అసెంబ్లీ ఎన్నికల్లో చరిత్రాత్మక విజయం సొంతం చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి సరిగ్గా ఏడాది పూర్తయింది. గతేడాది మే 30న విజయవాడలో జరిగిన కార్యక్రమంలో తానేం చేయబోతున్నదీ ఆయన ప్రకటించారు. ఆరు నెలల్లోనే మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటానని చెప్పారు. అదే రోజు వృద్ధాప్య పింఛన్లను రూ.2వేల నుంచి రూ.2,250కి పెంచుతూ తొలి సంతకం చేశారు. దీనిపై వృద్ధులు కాస్త నిరాశ చెందారు. జగన్ వస్తే పింఛన్లు రూ.3వేలు అవుతాయని భావించినవారు.. కేవలం రూ.250 మాత్రమే పెరిగే సరికి చిన్నబుచ్చుకున్నారు. అయితే, ఏడాదికి రూ.250 చొప్పున నాలుగేళ్లలో రూ.3వేలు చేస్తానని సీఎం ప్రకటించడంతో సరిపెట్టుకున్నారు.
అనంతరం గ్రామ సచివాలయ ఉద్యోగాలు, వాలంటీర్ల పోస్టులను భర్తీ చేశారు. రైతుభరోసా, అమ్మఒడి, జగనన్న విద్యాదీవెన వంటి మేనిఫెస్టోలో పేర్కొన్న చాలా అంశాలను అమలు చేస్తూ వచ్చారు. ఏడాదిలోనే దాదాపు 90 శాతం హామీలు అమలు చేశారు. మొత్తమ్మీద వివిధ పథకాల ద్వారా దాదాపు 3.57 కోట్ల మందికి రూ.40వేల కోట్లు లబ్ధి చేకూర్చారు. కరోనా కారణంగా ఆదాయం లేకపోయినా సంక్షేమ పథకాలకు లోటు రాకుండా చూసుకున్నారు. అయితే, సంక్షేమం విషయంలో జగన్ కు మంచి మార్కులే వచ్చినా.. అభివృద్ధి విషయంలో మాత్రం అత్తెసరు మార్కులకు కూడా ఆమడ దూరంలో ఉండిపోయారు.
ప్రజావేదిక కూల్చివేతతో ఆరంభమైన జగన్ పాలన.. అభివృద్ధి విషయంలో మాత్రం తిరోగమనంలోనే సాగుతుందన్న విమర్శలున్నాయి. రాష్ట్రానికి మూడు రాజధానులు తీసుకు రావాలన్న నిర్ణయానికి అడ్డంకులు ఎదురు కావడంతో రాజధానిపై గందరగోళం సాగుతోంది. ఫలితంగా ఏ ప్రాంతమూ అభివృద్ధి కాని పరిస్థితి నెలకొంది. ఇక రివర్స్ టెండరింగ్ వల్ల ఖజానాకు సొమ్ములు ఆదా అయినా.. పోలవరం కాంట్రాక్టర్ ని మార్చడంతో ఆ పనులు మరింత జాప్యమయ్యాయి. నిజానికి పాలకులు సంక్షేమం పైనే కాకుండా అభివృద్ధి పైనా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఏ దేశానికైనా, ఏ రాష్ట్రానికైనా అభివృద్ధి, సంక్షేమం రెండూ ముఖ్యమే. అభివృద్ధి ఉంటే సంక్షేమానికి తిరుగు ఉండదు. అలా కాకుండా కేవలం సంక్షేమం పైనే దృష్టి పెట్టి అభివృద్ధిని విస్మరిస్తే నష్టం తప్పదు. సంపద పెంచడం ద్వారా ప్రజల కొనుగోలు శక్తిని పెంచాలి.
ఆస్తులు అమ్మి, అప్పులు చేసి సంక్షేమ పథకాలను అమలు చేయడం నిరంతరం కుదరని పని. కూర్చుని తింటే కొండలైనా తరిగిపోతాయన్న చందంగా.. ఆదాయం పెంచకుండా సంక్షేమానికి కోట్లు ఖర్చు చేసుకుంటూ పోతే రాష్ట్రం మరిన్ని అప్పుల్లో కూరుకుపోయి దివాళా తీయడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సంక్షేమంలో సరే అనిపించుకుంటున్న జగన్.. అభివృద్ధిలో కూడా అదే దూకుడు చూపిస్తేనే.. ఆయన కోరుకుంటున్నట్టుగా 30 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండిపోవచ్చు. మరి రెండో ఏడాది పాలనలో ఆ మేరకు మార్పులు చూపిస్తారేమో చూడాలి.
54541 588602Hello. I wanted to ask one thingis this a wordpress web website as we are planning to be shifting more than to WP. Furthermore did you make this template yourself? Thanks. 440469
646785 866770Hey, you used to write great, but the last few posts have been kinda boringK I miss your great writings. Past few posts are just a little bit out of track! come on! 683646