ఆరు పదుల వయసు దాటిన వారు కరోనా బారిన పడితే ఛాన్స్ లు 50 ` 50 అంటూ మొదటి నుండి వైధ్యులు చెబుతున్నారు. ఆ వయసు వారికి ఇతర అనారోగ్య సమస్యలు చాలా ఉంటాయి. కనుక వారు కరోనా బారిన పడితే ప్రమాదం అంటూ వైధ్యులు హెచ్చరిస్తూ వచ్చారు.
ఇప్పటి వరకు మృతి చెందిన వారి వివరాలు ఒకసారి పరిశీలిస్తే ఎక్కువ శాతం మంది కూడా వృద్దులే ఉన్నారు. కనుక వారి విషయంలో అంతా కూడా జాగ్రత్తగా ఉంటున్న విషయం తెల్సిందే. అలాంటిది 92 ఏళ్ల వృద్ద మహిళ సుగర్ కూడా ఉన్న ఆమె కరోనాను జయించింది.
గుంటూరు జిల్లా తాడికొండ మండలం మోతడక గ్రామానికి చెందిన రామానుజమ్మ అనే 92 ఏళ్ల వృద్దు రాలు చాలా ఏళ్లుగా సుగర్తో బాధపడుతుంది. ఆమెకు ఇటీవల కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయ్యింది. గుంటూరులోని శ్రావణి ఆసుపత్రిలో చికిత్స పొందినది.
ఇటీవల ఆసుపత్రిలో జాయిన్ అయిన ఆమె వారం రోజుల్లోనే కోలుకుని ఇంటికి చేరుకున్నారు. అంత వయసు వృద్దురాలు కేవలం వారం రోజుల్లోనే కరోనాను జయించడం అంటే నిజంగా వండర్ అంటూ వైధ్యులు చెబుతున్నారు. సుగర్ ఉన్నా కూడా ఆమె ఇమ్యూనిటీ పవర్ బాగుందని వారు పేర్కొన్నారు.
92837 795746I truly prize your piece of work, Excellent post. 994462
135930 584104A thoughtful insight and ideas I will use on my website. Youve certainly spent some time on this. Congratulations! 58170