Switch to English

వైఎస్ జగన్‌కి చేతకాలేదు.! పవన్ అయితే తేల్చేసేవారే: ఉండవల్లి అరుణ్ కుమార్.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,446FansLike
57,764FollowersFollow

అధికారంలోకి రాకముందు ఏవేవో మాట్లాడటం, అధికారంలోకి వచ్చాక మౌనంగా వుండిపోవడం తగదని అంటున్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమస్యల గురించి ప్రస్తావిస్తూ. గతంలో చంద్రబాబు, ఆ తర్వాత వైఎస్ జగన్.. ఇద్దరూ బీజేపీకి దగ్గరగా వుండేందుకే ప్రయత్నించారనీ, ప్రయత్నిస్తున్నారనీ, ఈ క్రమంలో రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బ తింటున్నాయని ఉండవల్లి ఆరోపించారు.

‘విభజన చట్టంలో అన్నీ వున్నాయ్. ఆ చట్టాన్ని పట్టుకుని పార్లమెంటులోనూ, కోర్టుల్లోనూ పోరాడాల్సి వుంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బీజేపీకి లొంగిపోయారు. పవన్ కళ్యాణ్‌కి ప్రజలు అధికారం ఇచ్చి వుంటే ఎప్పుడో తేల్చేసేవారు..’ అంటూ ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు.

అప్పట్లో విభజన చట్టం ద్వారా తెలంగాణ నుంచి 25 వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు రావాల్సి వుందనీ, ఇప్పుడది లక్ష కోట్లకు చేరుకుందని ఉండవల్లి చెప్పుకొచ్చారు. ‘ఆంధ్రప్రదేశ్ అడగకపోతే తెలంగాణ ఎందుకు ఇస్తుంది.? ఇప్పించాల్సిన బాధ్యత కేంద్రానికి వుందిగానీ, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటే తాము మద్యవర్తిత్వం వహిస్తామంటూ కేంద్రం తప్పించుకుంటోంది..’ అని ఉండవల్లి అసహనం వ్యక్తం చేశారు.

‘పవన్ కళ్యాణ్‌కి ప్రజలు అవకాశం ఇవ్వలేదు. అయినాగానీ, ఆయన ప్రజా సమస్యల గురించి మాట్లాడుతున్నారు. ఇలాంటి రాజకీయ నాయకుడ్ని నేను దేశ రాజకీయాల్లో ఇంతకు ముందెన్నడూ చూడలేదు..’ అని చెప్పిన ఉండవల్లి, గతంలో తాను చెప్పిన విషయాల్ని చంద్రబాబు సావధానంగా విన్నారనీ, అయినాగానీ ఆయన ఇప్పుడు విభజన సమస్యలపై గొంతు మెదపడంలేదని ఉండవల్లి చెప్పుకొచ్చారు.

‘ప్రధాన రాజకీయ పార్టీలు అత్యంత బాధ్యత కలిగి వున్నాయి. కానీ, వైసీపీ అలాగే టీడీపీ కేంద్రానికి లొంగిపోయాయ్. ఈ తరుణంలో జనసేన పార్టీ చేయగలిగిందేమీ లేదు. ప్రజల్లోంచే పోరాటం రావాలి..’ అని ఉండవల్లి అభిప్రాయపడ్డారు.

‘చట్టం కల్పించిన హక్కుల్ని సాధించుకోలేకపోతున్నాం. ఈ విషయమై రాష్ట్ర ప్రజలు ఆత్మవిమర్శ చేసుకోవాలి. అధికార పక్షాన్నీ, ప్రతిపక్షాన్నీ నిలదీయాలి.. అప్పుడే కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ మీద ఒత్తిడి పెరుగుతుంది..’ అని ఉండవల్లి స్పష్టం చేశారు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Fahadh Faasil: ‘పుష్ప’తో ఇమేజ్ మారిందా..? ఫహద్ ఫాజిల్ సమాధానం వైరల్

Fahadh Faasil: అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప (Pushpa)  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సినిమాలో...

Sukumar: సుకుమార్ కెరీర్ @20 ఆయన బ్రెయిన్ పవర్ 2.0

Sukumar: లెక్కలు.. ఈ సబ్జెక్టే ఎంతో కష్టం. కానీ.. ఇష్టంగా భావించేవాళ్లకు లెక్కలు తప్ప మరొకటి ఎక్కదు. లెక్కలతో పదునెక్కిన మనిషి మెదడు చేసే ఏ...

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

రాజకీయం

తమ్ముడి గెలుపు కోసం అన్నయ్య.! వైసీపీకి కంగారెందుకు.?

ఏదన్నా కుటుంబం కలిసి మెలిసి వుంటే, చూసి ఓర్చుకోలేని నైజం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన తల్లి దూరం పెట్టడం చూస్తున్నాం. సోదరి షర్మిల అయితే, ఏకంగా...

Chiranjeevi: పిఠాపురం ప్రజలు పవన్ ను గెలిపించండి.. అండగా ఉంటాడు: చిరంజీవి

Chiranjeevi: ‘జనమే జయం అని నమ్మే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మీ ముందుకు వచ్చాడు. మీ కోసం సైనికుడిగా.. సేవకుడిగా నిలబడతాడు. మీకేం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు జనసేన (Janasena)కు...

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా: దర్శకుడు వంశీ

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి దర్శకుడిగా తొలి సినిమా. సితార సినిమా...

తమ్ముడి గెలుపు కోసం అన్నయ్య.! వైసీపీకి కంగారెందుకు.?

ఏదన్నా కుటుంబం కలిసి మెలిసి వుంటే, చూసి ఓర్చుకోలేని నైజం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన తల్లి దూరం పెట్టడం చూస్తున్నాం. సోదరి షర్మిల అయితే, ఏకంగా...

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...