అమలాపురంలో జరిగిన ఘటనల వెనుకు టీడీపీ, జనసేనకు చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు ఉన్నారని మంత్రి విశ్వరూప్ ఆరోపించారు. కోనసీమ జిల్లా పేరు మార్పుపై నిన్న పట్టణంలో జరిగిన విధ్వంసంపై ఆయన స్పందించారు. ‘జిల్లాకు ముందు కోనసీమగానే పేరు పెట్టినా.. టీడీపీ, జనసేన, బీజేపీ కోరిన తర్వాతే పేరు మార్చాం. ప్రశాంతంగా ఉండే కోనసీమలో గత 50ఏళ్లలో ఏనాడూ ఇంతటి విధ్వంసం జరగలేదని అన్నారు. అమలాపురం ప్రజలకు హింసాయుత ఆలోచనలు లేవు. నిన్న జరిగిన ఘటనకు కోనసీమ సాధన సమితి బాధ్యత తీసుకోవాలి’.
‘శాంతియుతంగా జరుగుతున్న ఆందోళనల్లోకి కొంతమంది సంఘవిద్రోహ శక్తులు, రౌడీ షీటర్లు చేరి దశ, దిశలేని ఉద్యమాన్ని రచ్చ చేశారు. నాతోపాటు ఎమ్మెల్యే ఇంటిని కూడా తగులబెట్టి.. సమీపంలో ఉన్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆనందరావు ఇంటిపై ఎందుకు దాడి చేయలేదు..? కోనసీమలోని దళిత సామాజికవర్గానికి విజ్ఞప్తి చేస్తున్నా.. బయటకు రావొద్దు.. రౌడీషీటర్ల ఉచ్చులో పడొద్దు’ అని అన్నారు. అంతకుముందు ఆందోళనకారులు తగులబెట్టిన తన ఇంటిని మంత్రి పరిశీలించారు.
550135 385396If you happen to significant fortunate individuals forms, referring by natural means, in addition you catch the attention of some sort of envy in consideration of those types the other campers surrounding you which have tough times about this subject. awnings 909212