విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా పరశురాం దర్శకత్వంలో వచ్చిన గీత గోవిందం ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే. ఆ సినిమా తర్వాత దర్శకుడు పరుశురాం చాలా గ్యాప్ తీసుకొని మహేష్ బాబుతో సర్కారు వారి పాట సినిమాను తెరకెక్కించాడు. ఆ సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
సర్కార్ వారి పాట సినిమా తర్వాత నాగ చైతన్య హీరోగా పరశురాం దర్శకత్వంలో ఒక సినిమా రూపొందాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా క్యాన్సల్ అయింది. దాంతో దర్శకుడు పరశురాం ఇప్పుడు తన సూపర్ హిట్ సినిమాగా గీత గోవిందం కి సీక్వెల్ చేసే పనిలో పడ్డాడట.
ప్రస్తుతం గీత గోవిందం సీక్వెల్ స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని దర్శకుడు చేసిన ప్రకటనతో ఒక్కసారిగా సినిమాకి హైప్ పెరిగింది. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ సినిమాను నిర్మించబోతున్నాడు.
గీతా గోవిందం కి ఏ మాత్రం తగ్గకుండా ఈ సీక్వెల్ ని రూపొందిస్తానంటూ దర్శకుడు పరశురామ్ హామీ ఇస్తున్నాడు. ప్రస్తుతం రష్మిక మందన, విజయ్ దేవరకొండ సక్సెస్ కావాలంటే వెయిట్ చేస్తున్నారు. కనుక వారికి ఈ సినిమా సక్సెస్ ని ఇచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అన్ని అనుకున్నట్లు జరిగితే ఇదే సంవత్సరంలో గీత గోవిందం సీక్వెల్ విడుదలైనా ఆశ్చర్యం లేదు.
85840 839802a great deal lately with my father so hopefully this will get him to see my point of view. Fingers crossed! mortgage banker new york 358299
376022 318306When I saw this page was like wow. Thanks for putting your effort in publishing this post. 806341