చైనా తయారు చేసి తమకు పంపించిన వ్యాక్సిన్ అంత ప్రభావవంతమైనది కాదని తేల్చేసింది పాకిస్థాన్. కరోనా నివారణకు చైనా ప్రభుత్వ రంగ సంస్థ సినోఫార్మ్ వ్యాక్సిన్ 5 లక్షల టీకాలను పాకిస్థాన్ కు విరాళంగా ఇచ్చింది చైనా. అయితే.. ఈ వ్యాక్సిన్ 60 ఏళ్ల పైబడినవారికి సరిగా పని చేయడం లేదని తేల్చింది. ఈమేరకు ఆ దేశానికి చెందిన నిపుణుల కమిటీ వ్యాక్సిన్ పై అధ్యయనం చేసి రిపోర్టు ఇచ్చింది.
ఈ నివేదికను పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రత్యేక సలహాదారుడు ఫైజల్ సుల్తాన్ ప్రకటించారు. 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసులోపు వారికి మాత్రమే ఈ వ్యాక్సిన్ వేయాలని కమిటీ సూచించింది. టీకా ఎంత ప్రభావవంతమైనదో పూర్తి డేటా రావాల్సి ఉందని.. అప్పుడే ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు. పాకిస్థాన్ లో బుధవారం ప్రారంభమైన వ్యాక్సినేషన్ నేపథ్యంలో ఈ వివరాలను వెల్లడించారు. చైనాలో ప్రస్తుతం 16 వ్యాక్సిన్లపై ప్రయోగాలు జరుగుతున్నాయి.
724376 604217Nice read, I just passed this onto a colleague who was doing slightly research on that. And he just bought me lunch since I located it for him smile So let me rephrase that: Thank you for lunch! 677349