ఇస్తామని చెబితే ఎవరు కాదంటారు.? కానీ, ఇక్కడ పరిస్థితి వేరు. ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మిస్తామని ప్రభుత్వం చెబితేనే, అమరావతిలో రైతులు, ప్రభుత్వానికి తమ భూముల్ని ఇచ్చారు. కానీ, అలా రైతులు ఇచ్చిన భూముల్ని, పేదల ఇళ్ళ స్థలాల కోసం ప్రభుత్వం కేటాయిస్తామనడమేంటి.? ఇదే ప్రశ్న సంధిస్తూ, భూముల్లో సర్వే కోసం వస్తున్న అధికారుల్ని రైతులు నిలదీస్తున్నారు.

ప్రభుత్వం అట్టహాసంగా పేదలందరికీ ఇళ్ళ స్థలాల కార్యక్రమం చేపట్టింది. ఉగాదిని డెడ్‌లైన్‌గా పెట్టుకుంది కూడా. కానీ, రాష్ట్రంలో తగిన స్థాయిలో భూ లభ్యత లేక నానా తంటాలూ పడ్తోంది ప్రభుత్వం. సరిగ్గా ఈ సమయంలోనే అమరావతి భూములు ప్రభుత్వానికి అప్పనంగా దొరికినట్లయ్యింది. కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందినవారికి మాత్రమే ఎందుకు.?

రాష్ట్రంలో అన్ని జిల్లాలకు చెందిన పేదలకీ ఇక్కడే భూములు ఇచ్చేయొచ్చు కదా.? అన్న సెటైర్లు ప్రభుత్వం మీద పడుతున్నాయి. మొత్తమ్మీద, ‘స్మశానం – ఎడారి’ అని చెప్పిన ప్రభుత్వ పెద్దలే, అమరావతిని ఇప్పుడు తమకు అవకాశంగా మార్చుకుంటున్నారు. అయినా స్మశానంలోనూ, ఎడారిలోనూ, మునిగిపోయే ప్రాంతంలోనూ, భూకంపాలు వచ్చే ప్రాంతంలోనూ పేదలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వడమేంటి.? అంటే, ప్రజల్ని ఏ కోణంలో ప్రభుత్వం చూస్తున్నట్లు.?

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎక్కువ చదివినవి

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

చేతులెత్తేసిన జగన్.! ఎందుకీ పరిస్థితి.?

ఎన్నికల కోడ్ రాకుండానే, వైసీపీకి చాలామంది ప్రజా ప్రతినిథులు గుడ్ బై చెప్పేశారు. సిట్టింగ్ ప్రజా ప్రతినిథుల్లో సగానికి పైగా ప్రజా ప్రతినిథులు ఓడిపోతారంటూ అంతర్గత సర్వేల్లో తేలడంతో, టిక్కెట్ల విషయమై వైఎస్...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి ని తెలుగు లో 'సత్య' గా...

Chandrababu Naidu : యూట్యూబ్‌లో బాబు బయోపిక్‌ ‘తెలుగోడు’

Chandrababu Naidu : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి ఏ స్థాయిలో ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సమయంలో సోషల్‌ మీడియా క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. సోషల్‌ మీడియా ద్వారా ఓటర్లను...