Vijayendra Prasad: అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ‘పుష్ప’ ఎంతటి హిట్ అందుకుందో తెలిసిందే. కలెక్షన్ల పరంగా ఎన్నో రికార్డులను కొల్లగొట్టింది. సుకుమార్ టేకింగ్, అల్లు అర్జున్ మాస్ నటనకి సినీ విమర్శకుల సైతం ఫిదా అయ్యారు.
ఈ సినిమాపై ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ చెప్పిన మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ‘ పుష్ప’ సినిమా చూస్తున్నప్పుడు నాలో వణుకు పుట్టింది. సగటు ప్రేక్షకుడిగా మెచ్చుకున్నప్పటికీ.. రచయితగా నేను ఇన్ సెక్యూర్ గా ఫీల్ అయ్యా. రాయడంలో నాకంత పట్టులేదని ఆందోళన చెందా ‘ అని చెప్పుకొచ్చారు.
రచయితగా విజయేంద్ర ప్రసాద్ ఎన్నో హిట్ సినిమాలకు కథను అందించారు. బాహుబలి సిరీస్, ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాలకి ఈయనే రచయిత. బాలీవుడ్ లోనూ అడుగు పెట్టి అక్కడా హిట్ అందుకున్నారు. ఇక అల్లు అర్జున్ విషయానికొస్తే ప్రస్తుతం ‘ పుష్ప ది రూల్’ ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేయనున్నారు. దీని తర్వాత బన్నీ..సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం లో ఓ సినిమా చేయనున్నారు.
287921 202776Cool post thanks! We feel your articles are great and hope a lot more soon. We enjoy anything to do with word games/word play. 311326
795966 777656Some really excellent articles on this website , thankyou for contribution. 482944