భూముల ధరల్లో తెలుగు రాష్ట్రాల రాజధానులు పరస్పర వైరుధ్యంతో పోటీ పడుతున్నాయి. హైదరాబాద్ లో భూములు ధరలు ఆకాశన్నంటుతుండగా.. అమరావతిలో మాత్రం అథ:పాతాళానికి దిగిపోతున్నాయి. ఇటీవల కాలంలో హైదరాబాద్ లో ని చాలా ప్రాంతాల్లో భూమి ధర ఏకంగా రెట్టింపు కాగా, అమరావతిలో సగం మేర తగ్గిపోయింది. అమరావతిలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా రియల్ ఎస్టేట్ తిరిగి హైదరాబాద్ మీదే ప్రధానంగా దృష్టి పెట్టడంతో ఈ మేరకు మార్పులు చోటుచేసుకున్నాయి.
వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అమరావతి అభివృద్దిపై ప్రతికూల ప్రచారం సాగుతోంది. అక్కడ రాజధాని ఉండటం వైఎస్సార్ సీపీకి ఇష్టం లేదని, రాజధానిని దొనకొండకు మార్చేస్తారంటూ అదేపనిగా వార్తలు వెలువడటం, రాజధానికి రుణం ఇచ్చే ప్రతిపాదన నుంచి ప్రపంచబ్యాంకు వైదొలగడం వంటి అంశాలు అక్కడి రియల్ రంగంపై తీవ్ర ప్రభావం చూపించాయని చెబుతున్నారు.
తెలుగుదేశం హయాంలో అమరావతిలో గరిష్టంగా ఎకరా భూమి ధర రూ.15 కోట్లు పలకగా.. ఇప్పుడు ఆ ధర సగానికి పడిపోయి రూ.7 కోట్లు పలుకుతోంది. అదే సమయంలో హైదరాబాద్ లో భూముల ధరలకు అనూహ్యంగా రెక్కలొచ్చాయి. కూకట్ పల్లిలో రూ.48 కోట్ల నుంచి 58 కోట్లకు చేరగా.. మియాపూర్ లో రూ.12 కోట్ల నుంచి రూ.24 కోట్లకు పెరిగింది. ఇక ఉప్పల్ ప్రాంతంలో ఇప్పటివరకు రూ.10 కోట్ల మేర పలికిన ఎకరం ధర ఇప్పుడు రూ.18 కోట్లకు ఎగబాకింది. శివారు ప్రాంతమైన కొంపల్లిలో సైతం రూ.12 కోట్ల నుంచి రూ.24 కోట్లకు చేరింది.
ఇక హైదరాబాద్ లో ఖరీదైన ప్రాంతాలుగా నిలిచే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ల్లో ఎకరం ధర ఏకంగా రూ.100 కోట్లను సమీపిస్తోంది. ఏపీ కొత్త రాజధాని అమరావతి అని ప్రకటించగానే హైదరాబాద్ లోని చాలామంది రియల్టర్లు తమ మకాం అక్కడకు మార్చేసి భూముల ధరలకు రెక్కలు తొడిగారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు కాస్త ప్రతికూలంగా మారడంతో తిరిగి హైదరాబాద్ కు వచ్చేశారు. ఈ నేపథ్యంలో భూముల ధరల్లో ఈ మార్పులు చోటుచేసుకున్నాయి.
811182 918907Some times its a discomfort inside the ass to read what blog owners wrote but this site is really user friendly ! . 535896
358500 915627Just wanna remark that you have a really good internet internet site , I like the layout it truly stands out. 372705