Mahasena Rajesh: ఓపక్క ఏపీలో పొలిటికల్ హీట్ కొనసాగుతుంటే.. మరోపక్క టీడీపీ (Tdp)-జనసేన (Janasena)-బీజేపీ (Bjp) పొత్తులో భాగంగా సీట్ల పంపకంలో అభ్యర్ధుల మధ్య సఖ్యత లేనట్టుగానే కనిపిస్తోంది. దాదాపు మూడు పార్టీల నుంచి అభ్యర్ధుల ఖరారైనా గ్రౌండ్ లెవల్లో సమస్యలు కనిపిస్తున్నాయి. పి.గన్నవరం నుంచి టీడీపీ అభ్యర్ధిగా ప్రకటించిన మహాసేన రాజేశ్ (Mahasena Rajesh) వ్యవహారమే ఇందుకు నిదర్శనం.
రాజేశ్ అభ్యర్ధిత్వం ప్రకటించినప్పటి నుంచీ ఆయన గత వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయనకు సీటు ఎలా కేటాయిస్తారంటూ కామెంట్స్ వచ్చాయి. పరిస్థితి ఇంకా సద్దుమణగకపోవడంతో రాజేశ్ ఆవేదన వ్యక్తం చేస్తూ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. తనను బీజేపీ-జనసేన నుంచి ఇబ్బంది ఎదురవుతోందని వీడియో పోస్ట్ చేశారు.
‘చంద్రబాబు నాకు సీటు ఇవ్వకముందే ప్రశాంతంగా ఉన్నాను. నేను ఇంచార్జిగా ఉన్న స్థానంలో నన్ను అభ్యర్ధిగా ప్రకటించిన స్థానాన్నే జనసేన కోరుకోవడం నన్ను అవమానించినట్టుగా భావిస్తున్నా. ఐవీఆర్ఎస్ కాల్స్ వెళ్తున్నాయి. చంద్రబాబు నన్ను సీటు త్యాగం చేయాలని చెప్పేవరకూ ఆగండ’ని చెప్తున్న వీడియో వైరల్ అవుతోంది.
నన్ను P గన్నవరం లో తీసి వేసినట్టు నాకు చెప్ప కుండా జనసేన కి టికెట్ ఇస్తున్నారు IVRS కాల్స్ చేస్తుంది పార్టీ.. ఇది నన్ను అవమానించడమే.. మహాసేన pic.twitter.com/KExd0YXXOt
— Amar Amar (@amarballa2) March 17, 2024