దేశంలో కరోనా తీవ్రత స్థిరంగా కొనసాగుతున్నా.. కేసుల నమోదులో స్వల్ప తగ్గుదల కనిపించింది. మొత్తంగా వరుసగా నాలుగో రోజు కూడా 3వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసులు పెరగడం.. రికవరీలు తక్కువగా నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. కేంద్రం విడుదల చేసిన గణాంకాల ప్రకారం..
గడచిన 24 గంటల్లో దేశంలో 4,71,087 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 3,324 కేసులు నమోదయ్యాయి. ముందు రోజు ఈ సంఖ్య 3,688 గా ఉంది. నిన్న కరోనాతో దేశంలో 40 మంది మృతి చెందగా.. కేరళలోనే 36 మంది మృతి చెందారు. మొత్తంగా కరోనాతో 5,23,843 మంది మృతి చెందారు.
నిన్న దేశవ్యాప్తంగా కరోనా నుంచి 2876 మంది కోలుకున్నారు. మొత్తంగా కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4.25 కోట్లు దాటింది. యాక్టివ్ కేసుల సంఖ్య 19,092 గా ఉన్నాయి. నిన్న 25,95,267 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. మొత్తంగా దేశంలో 189.17 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు పంపిణీ అయ్యాయి.
286924 921195To your organization online business owner, releasing an critical company could be the bread so butter inside of their opportunity, and choosing a great child care company often indicates the particular between a victorious operation this really is. how to start a daycare 884391