కేవలం కిలో మట్టి కోసం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) ఎంత ఖర్చు పెడుతోందో తెలుసా? ఏకంగా 900 కోట్ల డాలర్లు.. మన రూపాయల్లో అయితే దాదాపు రూ.66వేల కోట్లు అన్నమాట. ఇంతకీ అది ఎక్కడి మట్టి అంటారా? అంగారకుడిపైది.. అంగారక గ్రహంపై జీవం ఉందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం అక్కడ నుంచి కిలో మట్టి తీసుకురావాలని నాసా నిర్ణయించింది. ఇందుకోసం 900 కోట్ల డాలర్లు వెచ్చించనుంది. ఇది భూమి మీదకు వస్తే.. దీనికంటే ఖరీదైన పదార్థం ఏదీ ఉండదు.
కిలో బంగారం కంటే ఈ కిలో మట్టి విలువ ఏకంగా 2 లక్షల రెట్లు ఎక్కువ. ఇప్పటివరకు రోవర్లు అంగారకుడిపై మట్టిని విశ్లేషించి, వాటి వివరాలను భూమికి పంపించాయి. అయితే, తొలిసారిగా అక్కడ నుంచి మట్టిని తీసుకురాబోతున్నారు. మొత్తం మూడు దశల్లో జరగబోయే ఈ ప్రక్రియకు పదేళ్లకు పైగా సమయం పడుతుందని అంచనా. తొలియాత్రలో ప్రయోగించిన పర్సెవరెన్స్ రోవర్.. అంగారక ఉపరితలాన్ని పరిశీలించి అక్కడి నమూనాలను సేకరిస్తుంది. రెండో దశలో వెళ్లే వ్యోమనౌక ఆ నమూనాలను ఓ లాంచర్ లో ఉంచుతుంది. మూడో వ్యోమనౌక దానిని భూమికి తీసుకొస్తుంది.
603961 152437Aw, it was an incredibly great post. In thought I would like to set up writing related to this moreover – taking time and actual effort to create a very very good article but exactly what do I say I procrastinate alot and also no means manage to go done. 798035
134605 852192I recognize there exists a great deal of spam on this weblog web site. Do you need to have assist cleaning them up? I can help among courses! 829632