ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిన ప్రతిసారీ ఏదొక ఇష్యూని సృష్టించడం జగన్ నైజమని.. అమలాపురం ఘటన మరో నిదర్శనమని రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. అమలాపురంలో జరిగిన విధ్వంసం ప్రభుత్వసహాయ, సహాకారాలతో వైసీపీ కార్యకర్తలు చేసిందే. అన్నం సతీశ్ టీడీపీ వ్యక్తి అయితే సజ్జల రామకృష్ణారెడ్డిని కౌగిలించుకొని, మంత్రి విశ్వరూప్ కు సన్మానంచేస్తాడా?
సొంత పార్టీ ఎమ్మెల్సీ దళిత యువకుడిని చంపిన ఘటన నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే కోనసీమ ఘటన సృష్టించారు. 144సెక్షన్ అమలులో ఉన్నా పట్టణంలోకి ఒకేసారి అంతమంది ఎలా వచ్చారో ముఖ్యమంత్రి చెప్పాలి. మంత్రి, ఎమ్మెల్యే పొన్నాడ సతీశ్ ఇళ్లు ఇల్లు తగలబడటం రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ వైఫల్యం కాదా..? జిల్లా ముఖ్య పట్టణంలో ఒక్క ఫైర్ ఇంజిన్ కూడా లేదా..?
అమలాపురం విధ్వంసం టీడీపీనే చేయించిందని మంత్రులు, ప్రభుత్వసలహాదారులు పిచ్చివారిలా మాట్లాడుతున్నారు. కోనసీమ అల్లర్లపై ముఖ్యమంత్రి స్పందించకపోవడం దురదృష్టకరం. ప్రజలు ఆందోళన చెందొద్దు. శాంతియుత వాతావరణానికి సహకరించాలి’ అని అన్నారు.
793564 520283I got what you intend, saved to favorites , quite decent internet site . 917529
617745 539907excellent points altogether, you simply won a logo new reader. 849789
820695 504719I like this post, enjoyed this one regards for posting . 393512
855770 470489Constructive criticism is generally looked upon as becoming politically incorrect. 108227
223137 769243U never get what u expect u only get what u inspect 666411