Switch to English

జగన్‌ సారూ.. ప్రశ్నిస్తే పాతరేస్తారా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుకలు ఖచ్చితంగా వుండి తీరాల్సిందే. రాజకీయ పార్టీలకు మీడియా సంస్థలు బాకా ఊదుతున్నాయి కాబట్టే.. వాస్తవాల్ని వెలుగులోకి తెచ్చేందుకు సోషల్‌ మీడియాలో సామాన్యులు యాక్టివ్‌ అవుతున్నారు. అదే సమయంలో, మీడియా ఎలాగైతే భ్రష్టుపట్టిపోయిందో సోషల్‌ మీడియాలోనూ ‘చెడు వార్తలు’ అలాగే పెరిగిపోయాయి. మీడియా భ్రష్టుపట్టిపోయింది గనుక.. దాన్ని బ్యాన్‌ చేసెయ్యలేదు కదా.! సోషల్‌ మీడియా కూడా అంతే. అన్నిట్లోనూ మంచి, చెడు వుంటాయి.. వుండి తీరతాయి కూడా.

మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలొస్తే, ఉక్కుపాదంతో అణిచిపెట్టేసే దిశగా వైఎస్‌ జగన్‌ సర్కార్‌ అడుగులు వేస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక కథనాలపై న్యాయ పరమైన చర్యల తీసుకునే దిశగా క్యాబినెట్‌ పలు నిర్ణయాలు తీసుకుంది. అంటే, ఇకపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదన్నా కథనం వస్తే.. అంతే సంగతులన్నమాట. ఇది సాధ్యమయ్యే పనేనా.? గతంలో తెలంగాణ ప్రభుత్వం రెండు న్యూస్‌ ఛానల్స్‌పై అనధికారిక వేటు వేసింది. ఆ తర్వాత ఆ ఛానెల్స్‌ పునరుద్ధరణ జరిగింది.

ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇప్పుడు రెండు ఛానళ్ళపై అనధికారిక వేటు కొనసాగుతోంది. ఇది ఖచ్చితంగా అధికార పైత్యమే. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. ప్రభుత్వంపై వచ్చే విమర్శల్ని సహించలేకపోతే.. అదసలు ప్రజాస్వామ్యమే కాదు. రాజకీయ పార్టీల్లో జరిగే పరిణామాల గురించి ఊహాగానాలు రావడం సహజమే. ప్రభుత్వాలకు సంబంధించి కూడా ఊహాగానాలు వస్తుంటాయి.

చాలా సందర్భాల్లో ఆ ఊహాగానాలు నిజమవుతాయి కూడా. అధికార పార్టీ నేతల ఆగడాలు సర్వసాధారణం. వాటిని వెలుగులోకి తెచ్చినప్పుడు, ప్రభుత్వ వ్యతిరేక చర్య.. అని అనగలమా.? అధికార పీఠమెక్కుతూనే ప్రజాస్వామ్యం గురించి నీతుల్ని ఘనంగా చెప్పే పాలకులు, ఆ ప్రజాస్వామ్యానికి మూల స్థంబాల్లో ఒకటైన ప్రశ్నించే గొంతుకని మాత్రం తొక్కి పెట్టేయాలనుకుంటారు. ఇదెక్కడి చోద్యం.? తమ వైఫల్యాల్ని ఎవరైనా ఎత్తి చూపితే తట్టుకోలేని పాలకులు అసలు పాలకులుగా వుండడానికే అనర్హులు.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

Elephant: గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ భద్రత.. వీడియో వైరల్

Elephant: కుటుంబం తమ పిల్లల సంరక్షణను ఎలా చూసుకుంటుందో మానవ సంబంధాలలో చూస్తూంటాం. తమకూ తెలుసనిపించేలా ఉన్న అడవిలోని ఏనుగులకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ‘ఎక్స్’లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.. దీనిపై ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. ప్రస్తుతం...