చైనాలో నూడిల్స్ చాలా ఫేమస్ ఫుడ్. వారికి అక్కడ ఉదయం అల్పాహారమైనా, భోజనమైనా, స్నాక్స్ అయినా నూడిల్స్ కు అధిక ప్రాధాన్యం ఇస్తారు. అంత ఇష్టంగా తినే నూడిల్సే ఇప్పుడు ఒకే కుటుంబంలోని 9 మంది చిన్నారుల ప్రాణం తీసింది. అత్యంత విషాదం నింపిన ఈ సంఘటన చైనాలో జరిగింది.
నార్త్ ఈస్ట్రన్ చైనీస్ ప్రాంతంలోని హెయిలోంగ్ జియాంగ్ లోని అక్టోబర్ 5న ఓ కుటుంబం పార్టీ చేసుకుంది. ఈ పార్టీకి దాదాపు 12 మంది హాజరయ్యారు. అయితే.. వారింట్లో ఏడాది నుంచి ఫ్రిజ్ లో ఉంచిన మొక్కజొన్న పిండితో చేసిన సున్ టంగ్ జి అనే ప్రత్యేకమైన నూడిల్స్ ను తయారు చేశారు.
వారంతా ఉదయం టిఫిన్ గా ఆ నూడిల్స్ ను తిన్నారు. నూడిల్స్ ను తిన్న వెంటనే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా వారిలో 9మంది చిన్నారులు మృతి చెందారు. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదచాయలు నెలకొన్నాయి. ఈ ఘటనపై స్పందించిన చైనా హెల్త్ కమిషన్ జాతీయ హెచ్చరిక జారి చేసింది.
650282 216793I like this web site quite much, Its a really good position to read and receive information . 924881
160487 765142Some truly quality weblog posts on this internet website , saved to my bookmarks . 46249